Amit Shah: లోక్సభలో మాట్లాడే అవకాశమిస్తే రాహుల్గాంధీ విదేశాలకు వెళ్లిపోయారు
- రాహుల్గాంధీపై హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు లోక్సభలో మాట్లాడే అవకాశమిస్తే విదేశాలకు వెళ్లిపోయారని విమర్శ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదన్న రాహుల్ గాంధీ ఆరోపణలను అమిత్ షా కొట్టిపారేశారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వియత్నాంలో ఉన్నారని.. అక్కడ నుంచి వచ్చాక మాట్లాడతానంటూ పట్టుబట్టారన్నారు. సభలో మాట్లాడటానికి నియమాలు ఉంటాయన్న సంగతి ప్రతిపక్ష నాయకుడికి తెలియకపోవచ్చన్నారు. ఇష్టానుసారంగా సభను నడపలేం కదా? అని చెప్పారు. అయినా బడ్జెట్పై చర్చల్లో 42 శాతం సమయం రాహుల్కే ఇచ్చామని పేర్కొన్నారు. పార్లమెంట్ అనేది వారి పార్టీలా కాకుండా… నిబంధనలకు అనుగుణంగా నడుస్తోందని హితవు పలికారు. అయినా ప్రతిపక్ష నేత సభా నియమాలు, నిబంధనలు పాటించాలని అమిత్ షా సూచించారు.
ఇది కూడా చదవండి: Vijay Varma : ఒక బంధాన్ని ఐస్క్రీంలా ఆస్వాదించాలి..
Also Read
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై స్పందించిన రాజా రఘువంశీ కుటుంబం.. ఏం డిమాండ్ చేశారంటే..!
- Ketan Agarwal Case: 'పెళ్లి నుంచి తప్పించుకోలేవు'.. కేతన్పై సియా గోయల్ సంచలన ఆరోపణ
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
- Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయం వెండి ఇటుకలు మాయమయ్యాయా? సిట్ దర్యాప్తులో సంచలన నిజాలు!
దేశంలో ప్రజాస్వామ్యం లేదన్న కాంగ్రెస్ ఆరోపణలను కూడా అమిత్ షా ఖండించారు. దేశంలో ఎమర్జెన్సీ లాంటి పరిస్థితులుంటే.. కాంగ్రెస్ నేతలంతా జైల్లో ఉండేవారన్నారు. ఇక కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు కాంట్రాక్టుల్లో 4 శాతం కోటా ప్రకటించడాన్ని అమిత్ షా తప్పుపట్టారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఇలా చేయడం కరెక్ట్ కాదన్నారు. ఇక వచ్చే ఏడాది తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: CM Chandrababu: టీడీపీని లేకుండా చేస్తామని చాలా మంది చెప్పారు కానీ.. వాళ్లే కాలగర్భంలో కలిసిపోయారు..
ఇక మణిపూర్లో పరిస్థితులు సద్దుమణిగాయని.. శాంతి వాతావరణం నెలకొందని తెలిపారు. పరిస్థితులు క్రమక్రమంగా సాధారణ స్థితికి వస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే మణిపూర్ కోలుకుంటుందని చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే వక్ఫ్ (సవరణ) బిల్లును ప్రవేశపెడతామని తేల్చిచెప్పారు. సవరణ రాజ్యాంగానికి అనుగుణంగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: CM Chandrababu: టీడీపీని లేకుండా చేస్తామని చాలా మంది చెప్పారు కానీ.. వాళ్లే కాలగర్భంలో కలిసిపోయారు..
తాజావార్తలు
-
Petrol Diesel Rates: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్ ఉందా? సామాన్యులకు గుడ్ న్యూస్ అందబోతోందా!
-
Ketan Agrawal Case: కేతన్ హత్యపై స్పందించిన రాజా రఘువంశీ కుటుంబం.. ఏం డిమాండ్ చేశారంటే..!
-
Poori vs Paratha: పూరీ Vs పరాఠా.. దేనితో ఆరోగ్యానికి ఎక్కువ ప్రమాదం..? తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
-
Ketan Agarwal Case: ‘పెళ్లి నుంచి తప్పించుకోలేవు’.. కేతన్పై సియా గోయల్ సంచలన ఆరోపణ
-
Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!