Tamil Nadu: స్టాలిన్, విజయ్, అన్నామలై.. సీఎంగా తమిళ ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు..?
- తమిళ ప్రజలు సీఎంగా ఎవరిని కోరుకుంటున్నారు..?
- తాజా సర్వేలో కీలక విషయాలు..
- మొదటి స్థానంలో స్టాలిన్..
- స్టాలిన్, విజయ్ మధ్య తీవ్ర పోటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: వచ్చే ఏడాది తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ రాజకీయ వాతావరణం ఇప్పటికే వేడెక్కింది. అధికార డీఎంకేతో పాటు తమిళ స్టార్ విజయ్ పార్టీ టీవీకే, బీజేపీ, అన్నాడీఎంకేలు తమ తమ ప్రచార వ్యూహాలకు పదును పెట్టాయి. ఇదిలా ఉంటే, తమిళ ప్రజలు ఎవరిని సీఎంగా ఇష్టపడుతున్నారనే దానిపై సర్వే జరిగింది. సీఓటర్ సర్వే తమిళ ప్రజల మనోభావాలను ప్రతిబింబించింది.
ఇప్పటికీ, డీఎంకే అధినేత స్టాలిన్ వైపు ఎక్కువ మంది ప్రజలు ఉన్నట్లు తెలుస్తోంది. సర్వేలో పాల్గొన్నవారిలో 27 శాతం మంది ఆయనకు అనుకూలంగా ఓటేశారు. 18 శాతం మంది తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్ని సీఎంగా చూడాలనుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎన్నికల్లో పోటీ చేయకపోయినప్పటికీ, విజయ్ అప్రూవల్ రేటింగ్లో స్టాలిన్కి పోటీ ఇస్తున్నారు. సీఎం ఛాయిస్లో స్టాలిన్ మొదటి స్థానంలో ఉండగా, విజయ్ రెండో స్థానంలో ఉన్నారు. మరోవైపు, ప్రతిపక్ష అన్నాడీఎంకే కార్యదర్శ ఎడప్పాడి పళని స్వామికి 10 శాతం మంది మద్దతుతో మూడోస్థానంలో, బీజేపీ తమిళనాడు చీఫ్ అన్నామలై 9 శాతంతో సీఎం ఎంపికగా ఉన్నారు.
Also Read
- India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
- Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
- NEET PG 2026 Exam: నేడే నీట్ పీజీ 2026 ప్రవేశ పరీక్ష.. అభ్యర్థులు ఈ తప్పులు చేయకండి.. కీలక మార్గదర్శకాలు
- Mohan Bhagwat: ‘భారత్లో ముస్లింలు ఉండకూడదనేవారు హిందువులే కాదు’.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
Read Also: L2: Empuraan: మోహన్ లాల్ ‘ఎంపురాన్’’తో బీజేపీ, కాంగ్రెస్ మధ్య వివాదం..
తమిళ ప్రభుత్వ పనితీరుపై 15 శాతం మంది ‘‘చాలా సంతృప్తి వ్యక్తం చేశారు’’, 36 శాతం మంది ‘‘కొంత వరకు సంతృప్తి చెందారు’’, 25 శాతం మంది ‘‘అసంతృప్తి’’ వ్యక్తం చేశారు. 24 శాతం మంది ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఎంకే స్టాలిన్ వ్యక్తిగత పనితీరుపై 22 శాతం మంది ప్రతివాదులు ‘‘చాలా సంతృప్తి’’ వ్యక్తం చేయగా, 33 శాతం మంది పర్వాలేదని, 22 శాతం మంది అస్సలు బాగోలేదని చెప్పారు. 23 శాతం మంది ఇంకా నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. ఆయన పాలనపై ప్రజల్లో మిశ్రమ స్పందన వ్యక్తమైంది.
ప్రతిపక్ష నాయకుడు పళని స్వామి పనితీరుపై సర్వేలో పాల్గొన్న వారిలో 8 శాతం మంది మాత్రమే సంతృప్తి వ్యక్తం చేయగా, 27 శాతం కొంత వరకు సంతృప్తి వ్యక్తం చేశారు. 32 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. 33 శాతం మంది ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఓట్లను ప్రభావితం చేసే అంశాల్లో 15 శాతం మంది ‘‘మహిళా భద్రత’’ను హైలెట్ చేశారు. 12 శాతం మంది ధరల పెరుగుదల, 10 శాతం మంది మాదకద్రవ్యాలు, మద్యం దుర్వినియోగం వంటి కీలక సమస్యగా చెప్పారు. నిరుద్యోగమని 8 శాతం మంది చెప్పారు.
- Tags
- AIADMK
- annamalai
- bjp
- chief minister
- DMK
తాజావార్తలు
-
Toxic Flop : యశ్ చేసిన తప్పే ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేశ్, ప్రభాస్ చేస్తున్నారా?
-
September 1, 2026 New Rules: సెప్టెంబర్ 2026 నుంచి కీలక మార్పులు.. ITR, LPG e-KYC, FD రూల్స్ వరకు పూర్తి లిస్ట్ ఇదే
-
Asia Cup 2026: పాకిస్థాన్తో హ్యాండ్షేక్ ఉంటుందా?.. టీమిండియా కోచ్ ఏం చెప్పాడంటే?
-
King100: నాగార్జున ‘కింగ్ 100’లో మరో స్టార్ హీరోయిన్.. ఐశ్వర్య రాజేష్ ఎంట్రీ కన్ఫర్మ్!
-
India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!