Amit Shah: లోక్సభలో మాట్లాడే అవకాశమిస్తే రాహుల్గాంధీ విదేశాలకు వెళ్లిపోయారు
- రాహుల్గాంధీపై హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు లోక్సభలో మాట్లాడే అవకాశమిస్తే విదేశాలకు వెళ్లిపోయారని విమర్శ
లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదన్న రాహుల్ గాంధీ ఆరోపణలను అమిత్ షా కొట్టిపారేశారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వియత్నాంలో ఉన్నారని.. అక్కడ నుంచి వచ్చాక మాట్లాడతానంటూ పట్టుబట్టారన్నారు. సభలో మాట్లాడటానికి నియమాలు ఉంటాయన్న సంగతి ప్రతిపక్ష నాయకుడికి తెలియకపోవచ్చన్నారు. ఇష్టానుసారంగా సభను నడపలేం కదా? అని చెప్పారు. అయినా బడ్జెట్పై చర్చల్లో 42 శాతం సమయం రాహుల్కే ఇచ్చామని పేర్కొన్నారు. పార్లమెంట్ అనేది వారి పార్టీలా కాకుండా… నిబంధనలకు అనుగుణంగా నడుస్తోందని హితవు పలికారు. అయినా ప్రతిపక్ష నేత సభా నియమాలు, నిబంధనలు పాటించాలని అమిత్ షా సూచించారు.
ఇది కూడా చదవండి: Vijay Varma : ఒక బంధాన్ని ఐస్క్రీంలా ఆస్వాదించాలి..
Also Read
- Janasena Party: కర్ణాటకలో జనసేన విస్తరణకు శ్రీకారం.. పార్టీలో భారీగా చేరికలు
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- West Bengal Assembly Election 2026: చివరి దశ ఓటింగ్కు సిద్ధమైన బెంగాల్.. భవానీపుర్లో మమతా-సువేందు ఫేస్ ఆఫ్
- The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
దేశంలో ప్రజాస్వామ్యం లేదన్న కాంగ్రెస్ ఆరోపణలను కూడా అమిత్ షా ఖండించారు. దేశంలో ఎమర్జెన్సీ లాంటి పరిస్థితులుంటే.. కాంగ్రెస్ నేతలంతా జైల్లో ఉండేవారన్నారు. ఇక కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు కాంట్రాక్టుల్లో 4 శాతం కోటా ప్రకటించడాన్ని అమిత్ షా తప్పుపట్టారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఇలా చేయడం కరెక్ట్ కాదన్నారు. ఇక వచ్చే ఏడాది తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: CM Chandrababu: టీడీపీని లేకుండా చేస్తామని చాలా మంది చెప్పారు కానీ.. వాళ్లే కాలగర్భంలో కలిసిపోయారు..
ఇక మణిపూర్లో పరిస్థితులు సద్దుమణిగాయని.. శాంతి వాతావరణం నెలకొందని తెలిపారు. పరిస్థితులు క్రమక్రమంగా సాధారణ స్థితికి వస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే మణిపూర్ కోలుకుంటుందని చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే వక్ఫ్ (సవరణ) బిల్లును ప్రవేశపెడతామని తేల్చిచెప్పారు. సవరణ రాజ్యాంగానికి అనుగుణంగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: CM Chandrababu: టీడీపీని లేకుండా చేస్తామని చాలా మంది చెప్పారు కానీ.. వాళ్లే కాలగర్భంలో కలిసిపోయారు..
తాజావార్తలు
-
Aadarsha-kutumbam: వెంకీ మామ ‘ఆదర్శ కుటుంబం’లో వీరమల్లు బ్యూటీ..
-
Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం..
-
Riyan Parag: వరుస వివాదాల్లో రాజస్థాన్ రాయల్స్.. డ్రెస్సింగ్ రూమ్లో రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డ కెప్టెన్..
-
Lenin : రామ్ చరణ్ ‘పెద్ది’ దెబ్బతో మళ్లీ సైలెంట్ అయిన ‘లెనిన్’ !
-
Bajaj Chetak C2501 STD: బజాజ్ చేతక్ సిరీస్లో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర, ఫీచర్లు & స్పెసిఫికేషన్స్
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో