తమిళనాడులో వచ్చే ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీని గద్దె దించేందుకు ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇంకోవైపు అధికార డీఎంకే కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ లక్ష్యంగా పోరాటం చేస్తోంది. తమపై హిందీ భాష బలవంతంగా రుద్దుతోందని నిరసన గళాన్ని రేపుతోంది. ఇలా అధికార-విపక్షాల మధ్య రాజకీయ వార్ మొదలైంది.
Chennai: కాలం ఎంత వేగంగా మారిపోయినా, కొందరి జీవితాల్లోని సంఘటనలు మాత్రం గుండెను కదిలించేలా ఉంటాయి. ఇలాంటి ఓ సంఘటన తాజాగా చెన్నైలో వెలుగుచూసింది. ఇరవై ఏళ్ల క్రితం తన కుటుంబం నుండి విడిపోయిన వ్యక్తి, రెండు రాష్ట్రాల అధికారుల సహాయంతో తిరిగి తన కుటుంబాన్ని కలుసుకున్నాడు. మన్యం జిల్లా పార్వతీపురం గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు అప్పారావు, కొన్నేళ్ల క్రితం తన స్నేహితులతో కలిసి నిర్మాణ పనుల నిమిత్తం పాండిచ్చేరి వెళ్ళే రైలులో ప్రయాణం…
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తమిళనాడులో సంచలనంగా మారాయి. డీఎంకే, కేంద్ర ప్రభుత్వాల మధ్య ‘‘హిందీ’’ వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో నిన్న జనసేన ఆవిర్భావ సభలో ఈ విషయంపై పవన్ కామెంట్స్ తమిళనాట కాక పుట్టించాయి.
దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ప్రజలు రంగుల్లో మునిగితేలుతున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ రంగులు చల్లుకుని ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు. స్నేహితులు, సన్నిహితులు పాటలకు స్టెప్స్ వేస్తూ సందడి చేస్తున్నారు. అందరూ ఒక చోట చేరి కలర్ ఫుల్ రంగులను చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ కలిసి రంగులు పూసుకుంటూ.. డ్యాన్సులు వేస్తూ... హోలీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రెయిన్ డ్యాన్సులు, మడ్ డ్యాన్సులు లాంటి వెరిటీ ప్రోగ్రామ్ లతో…
Tamil Nadu assembly: ‘‘హిందీ వివాదం’’, ‘‘డీలిమిటేషన్’’, ‘‘రూపాయి సింబర్ మార్పు’’ వివాదాల నేపథ్యంలో తమిళనాడు రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే, సమావేశాల జరుగుతున్న సమయంలో సభ నుంచి బీజేపీ, అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. డీఎంకే ప్రభుత్వ రూపాయి చిహ్నాన్ని మార్చడం, తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (టాస్మాక్)లో అవినీతిని ఆరోపిస్తూ రెండు పార్టీల ఎమ్మెల్యేలు బయటకు వచ్చారు.
DMK: తమిళనాడు, కేంద్రానికి మధ్య ఇప్పటికే ‘‘హిందీ’’, ‘‘డీ లిమిటేషన్’’ వివాదాలు జరుగుతున్నాయి. తాజాగా.. ఉత్తర, దక్షిణ భారతదేశాలు అంటూ డీఎంకే నేతలు కొత్త వివాదాలను తీసుకువస్తున్నారు. తాజాగా, తమిళనాడు సీనియర్ మంత్రి దురై మురుగన్ గురువారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తర భారతదేశంలోని మహిళలు అనేక మంది భర్తల్ని కలిగి ఉండే సంస్కృతిని కలిగి ఉంటారని అన్నారు. తమిళాన్ని అవమానించే వారి నాలుకలను నరికేస్తామని హెచ్చరించారు. Read Also: Canada: ట్రంప్ విధానాల వల్ల ‘‘ఎవరూ…
Annamalai: తమిళనాడు డీఎంకే ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య ఇప్పటికే జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ)పై వివాదం నడుస్తోంది. తమ రాష్ట్రంపై బలవంతంగా ‘‘హిందీ’’ రుద్దే ప్రయత్నం చేస్తో్ందని సీఎం స్టాలిన్తో సహా డీఎంకే పార్టీ మండిపడుతోంది. ఈ నేపథ్యంలో, తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 2025-26 బడ్జెట్ లోగోలో రూపాయి గుర్తుకు బదులుగా తమిళ అక్షరం ‘‘రూ’’ని ఉపయోగించాలని నిర్ణయం తీసుకుంది.
డీలిమిటేషన్తో దక్షిణాదికి తీవ్ర నష్టం జరుగుతోంది.. దీనిపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి స్పందించాలి అని డిమాండ్ చేశారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నాం.. ఈ నెల 22వ తేదీన స్టాలిన్ ఏర్పాటు చేసే సమావేశంలో పాల్గొంటాం అని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
MK Stalin: జాతీయ విద్యా విధానం (NEP)పై గత కొన్ని రోజులుగా కేంద్రం, తమిళనాడు ప్రభుత్వానికి మధ్య గొడవ జరుగుతోంది. తమ రాష్ట్రంపై బలవంతంగా ‘‘హిందీ’’ని రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ ఆరోపించారు. తాను ఈ NEPకి వ్యతిరేకంగా తన వైఖరిపై రాజీ పడలేనని చెప్పారు. రూ.10,000 కోట్లు ఇచ్చినా కూడా తమిళనాడులో దీనిని అమలు చేయమని చెప్పారు.
Madras University: మద్రాస్ యూనివర్సిటీ వివాదంలో చిక్కుకుంది. ‘‘భారతదేశంలో క్రైస్తవ మతాన్ని ఎలా వ్యాప్తి చేయాలి’’ మరియు ‘‘ఈ మార్గం మనకు ఎందుకు అవసరం’’ అనే శీర్షికతో ఒక లెక్చర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. అయితే, దీనిపై సోషల్ మీడియాపై విస్తృతంగా విమర్శలు వచ్చాయి. దీంతో యూనివర్సిటీ ఈ లెక్చర్ని రద్దు చేసింది. ప్రాచీన చరిత్ర మరియు పురావస్తు శాస్త్ర విభాగం సుబ్రమణ్య అయ్యర్ ఎండోమెంట్ లెక్చర్ సిరీస్ కింద ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్లాన్ చేశారు.