Pakistan: ప్రపంచ దేశాలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేసి చివరకు అమెరికా చేతిలో దారుణంగా హతమైన అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్కు అత్యంత సన్నిహితుడు, అల్ఖైదా ఉగ్రవాది అమీనుల్ హఖ్ ను అరెస్ట్ చేశారు.
భారత సైనికులు, జమ్ముకాశ్మీర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ ముమ్మరం చేయగా ఉగ్రవాదులు భద్రతా బలగాలపైకి ఒక్కసారిగా కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో నలుగురు జవాన్లు మరణించారు.. అందులో ఓ ఆర్మీ ఆఫీసర్ కూడా ఉన్నారని స్థానిక పోలీసులు పేర్కొన్నారు.
జమ్మూ కాశ్మీర్ కుప్వారాలోని కెరాన్ సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు ప్రయత్నాన్ని సైన్యం భగ్నం చేసింది. ఈ సమయంలో భారత సైన్యం ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది.
భారత్పై పాకిస్థాన్ కుట్రలు కొనసాగిస్తోంది. ఒకవైపు సరిహద్దుల నుంచి ఉగ్రవాదులను పంపిస్తూనే మరోవైపు డ్రోన్ల ద్వారా డ్రగ్స్, ఆయుధాలు, మందుగుండు సామగ్రి, నకిలీ కరెన్సీని సరిహద్దు ప్రాంతాలకు పంపిస్తోంది.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్ ప్రశాంతంగా ఉన్నట్లు అందరూ భావించారు. కానీ.. ఉగ్రవాదులు ఇప్పుడు జమ్మూని లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించారు. జమ్మూ ప్రాంతంలో నెల వ్యవధిలో జరిగిన ఐదు పెద్ద ఉగ్ర దాడులు ఏజెన్సీలను అప్రమత్తం చేశాయి.
జమ్ముకశ్మీర్లోని కథువా జిల్లాలో సోమవారం ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఉగ్రవాదులు కొండపై నుండి ఆర్మీ వాహనంపై కాల్పులు జరిపారు. అంతేకాకుండా.. గ్రెనేడ్లు కూడా విసిరారని అధికారులు తెలిపారు. కాగా.. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు. గత కొన్ని వారాలుగా జమ్మూ కాశ్మీర్లో తీవ్రవాద దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. గత నెల జూన్ 11, 12 తేదీల్లో జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లాలో ఉగ్రదాడులతో దద్దరిల్లింది.
జమ్మూ కాశ్మీర్లోని కుల్గామ్ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య శనివారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు అమరని..ఆరుగురు ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు తెలిపారు.
దక్షిణ కాశ్మీర్లోని కుల్గామ్ జిల్లా చినిగామ్లో భారత సైన్యం, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరుగుతోంది. ఇప్పటి వరకు నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ కాల్పుల్లో ఓ ఆర్మీ జవాను వీరమరణం పొందారు.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య బుధవారం ఉదయం కాల్పులు చోటు చేసుకున్నాయి. దోడా జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కదలికలు పెరిగాయి. ప్రధాని నరేంద్రమోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన రోజే ఉగ్రవాదులు యాత్రికులు బస్సుపై దాడికి తెగబడ్డారు. రియాసిలో జరిగిన ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత వరస రోజుల్లో కథువా, దోడా జిల్లాల్లో ఉగ్రవాద ఘటనలు చోటు చేసుకున్నాయి.