ప్రముఖ నిర్మాత, భవ్య సంస్థల అధినేత వి. ఆనంద ప్రసాద్ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామికి పరమ భక్తులు. ఆయన కుటుంబం హైదరాబాద్ లో భవ్య భవన సముదాయ ప్రాంగణంలో వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా నిర్మించింది. అలానే హైదరాబాద్ నుండి తిరుమలకు ఆనంద్ ప్రసాద్ కాలినడకన వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. 2015లో టీటీడీ ఆధ్వర్యంలోని బర్డ్స్ హాస్పిటల్ కు వి. ఆనంద ప్రసాద్ కోటి రూపాయల విరాళం ఇచ్చారు. తాజాగా తిరుమల తిరుపతి…
సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘లవ్ స్టోరీ’.. అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లు తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ లోనే రిలీజ్ కావాల్సివుండగా కరోనా సెకండ్ వేవ్ తో వాయిదా పడింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు రీ-ఓపెన్ కానున్న నేపథ్యంలో విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే చాలా చోట్ల థియేటర్లు ముస్తాబు అవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ‘లవ్ స్టోరీ’ ఈ నెల 30వ తేదీన ఈ…
రీల్ లైఫ్లోనే కాదు.. రియల్ లైఫ్లోనూ జగపతి బాబుది డిఫరెంట్ లైఫ్ స్టైల్.. తాజాగా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన లేటెస్ట్ ఫోటో వైరల్ గా మారింది. తెలుపు కుర్తా పైజామాలో ఉన్న జగపతిబాబు చేతిలో బ్లాక్ గాగుల్స్ పెట్టుకొని గోడపై కూర్చున్న స్టిల్ను ట్విటర్ పోస్ట్ చేశారు. అయితే చూడ్డానికి ‘డైనమిక్ పొలిటిషియన్ లా కనిపిస్తున్నారు.. మీరు త్వరలో పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నారా..?’ అని ఓ అభిమాని ప్రశ్నించాడు. జగ్గూభాయ్ రిప్లై ఇస్తూ..…
గత యేడాది కరోనా తొలిదశలో ప్రభుత్వాలే థియేటర్ల మూసివేతకు ఉత్తర్వులు జారీ చేయగా, ఈ సంవత్సరం సెకండ్ వేవ్ సమయంలో ప్రభుత్వ ఉత్తర్వుల కంటే ముందే థియేటర్ల యాజమాన్యం స్వచ్ఛందంగా తమ సినిమా హాల్స్ ను మూసేశారు. అలానే పలువురు నిర్మాతలూ షూటింగ్స్ ఆపేశారు. ఆ తర్వాతే వీటిని నిషేధిస్తూ ప్రభుత్వాలు ఉత్తర్వులు ఇచ్చాయి. అయితే అన్ లాక్ ప్రక్రియ మొదలైన తర్వాత కూడా థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితుల్లో కొంతమంది నిర్మాతలు ఇప్పుడిప్పుడే ఓటీటీ…
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో సంగీతం ఏ లెవెల్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మొదలు, పాటల దాకా ప్రత్యేక దృష్టిపెడుతారు. అంతేకాదు, సంగీత దర్శకులతోను మంచి వాతావరణం ఏర్పరచుకొని.. తనకు కావాల్సిన ట్యూన్స్ వచ్చే దాకా కథను పూర్తిగా వారి మదిలో నింపేస్తుంటారు. అందుకే ఆయన సినిమాలో సంగీతం అంత స్పెషల్ గా ఉంటుంది. ప్రస్తుతం త్రివిక్రమ్-సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. దీనిపై…
