ప్రస్తుతం క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ తో డేరింగ్ అండ్ డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ ‘లైగర్’ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను ఆగస్ట్ 25న విడుదలచేయాలన్నది నిర్మాతలు కరణ్ జోహార్, పూరి, ఛార్మి ఆలోచన. ఆ దిశగా పోస్ట్ ప్రొడక్షన్ పనులకూ శ్రీకారం చుట్టారు. అయితే… ఈ సినిమా విడుదల కంటే ముందే పూరి జగన్నాథ్ – విజయ్ దేవకొండతో ‘జన గణ మన’ చిత్రం తెరకెక్కించబోతున్నాడు. ఈ మూవీతో శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్…
నేహాశెట్టి… ‘మోహబూబా, గల్లీరౌడీ’ చిత్రాల్లో మెరిసిన కన్నడ కస్తూరి. తెలుగునాట కన్నడ భామల హోరు జోరుగా కొనసాగుతున్న నేపథ్యంలో నేహా కూడా టాలీవుడ్ పై కన్నేసింది. తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్స్ గా రాణిస్తున్న రష్మిక మందన్న, పూజా హెగ్డే కన్నడ భామలే కావటంతో వారి బాటలో తను కూడా స్టార్ కావాలని తాపత్రయపడుతోంది నేహా శెట్టి. తాజాగా కృతి శెట్టి కూడా హ్యాట్రిక్ హిట్స్ తో తెలుగునాట పాగా వేసిన నేపథ్యంలో నేహా నటించిన…
కామెడీ చిత్రాలతో కడుపుబ్బా నవ్వించిన నేటి తరం కామెడీ స్టార్ అల్లరి నరేష్. కామెడీ చిత్రాలే కాదు… ‘విశాఖ ఎక్స్ప్రెస్, గమ్యం, నాంది, మహర్షి’ వంటి వైవిధ్యమైన కథాంశాలున్న చిత్రాల్లోనూ నటించి నటుడిగా మెప్పించారాయన. ‘అల్లరి’ నరేష్, ఆనంది హీరో హీరోయిన్లుగా ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ సమర్పణ, నిర్మాణంలో హాస్య మూవీస్ బ్యానర్పై రాజేష్ దండ నిర్మాతగా కొత్త చిత్రం సోమవారం లాంఛనంగా పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ చిత్రానికి ఎ.ఆర్.మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు.…
నవతరం ప్రేక్షకుల నాడిని పట్టి కథలు వినిపిస్తున్న మేటి రచయిత ఎవరంటే ఇప్పట్లో విజయేంద్రప్రసాద్ పేరునే చెబుతారు జనం. తెలుగు సినిమా వెలుగును దశదిశలా ప్రసరింప చేసిన బాహుబలి సీరిస్ విజయేంద్రప్రసాద్ కలం నుండే చాలువారింది. ఆయన రచనలతో అనేక చిత్రాలు విజయపథంలో పయనించాయి. మాతృభాష తెలుగులోనే కాదు, తమిళ, హిందీ భాషల్లోనూ విజయేంద్రప్రసాద్ రచనలు జనాన్ని మెప్పించాయి. విజయేంద్రప్రసాద్ రచనలతో తెరకెక్కే సినిమాల కోసం జనం ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. విజయేంద్రప్రసాద్ పూర్తి పేరు కోడూరి…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ మూవీని ఫిబ్రవరి 25వ తేదీ లేదా ఏప్రిల్ 1న విడుదల చేస్తామని ఆ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ నిన్న తెలిపింది. సరిగ్గా ఇప్పుడు అదే బాటలో వరుణ్ తేజ్ ‘గని’ సినిమా నిర్మాతలూ నడువ బోతున్నారు. నిజానికి ఈ సినిమాను మార్చి 18న విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించిన నిర్మాతలు ఇప్పుడు పలు చిత్రాల విడుదల తేదీలలో జరిగిన మార్పులను దృష్టిలో పెట్టుకుని రెండు…
నవ్వుకే నవ్వు పుట్టించగల సమర్థుడు హాస్యనటబ్రహ్మ బ్రహ్మానందం. ‘నవ్వు, నవ్వించు, ఆ నవ్వులు పండించు’ అన్నట్టుగా ఎప్పుడూ నవ్వుతూనే కనిపించే బ్రహ్మానందం చిత్రసీమలో తన నవ్వుల నావ నడపడానికి ముందు చిరునవ్వుతోటి విషవలయాలను ఛేదిస్తూ ముందుకు సాగారు. చిన్నప్పటి నుంచీ నవ్వునే నమ్ముకొని హాస్యబలం పెంచుకున్నారు. బాల్యంలోనే తనకు తెలిసిన వారిని అనుకరిస్తూ, వారి చేష్టలను చూపించి తన చుట్టూ ఉన్న వారికి నవ్వులు పంచేవారు. ఏ ముహూర్తాన ఆయన కన్నవారు బ్రహ్మానందం అని నామకరణం చేశారో…
ఇప్పుడంటే జాకీ ష్రాఫ్ ఎవరు అన్న ప్రశ్నకు టైగర్ ష్రాఫ్ తండ్రి అనే సమాధానం లభిస్తుందేమో కానీ, ఒకప్పుడు జాకీ ష్రాఫ్ చేయి తగిలితే చాలు అని పలవరించిన భామలు ఉన్నారు. జాకీ ష్రాఫ్ యాక్టింగ్ స్టైల్ చూసి ఫిదా అయిపోయిన వారెందరో! అడపా దడపా తెలుగు చిత్రాల్లోనూ విలన్ గానో, కేరక్టర్ యాక్టర్ గానో దర్శనమిచ్చే జాకీ ష్రాఫ్ అందరికన్నా ముందు తెలుగువారికే పరిచయస్థుడు. అదెలాగంటే మన హైదరాబాద్ లో తయారయ్యే చార్మినార్ సిగరెట్స్కు అప్పట్లో…
గతేడాది యూట్యూబ్ సిరీస్ లలో బాగా పేరుతెచ్చుకున్న వెబ్ సిరీస్ 30 వెడ్స్ 21. తన కన్న 10 ఏళ్ళు చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఒక యువకుడి కథను ఎంతో వినోదాత్మకంగా చూపించారు. చైతన్య రావ్ – అనన్య జంటగా మనోజ్-అసమర్థ్ సంయుక్తంగాకథను అందించిన ఈ సీజన్ 1 ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తాజాగా ఈ సిరీస్ కి కొనసాగింపు మొదలైంది. 30 వెడ్స్ 21 సీజన్ 2…
ఇండియన్ ఆర్మీకి నటుడు సుమన్ 117 ఎకరాల భూమిని విరాళం ఇచ్చినట్టు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దానిపై ఆయన స్పందించారు. సుమన్ మాట్లాడుతూ “సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నటువంటి వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదు. వాటిని నమ్మవద్దు. ఆ భూమికి సంబంధించి వివాదం కోర్టులో కొనసాగుతోంది. వివాదానికి పరిష్కారం లభించిన వెంటనే… వ్యక్తిగతంగా నేనే అందరికీ తెలియజేస్తాను. దానికి సంబంధించి ఏ విషయమైనా నేనే చెబుతాను” అని తెలిపారు.
ప్రముఖ నటి ప్రియమణి ‘భామా కలాపం’ ఒరిజినల్ ద్వారా ఆహా ఓటీటీ మాధ్యమంలోకి అడుగుపెడుతున్నారు. అభిమన్యు తాడి మేటి ఈ వెబ్ ఒరిజినల్ను డైరెక్ట్ చేశారు. ఫిబ్రవరి 11న ‘ఆహా’లో ఇది స్ట్రీమింగ్ కాబోతోంది. ‘డియర్ కామ్రేడ్’ డైరెక్టర్ భరత్ కమ్మ షో రన్నర్ కాగా, అభిమన్యు తాడి దీనిని డైరెక్ట్ చేశారు. ఈ వెబ్ ఒరిజినల్ ట్రైలర్ను ‘లైగర్’ స్టార్ విజయ్ దేవరకొండ సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ ”నేను…