BSF: పాకిస్థాన్ ‘డ్రోన్’ కుట్ర.. 6 నెలల్లో 126 డ్రోన్లు కూల్చేసిన బీఎస్ఎఫ్
- భారత్పై పాకిస్థాన్ కుట్రలు
- ఒకవైపు సరిహద్దుల నుంచి ఉగ్రవాదులను పంపుతున్న పాక్
- మరోవైపు డ్రోన్స్ సాయంతో డ్రగ్స్..ఆయుధాలు.. మందుగుండు సామగ్రి.. నకిలీ కరెన్సీ సరఫరాకు యత్నం
- దుర్మార్గపు కుట్రలను భగ్నం చేస్తున్న బీఎస్ఎఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్పై పాకిస్థాన్ కుట్రలు కొనసాగిస్తోంది. ఒకవైపు సరిహద్దుల నుంచి ఉగ్రవాదులను పంపిస్తూనే మరోవైపు డ్రోన్ల ద్వారా డ్రగ్స్, ఆయుధాలు, మందుగుండు సామగ్రి, నకిలీ కరెన్సీని సరిహద్దు ప్రాంతాలకు పంపిస్తోంది. కానీ సరిహద్దులో మోహరించిన బీఎస్ఎఫ్ సైనికులు నిరంతరం దుర్మార్గపు కుట్రలను భగ్నం చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి జులై 9 మధ్య పంజాబ్-పాకిస్థాన్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ 126 డ్రోన్లను కూల్చివేసింది. అయితే 2023లో ఈ డ్రోన్లు/యూఏవీల సంఖ్య 107గా ఉంది.
READ MORE: NEET-UG paper leak: నీట్-యూజీ పేపర్ లీకులో మరో సూత్రధారి అరెస్ట్..
Also Read
- Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
- T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
- Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
- OTR: కరీంనగర్ కారు పార్టీలో అలజడి.. 'రెడ్ జోన్' వార్నింగ్తో లీడర్ల ఉరుకులు పరుగులు..
బీఎస్ఎఫ్ “ఎక్స్” లో ఈ వివరాలను పంచుకుంది. ఇది అసాధారణ ప్రదర్శనగా అభివర్ణిస్తూ.. దేశ భద్రతలో బీఎస్ఎఫ్ పంజాబ్ అంకితభావంతో మరియు సమర్ధవంతంగా పనిచేస్తుందని రాసుకొచ్చింది. డ్రోన్ల ద్వారా పంజాబ్ సరిహద్దు ప్రాంతాలకు డ్రగ్స్, ఆయుధాలు, మందుగుండు సామగ్రి, నకిలీ కరెన్సీలను పాకిస్థాన్ పంపుతుంది. దీని ద్వారా భారత్లో డ్రగ్స్ వ్యాపారం, ఉగ్రవాదాన్ని పెంచాలని భావిస్తోంది. అంతేకాకుండా డ్రోన్ల ద్వారా సరిహద్దుల్లో గూఢచర్యం చేసేందుకు కూడా పాక్ యత్నిస్తోంది. ఈ ఏడాది 126 డ్రోన్లతో పాటు 150 కిలోల హెరాయిన్, 18 ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు బీఎస్ఎఫ్ తన పోస్ట్లో పేర్కొంది. ఇది కాకుండా, ఒక పాకిస్థానీ చొరబాటుదారుని హతమార్చింది. అంతర్జాతీయ సరిహద్దును దాటడానికి ప్రయత్నిస్తున్న 21 మందిని అరెస్టు చేసింది.
READ MORE: OLA: మహిళతో ఓలా ఆటో డ్రైవర్ దురుసు ప్రవర్తన..ఎక్స్ ఖాతాలో పంచుకున్న బాధితురాలు
పాకిస్థాన్ ఏయే ప్రాంతాలకు డ్రోన్లను పంపుతుంది?
పంజాబ్ గురించి మాట్లాడితే.. అంతర్జాతీయ సరిహద్దు జిల్లాల్లో పాకిస్థాన్ డ్రోన్లు తరచుగా కనిపిస్తాయి. వీటిలో ఫిరోజ్పూర్, గురుదాస్పూర్, తరన్ తరణ్, అమృత్సర్ మరియు పఠాన్కోట్ ఉన్నాయి. పాకిస్థానీ డ్రోన్లు ఈ ప్రాంతాలకు డ్రగ్స్ సరుకులను తీసుకువస్తాయి. అదే సమయంలో, పూంచ్, రాజౌరి మరియు సాంబాతో సహా జమ్మూ కాశ్మీర్లోని అనేక ప్రాంతాలలోడ్రోన్లు చొరబాటుకు ప్రయత్నిస్తున్నాయి.
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!