Jammu Kashmir: జమ్మూలో 35-40 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు.. భద్రత కట్టుదిట్టం..
- జమ్మూ కాశ్మీర్లో క్రియాశీలకంగా పాక్ ఉగ్రవాదులు..
- 35-40 మంది ఉంటారని ఇంటెలిజెన్స్ అంచనా..
- కథువా
- రాజౌరీ
- రియాసీలో భారీ సెర్చ్ ఆపరేషన్..
- కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన భద్రతా బలగాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కదలికలు పెరిగాయి. ప్రధాని నరేంద్రమోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన రోజే ఉగ్రవాదులు యాత్రికులు బస్సుపై దాడికి తెగబడ్డారు. రియాసిలో జరిగిన ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత వరస రోజుల్లో కథువా, దోడా జిల్లాల్లో ఉగ్రవాద ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో ప్రధాని నరేంద్రమోడీ కేంద్రపాలితప్రాంతంలో భద్రత పరిస్థితిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇతర ఉన్నతాధికారులతో హై లెవల్ మీటింగ్ నిర్వహించారు.
Read Also: Parliament Sessions: సోమ, మంగళవారాల్లో ఎంపీల ప్రమాణం.. స్పీకర్ ఎంపికపై ఉత్కంఠ
Also Read
- Putin-Ajit Doval: పుతిన్కు అజిత్ దోవల్ అంటే ఎంత ఇష్టమో చూడండి.. ‘స్పై-టు-స్పై సెల్యూట్’ వీడియో వైరల్
- Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
- BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
- Vijay Ajith Kumar: అజిత్ లే మాన్స్ రేస్కు త్రిషా కృష్ణన్.. విజయ్తో కలిసి కనిపించడంతో ఫ్యాన్స్లో చర్చ
ఇదిలా ఉంటే, గత కొన్ని రోజులుగా భద్రతా బలగాలు జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా ఉగ్రవాదుల వేట కొనసాగిస్తున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతాలు, కొండలు, లోయలు సెర్చ్ ఆపరేషన్కి సంక్లిష్టంగా మారాయి. జమ్మూ ప్రాంతంలోని రాజౌరీ, పూంచ్, కథువా సెక్టార్లలో 35-40 మంది విదేశీ ఉగ్రవాదులు క్రియాశీలకంగా ఉన్నట్లు ఇంటెలిజెన్స్ మూలాలు తెలియజేస్తున్నాయి. ప్రధానంగా పాకిస్తాన్కి చెందిన ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని పెంచే ప్రయత్నంలో స్థానిక గైడ్లు, సపోర్ట్ నెట్వర్క్ల సాయంతో చిన్న బృందాలుగా పనిచేస్తున్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి.
ఈ ఉగ్రవాదులు 2-3 గ్రూపులుగా పనిచేస్తున్నారని, స్థానిక సహాయక వ్యవస్థలో బాగా కలిసిపోయారని భద్రతా వ్యవస్థలోని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మిలిటరీ, ఇతర భద్రతా సంస్థలు తమ గూఢచార కార్యకలాపాలను ముమ్మరం చేశాయి. సరిహద్దుల్లో చొరబాటు ప్రయత్నాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు భద్రతా వ్యవస్థను కట్టుదిట్టం చేస్తున్నాయి. అంతర్జాతీయ సరిహద్దును పర్యవేక్షించడం, ఉగ్రవాద వ్యతిరేక గ్రిడ్ ఏర్పాటు చేయడం, ఉగ్రవాదులకు సాయం చేస్తున్న స్థానికుల నెట్వర్క్ని గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారత సైన్యం ఇప్పటికే 200కి పైగా సాయుధ రక్షిత వాహనాలతో కూడిన అదనపు బలగాలను మోహరించాయి.
తాజావార్తలు
-
Putin-Ajit Doval: పుతిన్కు అజిత్ దోవల్ అంటే ఎంత ఇష్టమో చూడండి.. ‘స్పై-టు-స్పై సెల్యూట్’ వీడియో వైరల్
-
Yolo Travels Bus : కంచికచర్ల వద్ద బస్సు ప్రమాదం.. 36 మందికి తప్పిన పెను ముప్పు
-
Irumudi OTT: ఓటీటీలోకి మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?
-
Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
-
Volvo XC40, EX40, EC40 Updated: వోల్వో XC40, EX40, EC40 కొత్త వెర్షన్లు.. రేంజ్, ఫీచర్లు, టెక్నాలజీ వివరాలు
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!