(నందమూరి కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు సందర్భంగా) బాల్యంలో యమ దూకుడుగా ఉన్న ఆ కుర్రాడిని ఇప్పుడు చూసిన వాళ్ళు, ఇంత సౌమ్యుడై పోయాడేమిటీ? అని ఆశ్చర్యపోతారు! యుక్తవయసులో అమ్మాయిలంటేనే ఆమడ దూరంలో ఉండే ఆ కుర్రాడు… వెండితెరపై ఇంతలా రొమాన్స్ పండిస్తున్నాడేమిటా అని విస్తుపోతారు! తాతగారు, మహానటుడు ఎన్టీఆర్ పేరును తన సొంత బ్యానర్ కు పెట్టుకున్నందుకు, అంతే భక్తి శ్రద్ధలతో సినిమాలు నిర్మిస్తున్న అతన్ని చూసి ఆనంద పడతారు! అతనే నందమూరి కళ్యాణ్ రామ్!!…
కొత్త సినిమాటోగ్రఫి బిల్లుపై హీరో సుధీర్ బాబు అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ‘సినిమాటోగ్రాఫ్ (అమెడ్మెంట్) బిల్ 2021’ పై తీవ్రంగా స్పందించాడు. ‘ఇప్పటికే సినిమా ఈజీ టార్గెట్ ఉంది. ఈ కొత్త బిల్లు అమల్లోకి వస్తే మరింత ఈజీ టార్గెట్ గా మారిపోతుంది. అయినా రీ సెన్సార్ అనేదే ఉండేటట్లైతే ఇక ‘సీబీఎఫ్సీ’ ఎందుకు?’ అని ఆయన ప్రశ్నించాడు. అంతే కాదు, ఒకింత ఘాటుగా… ‘’నిజంగా రాజకీయ నాయకులు తాము మాట్లాడే…
(జూలై 4 సత్యదేవ్ బర్త్ డే సందర్భంగా…) వైజాగ్ లో పుట్టి, విజయనగరంలో ఇంజనీరింగ్ చదివి, బెంగళూర్ లో సాఫ్ట్ వేర్ జాబ్ చేసి… హైదరాబాద్ లో నటుడిగా స్థిరపడ్డాడు సత్యదేవ్. అందరిలా అతను కేవలం నటుడు కాదు… విలక్షణ పాత్రలు చేస్తున్న సలక్షణ నటుడు. జూలై 4, 1989లో పుట్టిన సత్యదేవ్ ఇవాళ 33వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాడు. నటుడు కావాలనే కోరికతో తీవ్రమైన ప్రయత్నాలు చేసి, ఒకటి రెండు సినిమాల్లో ఇలా కనిపించి అలా…
భారత ప్రభుత్వం తాజాగా చేసిన సినిమాటోగ్రఫీ సవరణ వల్ల భావ ప్రకటనా స్వేచ్ఛకు భారీ దెబ్బ తగలనుంది. దీనివల్ల 1952 నాటి సినిమాటోగ్రఫీ చట్టాన్ని అనుసరించి సెన్సార్ బోర్డ్ క్లీన్-చిట్ ఇచ్చిన చిత్రాలను తిరిగి కేంద్ర ప్రభుత్వం సినిమాలను రీఎగ్జామ్ చేసే అధికారం రానుంది. అంటేపరోక్షంగా సెన్సార్ బోర్డు నుండి క్లియరెన్స్ పొందిన ఏ చిత్రంనైనా నిషేధించటం లేదా చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఏర్పడుతుంది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా వివిధ సినీ పరిశ్రమలకు చెందిన పలువురు…
సీనియర్ స్టార్ హీరోలలో యమజోరుగా ఉంది విక్టరీ వెంకటేశే! ఈ యేడాది ద్వితీయార్థంలో వెంకీమామ నటిస్తున్న మూడు చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ విడుదల కాబోతున్నాయి. సెన్సార్ ను కూడా పూర్తి చేసుకున్న తమిళ ‘అసురన్’ తెలుగు రీమేక్ ‘నారప్ప’ అతి త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. అలానే ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ చివరి దశలో ఉన్న మలయాళ రీమేక్ ‘దృశ్యం -2’ సైతం ఓటీటీ వైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. అయితే… వీటి స్ట్రీమింగ్…