Home
Tollywood News
Tollywood News News
-
సినీ పెద్దలతో ముగిసిన మంత్రి పేర్నినాని సమావేశం
టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, ఏపీ మంత్రి పేర్నినానితో జరిపిన సమావేశం ముగిసింది. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహించిన ఈ సమావేశంలో ప్రముఖ నిర్మాతలు దిల్రాజు, డీవీవీ దానయ్య, సి.కల్యాణ్, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులు పాల్గొన్నారు. నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం నుంచి మంచి భరోసా లభించింది. ఆన్ లైన్ టిక్కెటింగ్ కావాలని మేమే అడిగాము. ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా సంతోషంగా ఉంది. సినిమా ఇండస్ట్రీకి ఊతం ఇచ్చారు’ అని సి.కళ్యాణ్ తెలిపారు. నిర్మాత… -
అసలు సిసలు నవలానాయకుడు అక్కినేని!
తెలుగు చిత్రసీమలో నవలానాయకుడు అనగానే నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు ముందుగా గుర్తుకు వస్తారు. ఆయన నటజీవితంలో పలు మేలుమలుపులన్నీ నవలాచిత్రాలే కావడం విశేషం. ఏయన్నార్ ను మహానటునిగా నిలిపిన ‘దేవదాసు’ చిత్రం శరత్ చంద్ర ఛటర్జీ రాసిన బెంగాలీ నవల ఆధారంగా తెరకెక్కింది. ఆ తరువాత బెంగాలీ నవలలతోనే ఏయన్నారు మంచి విజయాలను చవిచూశారు. మణిలాల్ బెనర్జీ రాసిన ‘స్వయంసిద్ధ’ ఆధారంగా రూపొందిన ‘అర్ధాంగి’లో అక్కినేని పిచ్చివాడుగా చేసిన అభినయం ఆకట్టుకుంది. మరో మహానటుడు యన్టీఆర్ తో… -
సాయిధరమ్ తేజ్ తాజా హెల్త్ బులెటిన్ విడుదల
టాలీవుడ్ నటుడు సాయిధరమ్ తేజ్ కోలుకుంటున్నారని అపోలో ఆసుపత్రి వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. సాయిధరమ్ తేజ్ స్పృహలోనే ఉన్నారని పేర్కొన్నారు. వెంటిలెటర్ తొలగించామని, సొంతంగానే శ్వాస తీసుకుంటున్నారని చెప్పారు. మరికొద్ది రోజులు సాయిధరమ్ తేజ్ ఆసుపత్రిలోనే ఉండి చికిత్స తీసుకుంటారని వివరించారు. గత ఆదివారం సాయి ధరమ్ తేజ్కు వైద్యులు కాలర్ బోన్ సర్జరీని నిర్వహించారు. ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగవుతున్నదని వైద్యులు వివరించారు. సాయి ధరమ్ తేజ్ వినాయక… -
మహేశ్ AMBలా విజయ్ దేవరకొండ AVD
నాగచైతన్య ‘లవ్ స్టోరీ’తో ఆరంభం హీరోగా టాప్ లీగ్ లోకి వెళ్లాలనుకుంటున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం ప్యాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఇక కెరీర్ ఆరంభం నుంచి సినిమాలతో బిజీగా ఉన్నా బిజినెస్ పైనా దృష్టి పెట్టాడు. రౌడీ బ్రాండ్ పేరుతో దుస్తుల వ్యాపారం ఆరంభించి సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు ఇతర హీరోల తరహాలో థియేటర్ వ్యాపారంలోనూ తనదైన ముద్ర వేసేందుకు అడుగు ముందుకు వేశాడు. డిస్ట్రిబ్యూటర్స్ ఏషియన్ సినిమాస్ వారితో చేతులు కలిపి మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి… -
ఎన్టీఆర్ తో అలియా భట్!?
ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇస్తోంది బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్. ఇందులో చరణ్ కి జోడీగా నటిస్తోంది ఆలియా. అయితే ఆలియా టాలీవుడ్ లో మరో సినిమాకు ఓకె చెప్పిందట. అందుబాటులో ఉన్న సమచారం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ తో కొరటాల శివ తీస్తున్న సినిమాలో ఆలియా నటించబోతోందట. ఎన్టీఆర్ నటిస్తున్న 30 వ చిత్రమిది. దీని కోసం అద్భుతమైన కథను రెడీ చేశాడు కొరటాల. ఎప్పటిలాగే తనదైన సోషల్ మెసేజ్ మిస్ కాకుండా పవర్… -
‘మా’ ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల.. నియమ నిబంధనలివే!
‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికలు అక్టోబరు 10వ తేదీన నిర్వహించనున్న విషయం తెలిసిందే.. కాగా, తాజాగా ‘మా’ ఎన్నికలకు సంబంధించిన తేదీ, నియమ నిబంధనలు అధికారికంగా ప్రకటించారు. అక్టోబర్ 10న ఆదివారం ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ హైదరాబాద్ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి కృష్ణమోహన్ తెలిపారు. అదే రోజు రాత్రి ఏడు గంటలకు ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి. సెప్టెంబరు 27, 28, 29 తేదీల్లో నామినేషన్లు… -
డ్రగ్స్ కేసు: పూరి జగన్నాథ్, తరుణ్ లకు భారీ ఊరట.. క్లీన్ చిట్
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్, నటుడు తరుణ్ కు భారీ ఊరట లభించింది. పూరి, తరుణ్ నమునాల్లో డ్రగ్స్ లేవని ఎఫ్ఎస్ఎల్ తేల్చేసింది. పూరి, తరుణ్ రక్తం, వెంట్రుకలు, గోళ్లును రాష్ట్ర ఫోరెన్సిక్ లేబొరేటరీ పరీక్షించారు. 2017 జులైలో పూరి, తరుణ్ నుంచి నమూనాలను ఎక్సైజ్ శాఖ సేకరించిన విషయం తెలిసిందే. స్వచందంగా రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలు ఇచ్చారని ఎక్సైజ్ పేర్కొంది. గతేడాది డిసెంబరు 8న ఎక్సైజ్ కు ఎఫ్ఎస్ఎల్ నివేదికలు… -
కొరటాల శివకు ఎన్టీఆర్ టాస్క్!
‘జనతా గ్యారేజ్’ వంటి సూపర్ హిట్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ – దర్శకుడు కొరటాల కాంబోలో మరో సినిమా రానున్న సంగతి తెలిసిందే.. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తిచేసుకొని తారక్ ఉండగా.. కొరటాల ఆచార్య విడుదల కోసం వెయిట్ చేస్తున్నాడు. అయితే తారక్-కొరటాల సినిమా అనౌన్స్ మెంట్ వచ్చి చాలాకాలమే అవుతున్న మిగితా అప్డేట్స్ ఏమి రాకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశగా ఉన్నారు. అయితే తాజా సమాచారం మేరకు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్… -
చోరుడికి రాజ మార్గం! శ్రీవిష్ణు ఆనందోత్సాహం!!
మంచి కంటెట్తో ఫీల్గుడ్ సినిమాలను అందించే హీరోగా శ్రీవిష్ణు ప్రేక్షకుల మదిలో నిలిచారు. అప్పట్లో ఒకడుండే వాడు, నీది నాది ఒకే కథ, మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా చిత్రాలతో తనకంటూ టాలీవుడ్లో ఓ మార్కెట్ను ఎస్టాబ్లిష్ చేసుకొన్నారు. యావరేజ్ నుంచి మినిమమ్ గ్యారెంటీ హీరోగా తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకొన్నారు శ్రీవిష్ణు.. ఆయన ఇటీవలే నటించిన ‘రాజ రాజ చోర’ చిత్రం నేటికీ 30 రోజులు పూర్తిచేసుకొంది. ఈ సందర్బంగా చోరుడికి రాజ మార్గం!… అంటూ శ్రీవిష్ణు… -
భీమ్లా నాయక్: ‘డానియల్ శేఖర్’ అప్డేట్ వచ్చేసింది
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా రూపొందుతున్న చిత్రం భీమ్లా నాయక్.. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన పవన్ & టైటిల్ గ్లింప్స్ కు భారీ రెస్పాన్స్ రాగా, విడుదలైన మొదటి పాట కూడా రికార్డ్స్ సాధించింది. ఇక అందరు రానా అప్డేట్స్ కోసం ఎంతగానో ఎదురుచూస్తుండగా.. తాజాగా ఆయనకు సంబందించిన అప్డేట్ ప్రకటించింది చిత్రబృందం. ‘బ్లిట్జ్ ఆఫ్ డానియెల్ శేఖర్’ ప్రోమోను ఈనెల 20న విడుదల చేయబోతున్నట్లుగా పోస్టర్ రిలీజ్ చేశారు.…
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: 2027 వరల్డ్కప్లో రోహిత్, విరాట్ ఉంటారా?.. బీసీసీఐ సమాధానంపై ఆసక్తికర చర్చ
-
Vikram Malik: వెల్కమ్ టూ ‘జడల్ జమానా’! ‘ది ప్యారడైజ్’ నుంచి ఇప్పుడు ఎవడు వస్తున్నాడో ఎరికెనా?
-
Nagabandham Trailer: అనంత పద్మనాభ స్వామి ఆలయ రహస్యంతో ‘నాగబంధం’.. ట్రైలర్ చూశారా!
-
Modi-Trump: మరోసారి మోడీపై ట్రంప్ ప్రశంసల జల్లు.. ఈసారి ఏమన్నారంటే..!
-
Hyderabad : కేబీఆర్ పార్క్ దగ్గర ట్రాఫిక్ ఆంక్షలు.. ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే.!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?