‘భీమ్లా నాయక్’ రిలీజ్ జగన్ గారి చేతిలో ఉంది- నాగవంశీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో ప్రస్తుతం ప్రముఖ నిర్మాతల్లో ఒకరిగా కొనసాగుతున్నారు సూర్యదేవర నాగవంశీ. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై హిట్ సినిమాలను నిర్మించి ప్రేక్షకుల హృదయాలలో స్తానం సంపాదించుకున్నారు. ప్రస్తుతం సూర్యదేవర నాగవంశీ చేతిలో సుమారు నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి భీమ్లా నాయక్. ఈ సినిమాను రిలీజ్ చేయడానికి నాగవంశీ ఎంతగానో ప్రయత్నించారు. ఎవరు ఆపినా ‘భీమ్లా నాయక్’ ఆగదని, తమ సినిమాపై తమకు నమ్మకం ఉందంటూ చెప్పిన నాగవంశీ.. పవన్ కళ్యాణ్ చెప్పడంతో కొద్దిగా వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే. ఇక అంతేకాకుండా ఏపీలో టికెట్స్ రేట్స్ ఇష్యూ నడుస్తున్న కారణంగా కూడా ఈ సినిమాను వాయిదా వేసినట్లు తెలిసిందే. అయితే ఇటీవల ఈ సినిమా విడుదలపై కొన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే మేకర్స్ రెండు రిలీజ్ డేట్స్ ఇచ్చారు. ఫిబ్రవరి 25 కానీ, ఏప్రిల్ 1 కానీ సినిమాను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు.
తాజాగా మరోసారి ఈ ‘భీమ్లా నాయక్’ విషయంపై నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. నేడు డీజే టిల్లు ట్రైలర్ రిలీజ్ వేడుకలో ఆయనకు ఇదే ప్రశ్న ఎదురవ్వగా కొద్దిగా అసహనం వ్యక్తం చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ‘భీమ్లా నాయక్’ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని రిపోర్టర్ అడగగా.. ‘చెప్పాం కదండీ.. రెండు డేట్స్ ఇచ్చాం కదా.. ఇంకా చెప్పాలంటే ‘భీమ్లా నాయక్’ విడుదల సీఎం జగన్ గారి చేతిలో ఉంది. ఆయన థియేటర్లలో 50% ఆక్యుపెన్సీ ఎప్పుడు తీసేస్తే అప్పుడే రిలీజ్ చేస్తాం అంటూ చెప్పారు. ప్రస్తుతం నాగవంశీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
Also Read
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..