నందమూరి బాలకృష్ణ కెరీర్లో ఆయనకు మరో అరుదైన గౌరవం వచ్చి చేరింది. న్యూఢిల్లీలోని భరత్ మండపంలో అట్టహాసంగా జరిగిన అంతర్జాతీయ ఢిల్లీ చలనచిత్రోత్సవం (IFFD) 2026 వేడుకల్లో బాలకృష్ణను ‘భైరవ-రుద్ర’ సేమ్ టు సేమ్ అట!?‘జీవిత సాఫల్య పురస్కారం’ (Lifetime Achievement Award)తో ఘనంగా సత్కరించారు. సినిమా రంగంలో యాభై ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న బాలకృష్ణ పౌరాణిక పాత్రల్లో తండ్రికి తగ్గ తనయుడిగా మెప్పించడమే కాకుండా, మాస్ ఎంటర్టైనర్లతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం…
యాంకర్ స్రవంతి చొక్కరపు తాజాగా ఒక వివాదంపై ఘాటుగా స్పందించారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించి ఒక ‘బెట్టింగ్ యాప్’ ప్రమోషన్ వీడియో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తుండటంతో, ఆమె స్వయంగా రంగంలోకి దిగి అసలు విషయాన్ని బయటపెట్టారు. సదరు వీడియోపై క్లారిటీ ఇస్తూ.. అది ఇప్పటిది కాదని, చాలా కాలం క్రితం చేసిన పాత ప్రమోషన్ అని స్రవంతి స్పష్టం చేశారు. “ఆ సమయంలో నాకు వీటిపై…
జీ స్టూడియోస్ సమర్పణలో నిహారిక కొణిదెల తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్పై ఉమేష్ కుమార్ బన్సాల్తో కలిసి ‘రాకాస’ మూవీని నిర్మించారు. మానస శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్, పాటలు, ప్రమోషనల్ కంటెంట్ అంతా కూడా అందరినీ ఆకట్టుకుంది. ఇక తాజాగా ఈ చిత్ర విశేషాల్ని పంచుకునేందుకు దర్శకురాలు మానస శర్మ మీడియాతో ముచ్చటించారు. ఆమె చెప్పిన సంగతులివే..…
ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎక్కడ చూసినా ‘దురంధర్’ సినిమా గురించే చర్చ జరుగుతోంది. కేవలం 104 రోజుల వ్యవధిలో రెండు భాగాలను విడుదల చేసి, రెండింటితోనూ భారీ విజయాలను అందుకోవడం మామూలు విషయం కాదు. ఈ సినిమా సాధించిన వసూళ్ల సునామీతో ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త చర్చ మొదలైంది. ఫ్రాంచైజీ సినిమాలు తీసే మేకర్స్ అందరూ ఇప్పుడు ‘దురంధర్’ స్ట్రాటజీని ఫాలో అవ్వాలని అనుకుంటున్నారు. సాధారణంగా ఒక సినిమా హిట్ అయితే, దాని సీక్వెల్…
‘అదుర్స్ 2’ పై క్రియేటివ్ డైరెక్టర్ వి.వి. వినాయక్ సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కల్ట్ క్లాసిక్ ‘అదుర్స్’ సీక్వెల్పై ఆయన పెదవి విరిచారు. రచయిత కోన వెంకట్ ఇటీవల ‘అదుర్స్ 2’ స్క్రిప్ట్ సిద్ధంగా ఉందని చేసిన వ్యాఖ్యలపై వినాయక్ స్పందిస్తూ, ఫ్యాన్స్కు కాస్త చేదు నిజం చెప్పారు. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ‘అదుర్స్’ సృష్టించిన ప్రభంజనం అంతా…
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య విడుదలైన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోతోంది. మార్చి 19న ఉగాది కానుకగా విడుదలైన ఈ చిత్రం పవన్ మార్కు మేనరిజమ్స్ మరియు డైలాగులతో అభిమానులను అలరించినప్పటికీ బలహీనమైన కథనం మరియు పాతచింతకాయ పచ్చడి లాంటి స్క్రీన్ప్లే కారణంగా డిజాస్టర్ దిశగా సాగుతోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సృష్టించిన సంచలనం…
హైటెక్స్ లో ఘనంగా ఏర్పాటు చేసిన “తెలంగాణ గద్దర్ సినీ అవార్డ్స్” వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. 2025వ సంవత్సరానికి సంబంధించి అవార్డులను అందుకున్న నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, ఇతర నటులు, గేయ రచయితలు, నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు, సాంకేతిక నిపుణులకు పలు అవార్డులు అందజేశారు. ప్రజా యుద్ధనౌక గద్దర్ స్మారకార్థం తెలంగాణ ప్రభుత్వం పునరుద్ధరించిన ఈ అవార్డుల వేడుకకు టాలీవుడ్ తారాలోకం తరలివచ్చింది. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకమైన ‘ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్…
తెలంగాణ గడ్డపై కళలకు, కళాకారులకు అత్యున్నత గౌరవం కల్పించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025’ను నిర్వహించింది. హైదరాబాద్లోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ వేడుకలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. దాదాపు పదేళ్లుగా నిలిచిపోయిన సినీ అవార్డుల ప్రదానోత్సవాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో మళ్లీ పునఃప్రారంభించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రజా గాయకుడు గద్దర్ పేరు మీద ఈ అవార్డులను…
Surekha – Chiranjeevi : నగరంలోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్లో ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025’ ప్రదానోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అవార్డుల ప్రదానోత్సవం మధ్యలో యాంకర్ సుమ, చిరు దంపతులతో జరిపిన సరదా ముచ్చట్లు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. సోషల్ మీడియాలో చిరంజీవి అప్పుడప్పుడు ‘చిరు లీక్స్’ పేరుతో సినిమా లీక్స్ షేర్…
అల్లు అరవింద్ మెగా నిర్మాతగా గతంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించి హిట్లు కొట్టారు. అయితే, ప్రస్తుతానికి ఆయన నిర్మాతగా రెస్ట్ తీసుకుంటున్నారు. ఆయన ఆధ్వర్యంలో బన్నీ వాసు, విద్యా కొప్పినీడి వంటి వారు గీతా ఆర్ట్స్ నిర్మాణ బాధ్యతలు తీసుకుని, ‘గీతా ఆర్ట్స్ 2’ పేరిట బ్యానర్ ఏర్పాటు చేసి సినిమాలు చేస్తున్నారు. అయితే, తాజాగా గద్దర్ అవార్డ్స్ ఈవెంట్ వద్ద యాంకర్ సుమ అల్లు అరవింద్ ని ఒక…