Delimitation Row: వైఫల్యాలను కప్పిపుచ్చడానికే స్టాలిన్ వ్యూహం.. బీజేపీ విమర్శలు..
- వైఫల్యాలను కప్పిపుచ్చడానికే డీలిమిటేషన్ వ్యూహం..
- స్టాలిన్ సహా ప్రతిపక్ష పాలిత ప్రభుత్వాలపై బీజేపీ ఆగ్రహం..
- దేశ ప్రజల్ని విభజించేందుకే ఈ సమావేశం జరిగిందని విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delimitation Row: నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిలేషన్)పై చెన్నై వేదిక తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) సమావేశాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సమావేశానికి స్టాలిన్ అధ్యక్షత వహించగా.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేరళ సీఎం పినరయి విజయన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, పంజాబ్ సీఎం భవంత్ మాన్, టీఆర్ఎస్ నేత కేటీఆర్ వంటి వారు హాజరయ్యారు. మొత్తంగా ఈ సమావేశానికి 5 రాష్ట్రాల నుంచి 14 మంది నాయకులు పాల్గొన్నారు. జనాభా ఆధారంగా డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వారంతా ఆరోపించారు. దక్షిణాదిని అణగదొక్కాలని బీజేపీ భావిస్తోందని సీఎం స్టాలిన్ ఆరోపిస్తున్నారు.
Read Also: Putin: ట్రంప్ కోసం చర్చిలో పుతిన్ ప్రార్థనలు.. కారణం ఏంటంటే..
Also Read
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
- Woman Litters In Train: రైలు కోచ్లో చెత్త విసిరి, సీటు పక్కనే చేతులు కడిగిన మహిళ.. సివిక్ సెన్స్పై దేశవ్యాప్తంగా చర్చ
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
ఇదిలా ఉంటే, సీఎం స్టాలిన్ ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి నల్లజెండాలతో బీజేపీ నిరసన తెలియజేసింది. కర్ణాటక, కేరళతో కావేరి, ముల్లపెరియార్ నీటి పంపిణీపై ఇలాంటి సమావేశాలు ఎందుకు ఏర్పాటు చేయలేదని సీఎం స్టాలిన్ని బీజేపీ ప్రశ్నించింది. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు తమ తప్పులను, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు బీజేపీ నేత తమిళిసై సౌందర్రాజన్ ఆరోపించారు. డీఎంకే అవినీతి, వినాశకరమైన దుష్ప్రవర్తన నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి విభజన వ్యూహంగా డీఎంకే ఈ డీలిమిటేషన్ డ్రామాను ప్రదర్శిస్తోందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సీఆర్ కేశవన్ అన్నారు.
‘‘డీలిమిటేషన్ ప్రకటించలేదు, కేంద్ర ప్రభుత్వం ఒక్క మాట కూడా మాట్లాడలేదు, హోం మంత్రి అమిత్ షా కోయంబత్తూర్ కు వచ్చారు. తమిళనాడు ప్రభావితం కాదని స్పష్టం చేశారు. కాబట్టి మీరు ఈ సమావేశాన్ని ఏ ప్రాతిపదికన నిర్వహిస్తున్నారు.’’ తమిళిసై డీఎంకేని ప్రశ్నించారు. అవినీతిని దాచడాని, దేశ ప్రజల్ని విభజించడానికి ఈ సమావేశం జరుగుతోందని, సీఎంలు తమ రాష్ట్రాల్లో దుష్పరిపాలనను దాచడానికి ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ, కేరళ ప్రభుత్వాలపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయని అన్నారు.
తాజావార్తలు
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
SUV Safety: ఎస్యూవీలతో పాదచారులకు ముప్పు.. 8 ఏళ్లలో 3,000కు పైగా మరణాలు!
-
Red Magic Tablet 5 Pro: రెడ్ మ్యాజిక్ టాబ్లెట్ 5 ప్రో వచ్చేస్తోంది.. 8300mAh బ్యాటరీ, 185Hz OLED డిస్ప్లే
-
Animation Universe: టాలీవుడ్లో కొత్త ట్రెండ్.. ‘ఆర్య’ కోసం యానిమేటెడ్ యూనివర్స్ సిద్ధం!
-
Back To Back Releases : మూడు నెలల్లో మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్న స్టార్ హీరో
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!