Jammu Kashmir: జమ్మూలో 35-40 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు.. భద్రత కట్టుదిట్టం..
- జమ్మూ కాశ్మీర్లో క్రియాశీలకంగా పాక్ ఉగ్రవాదులు..
- 35-40 మంది ఉంటారని ఇంటెలిజెన్స్ అంచనా..
- కథువా
- రాజౌరీ
- రియాసీలో భారీ సెర్చ్ ఆపరేషన్..
- కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన భద్రతా బలగాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కదలికలు పెరిగాయి. ప్రధాని నరేంద్రమోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన రోజే ఉగ్రవాదులు యాత్రికులు బస్సుపై దాడికి తెగబడ్డారు. రియాసిలో జరిగిన ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత వరస రోజుల్లో కథువా, దోడా జిల్లాల్లో ఉగ్రవాద ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో ప్రధాని నరేంద్రమోడీ కేంద్రపాలితప్రాంతంలో భద్రత పరిస్థితిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇతర ఉన్నతాధికారులతో హై లెవల్ మీటింగ్ నిర్వహించారు.
Read Also: Parliament Sessions: సోమ, మంగళవారాల్లో ఎంపీల ప్రమాణం.. స్పీకర్ ఎంపికపై ఉత్కంఠ
Also Read
ఇదిలా ఉంటే, గత కొన్ని రోజులుగా భద్రతా బలగాలు జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా ఉగ్రవాదుల వేట కొనసాగిస్తున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతాలు, కొండలు, లోయలు సెర్చ్ ఆపరేషన్కి సంక్లిష్టంగా మారాయి. జమ్మూ ప్రాంతంలోని రాజౌరీ, పూంచ్, కథువా సెక్టార్లలో 35-40 మంది విదేశీ ఉగ్రవాదులు క్రియాశీలకంగా ఉన్నట్లు ఇంటెలిజెన్స్ మూలాలు తెలియజేస్తున్నాయి. ప్రధానంగా పాకిస్తాన్కి చెందిన ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని పెంచే ప్రయత్నంలో స్థానిక గైడ్లు, సపోర్ట్ నెట్వర్క్ల సాయంతో చిన్న బృందాలుగా పనిచేస్తున్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి.
ఈ ఉగ్రవాదులు 2-3 గ్రూపులుగా పనిచేస్తున్నారని, స్థానిక సహాయక వ్యవస్థలో బాగా కలిసిపోయారని భద్రతా వ్యవస్థలోని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మిలిటరీ, ఇతర భద్రతా సంస్థలు తమ గూఢచార కార్యకలాపాలను ముమ్మరం చేశాయి. సరిహద్దుల్లో చొరబాటు ప్రయత్నాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు భద్రతా వ్యవస్థను కట్టుదిట్టం చేస్తున్నాయి. అంతర్జాతీయ సరిహద్దును పర్యవేక్షించడం, ఉగ్రవాద వ్యతిరేక గ్రిడ్ ఏర్పాటు చేయడం, ఉగ్రవాదులకు సాయం చేస్తున్న స్థానికుల నెట్వర్క్ని గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారత సైన్యం ఇప్పటికే 200కి పైగా సాయుధ రక్షిత వాహనాలతో కూడిన అదనపు బలగాలను మోహరించాయి.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!