Tamil Nadu: స్టాలిన్, విజయ్, అన్నామలై.. సీఎంగా తమిళ ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు..?
- తమిళ ప్రజలు సీఎంగా ఎవరిని కోరుకుంటున్నారు..?
- తాజా సర్వేలో కీలక విషయాలు..
- మొదటి స్థానంలో స్టాలిన్..
- స్టాలిన్, విజయ్ మధ్య తీవ్ర పోటీ..
Tamil Nadu: వచ్చే ఏడాది తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ రాజకీయ వాతావరణం ఇప్పటికే వేడెక్కింది. అధికార డీఎంకేతో పాటు తమిళ స్టార్ విజయ్ పార్టీ టీవీకే, బీజేపీ, అన్నాడీఎంకేలు తమ తమ ప్రచార వ్యూహాలకు పదును పెట్టాయి. ఇదిలా ఉంటే, తమిళ ప్రజలు ఎవరిని సీఎంగా ఇష్టపడుతున్నారనే దానిపై సర్వే జరిగింది. సీఓటర్ సర్వే తమిళ ప్రజల మనోభావాలను ప్రతిబింబించింది.
ఇప్పటికీ, డీఎంకే అధినేత స్టాలిన్ వైపు ఎక్కువ మంది ప్రజలు ఉన్నట్లు తెలుస్తోంది. సర్వేలో పాల్గొన్నవారిలో 27 శాతం మంది ఆయనకు అనుకూలంగా ఓటేశారు. 18 శాతం మంది తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్ని సీఎంగా చూడాలనుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎన్నికల్లో పోటీ చేయకపోయినప్పటికీ, విజయ్ అప్రూవల్ రేటింగ్లో స్టాలిన్కి పోటీ ఇస్తున్నారు. సీఎం ఛాయిస్లో స్టాలిన్ మొదటి స్థానంలో ఉండగా, విజయ్ రెండో స్థానంలో ఉన్నారు. మరోవైపు, ప్రతిపక్ష అన్నాడీఎంకే కార్యదర్శ ఎడప్పాడి పళని స్వామికి 10 శాతం మంది మద్దతుతో మూడోస్థానంలో, బీజేపీ తమిళనాడు చీఫ్ అన్నామలై 9 శాతంతో సీఎం ఎంపికగా ఉన్నారు.
Also Read
- Instagram Star Murder: భర్త చేతితో ఇన్స్టా స్టార్ దారుణ హత్య.. ట్విస్ట్ ఏంటంటే..?
- Petrol, Diesel Price: భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధరలు.. పెట్రోల్, డీజిల్ పెరుగుదలపై కేంద్రం క్లారిటీ!
- May 1st Labor Day: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం.. ఈరోజే ఎందుకు.. పూర్తి వివరాలు
- West Bengal Elections 2026: ఫలితాలకు ముందే రణరంగా మారిన బెంగాల్.. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర దీదీ ధర్నా..
Read Also: L2: Empuraan: మోహన్ లాల్ ‘ఎంపురాన్’’తో బీజేపీ, కాంగ్రెస్ మధ్య వివాదం..
తమిళ ప్రభుత్వ పనితీరుపై 15 శాతం మంది ‘‘చాలా సంతృప్తి వ్యక్తం చేశారు’’, 36 శాతం మంది ‘‘కొంత వరకు సంతృప్తి చెందారు’’, 25 శాతం మంది ‘‘అసంతృప్తి’’ వ్యక్తం చేశారు. 24 శాతం మంది ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఎంకే స్టాలిన్ వ్యక్తిగత పనితీరుపై 22 శాతం మంది ప్రతివాదులు ‘‘చాలా సంతృప్తి’’ వ్యక్తం చేయగా, 33 శాతం మంది పర్వాలేదని, 22 శాతం మంది అస్సలు బాగోలేదని చెప్పారు. 23 శాతం మంది ఇంకా నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. ఆయన పాలనపై ప్రజల్లో మిశ్రమ స్పందన వ్యక్తమైంది.
ప్రతిపక్ష నాయకుడు పళని స్వామి పనితీరుపై సర్వేలో పాల్గొన్న వారిలో 8 శాతం మంది మాత్రమే సంతృప్తి వ్యక్తం చేయగా, 27 శాతం కొంత వరకు సంతృప్తి వ్యక్తం చేశారు. 32 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. 33 శాతం మంది ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఓట్లను ప్రభావితం చేసే అంశాల్లో 15 శాతం మంది ‘‘మహిళా భద్రత’’ను హైలెట్ చేశారు. 12 శాతం మంది ధరల పెరుగుదల, 10 శాతం మంది మాదకద్రవ్యాలు, మద్యం దుర్వినియోగం వంటి కీలక సమస్యగా చెప్పారు. నిరుద్యోగమని 8 శాతం మంది చెప్పారు.
- Tags
- AIADMK
- annamalai
- bjp
- chief minister
- DMK
తాజావార్తలు
-
NBK 112 : బాలయ్య-కొరటాల శివ అనౌన్స్మెంట్ వచ్చేసింది.. మాస్ విద్వంసమే
-
Babar Azam: టీ20 క్రికెట్లో నయా హిస్టరీ.. కోహ్లీ, డుప్లెసిస్ను వెనక్కి నెట్టేసిన బాబర్ ఆజామ్..
-
Instagram Star Murder: భర్త చేతితో ఇన్స్టా స్టార్ దారుణ హత్య.. ట్విస్ట్ ఏంటంటే..?
-
TGSRTC: రూ. 20 వేలు లంచం డిమాండ్ చేసిన టికెట్ ఇన్ స్పెక్టర్.. చెప్పుతో దాడి చేసిన కండక్టర్, ప్రయాణికులు
-
Bhuvneshwar Kumar Record: దూసుకెళ్తున్న స్వింగ్ మాస్టర్ భువనేశ్వర్.. జస్ప్రీత్ బుమ్రా రికార్డు బ్రేక్!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!