Tamil Nadu: స్టాలిన్, విజయ్, అన్నామలై.. సీఎంగా తమిళ ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు..?
- తమిళ ప్రజలు సీఎంగా ఎవరిని కోరుకుంటున్నారు..?
- తాజా సర్వేలో కీలక విషయాలు..
- మొదటి స్థానంలో స్టాలిన్..
- స్టాలిన్, విజయ్ మధ్య తీవ్ర పోటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: వచ్చే ఏడాది తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ రాజకీయ వాతావరణం ఇప్పటికే వేడెక్కింది. అధికార డీఎంకేతో పాటు తమిళ స్టార్ విజయ్ పార్టీ టీవీకే, బీజేపీ, అన్నాడీఎంకేలు తమ తమ ప్రచార వ్యూహాలకు పదును పెట్టాయి. ఇదిలా ఉంటే, తమిళ ప్రజలు ఎవరిని సీఎంగా ఇష్టపడుతున్నారనే దానిపై సర్వే జరిగింది. సీఓటర్ సర్వే తమిళ ప్రజల మనోభావాలను ప్రతిబింబించింది.
ఇప్పటికీ, డీఎంకే అధినేత స్టాలిన్ వైపు ఎక్కువ మంది ప్రజలు ఉన్నట్లు తెలుస్తోంది. సర్వేలో పాల్గొన్నవారిలో 27 శాతం మంది ఆయనకు అనుకూలంగా ఓటేశారు. 18 శాతం మంది తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్ని సీఎంగా చూడాలనుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎన్నికల్లో పోటీ చేయకపోయినప్పటికీ, విజయ్ అప్రూవల్ రేటింగ్లో స్టాలిన్కి పోటీ ఇస్తున్నారు. సీఎం ఛాయిస్లో స్టాలిన్ మొదటి స్థానంలో ఉండగా, విజయ్ రెండో స్థానంలో ఉన్నారు. మరోవైపు, ప్రతిపక్ష అన్నాడీఎంకే కార్యదర్శ ఎడప్పాడి పళని స్వామికి 10 శాతం మంది మద్దతుతో మూడోస్థానంలో, బీజేపీ తమిళనాడు చీఫ్ అన్నామలై 9 శాతంతో సీఎం ఎంపికగా ఉన్నారు.
Also Read
- Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
- Supreme Court: ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ 8వ తరగతి పాఠంపై సుప్రీంకోర్టు యూటర్న్.. తాజా ఆదేశాలివే!
- Kamal Haasan: కమల్హాసన్ సంచలన నిర్ణయం.. మోడీకి మద్దతు తెల్పుతూ వీడియో విడుదల
- Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో కీలక పరిణామం.. రెండో పోస్ట్మార్టానికి హైకోర్టు ఆదేశం
Read Also: L2: Empuraan: మోహన్ లాల్ ‘ఎంపురాన్’’తో బీజేపీ, కాంగ్రెస్ మధ్య వివాదం..
తమిళ ప్రభుత్వ పనితీరుపై 15 శాతం మంది ‘‘చాలా సంతృప్తి వ్యక్తం చేశారు’’, 36 శాతం మంది ‘‘కొంత వరకు సంతృప్తి చెందారు’’, 25 శాతం మంది ‘‘అసంతృప్తి’’ వ్యక్తం చేశారు. 24 శాతం మంది ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఎంకే స్టాలిన్ వ్యక్తిగత పనితీరుపై 22 శాతం మంది ప్రతివాదులు ‘‘చాలా సంతృప్తి’’ వ్యక్తం చేయగా, 33 శాతం మంది పర్వాలేదని, 22 శాతం మంది అస్సలు బాగోలేదని చెప్పారు. 23 శాతం మంది ఇంకా నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. ఆయన పాలనపై ప్రజల్లో మిశ్రమ స్పందన వ్యక్తమైంది.
ప్రతిపక్ష నాయకుడు పళని స్వామి పనితీరుపై సర్వేలో పాల్గొన్న వారిలో 8 శాతం మంది మాత్రమే సంతృప్తి వ్యక్తం చేయగా, 27 శాతం కొంత వరకు సంతృప్తి వ్యక్తం చేశారు. 32 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. 33 శాతం మంది ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఓట్లను ప్రభావితం చేసే అంశాల్లో 15 శాతం మంది ‘‘మహిళా భద్రత’’ను హైలెట్ చేశారు. 12 శాతం మంది ధరల పెరుగుదల, 10 శాతం మంది మాదకద్రవ్యాలు, మద్యం దుర్వినియోగం వంటి కీలక సమస్యగా చెప్పారు. నిరుద్యోగమని 8 శాతం మంది చెప్పారు.
- Tags
- AIADMK
- annamalai
- bjp
- chief minister
- DMK
తాజావార్తలు
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
SRH Vs RCB: ఉప్పల్లో మ్యాచ్ ముగిసినా స్టేడియంలోనే ఉండండి.. కారణం ఏంటంటే..
-
Anna Lezhneva: జిమ్’లో వర్కౌట్స్ మొదలెట్టిన పవన్ భార్య
-
Cannes: కేన్స్ ఫెస్టివల్స్లో మిస్ వెనిజులా 2025పై దాడి.. ముఖం రక్తసిక్తం.. ఫొటోలు వైరల్
-
Protein Rich Sattu Drink : ‘సత్తు డ్రింక్’ శరీరానికి పవర్ బూస్టర్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా.!
ట్రెండింగ్
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..