తమిళనాడు ప్రభుత్వం, ఆలయాల నిర్వాహకుల మధ్య వివాదం చినికి చినికి గాలివాన చందంగా మారుతోంది. నేడు ఆస్తుల లెక్కపై దీక్షితుల వైఖరి పై ఉత్కంఠ నెలకొంది. తమిళనాడులో దీక్షితుల నిర్వహణలో వందలాది ఆలయాలున్నాయి. చిదంబరం ఆలయాల్లో దీక్షితులదే నిర్వహణ బాధ్యత. అయితే, ఇప్పటివరకు జోక్యం చేసుకోలేదు దేవాదాయ శాఖ. తాజాగా అధీనాలు, దీక్షితుల ఆధ్వర్యంలో ఉన్న ఆలయ ఆస్తుల లెక్కించాలని స్టాలిన్ ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం వివాదానికి కారణం అవుతోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు అధీనాధిపతులు,…
ప్రేమించి బయట పెళ్ళిచేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. చాలామంది ఆర్యసమాజ్ లో పెళ్ళిచేసుకుంటుంటారు. అలా చేసుకుంటే ఇక వారికి గుర్తింపు వుండదు. ఆర్య సమాజ్ జారీచేసిన వివాహ ధ్రువపత్రాలకు చట్టబద్ధమైన గుర్తింపు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వివాహ ధ్రువపత్రాలు జారీ చేసే అధికారం ఆర్య సమాజ్కు లేదని ధర్మాసనం పేర్కొంది. అధికారులు జారీచేసిన వివాహ ధ్రువపత్రాలు…
విశాఖ పట్నంలోని రిషికొండలో టూరిజం భవనాల నిర్మాణాలపై ఎన్జీటీ విధించిన స్టే ఎత్తివేయాలని..ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. రిషికొండలో నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దేశ సర్వోన్నత న్యాయస్థానం. అక్కడ చదును చేసే ప్రాంతంలో నిర్మాణాలు చేసుకునేందుకు సుప్రీం కోర్టు అనుమతి మంజూరు చేసింది. ఇప్పటికే నిర్మాణాలున్న ప్రాంతంలో యథావిథిగా నిర్మాణాలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. రుషికొండ ప్రాజెక్ట్ కేసు విచారణ హైకోర్టుకు బదిలీ చేసింది. ట్రిబ్యునల్ పరిధి కంటే…
రిషికొండ టూరిజం ప్రాజెక్టు వ్యవహారంలో ఎన్జీటీ తీరును దేశ అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది. ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ ఆధారంగా ప్రాజెక్టు పనులను నిలిపివేస్తూ ఎన్జీటీ స్టే ఇవ్వడాన్ని తప్పుబడుతూ ఏపీ ప్రభుత్వం పిల్ వేసింది. ఈ పిటిషన్పై మంగళవారం నాడు వాదనల సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టులను చేరుకోలేని వారు రాసే లేఖలను మాత్రమే పిటిషన్లుగా పరిగణించాలంటూ హితవు పలికింది. Dhulipalla Narendra: ఏపీలో పశువుల దాణా తరహా కుంభకోణం కాగా ఏపీ ప్రభుత్వం…
జ్ఞానవాపి మసీదు కేసు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. తాజాగా వారణాసి జిల్లా కోర్ట్ లో ఈ కేసుపై విచారణ జరగుతోంది. తాజాగా ఈ రోజు వీడియోగ్రఫీ సర్వేను ఛాలెంజ్ చేస్తూ అంజుమన్ ఇంతేజామియా వేసిన పిటిషన్ ను వారణాసి కోర్ట్ విచారించింది. అయితే కోర్ట్ ముస్లింల తరుపున తదుపరి వాదనలను వినేందుకు మే 30కి విచారణ వాయిదా వేసింది. అయితే ఇప్పటికే వీడియో సర్వేపై అభ్యంతరాలు దాఖలు చేసేందుకు హిందూ, ముస్లిం పక్షాలకు కోర్ట్…
వ్యభిచారం చేయడం కూడా ఒక వృత్తే అని, వారిని ఇబ్బందిపెట్టి వారి పరువు తీయడం పద్దతికాదని పోలీసులకు, మీడియా వారికి సుప్రీం కోర్టు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇకనుంచివ్యభిచారం చేస్తూ పట్టుపడిన వర్కర్లపై క్రిమినల్ కేసులు పెట్టకూడదని పోలీసులకు తెలిపింది. తాజాగా సెక్స్ వర్కర్ల పై కేసు నమోదు చేయడం విషయమై విచారణ జరిపిన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక ఆదేశాల్ని జారీ చేసింది.”వ్యభిచారం చేసే వారిని మేము సమర్ధించం.. అలా అని వారిని అగౌర…
సిర్పూర్కర్ కమిషన్ నివేదికకు చట్టబద్ధత ఉందా?ఎన్ కౌంటర్ బూటకం కాకపోతే కేసు హైకోర్టుకు ఎందుకు వచ్చింది? కమిషన్ నివేదిక ఆధారంగా సుప్రీం తీర్పెందుకు ప్రకటించలేదు?ఎన్కౌంటర్ చేసిన పోలీసులకు శిక్ష ఉంటుందా? దిశ కేసు… దేశమంతా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో దిశపై జరిగిన దాడి ప్రజల్ని ఎంత కదిలించిందో, ఆ తర్వాత పదిరోజుల్లోపే దిశ నిందితుల ఎన్ కౌంటర్ అంతే సంచలనంగా మారింది. 2019 డిసెంబర్ 6న దిశ నిందితుల ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్…
దేశవ్యాప్తంగా సంచలన రేపిన దిశ ఎన్ కౌంటర్ పై తాజాగా ఈ రోజు సుప్రీం కోర్ట్ కీలక తీర్పు వెల్లడించింది. హైకోర్ట్ కు ఈ కేసును బదిలీ చేసింది. మరోవైపు దిశ ఎన్ కౌంటర్ పై నియమించిన సిర్పూర్కర్ కమిషన్ సంచలన విషయాలను వెలుగులోకి తీసుకువచ్చింది. దిశ ఎన్ కౌంటర్ పూర్తిగా బూటకమని.. పోలీసులు చట్టబద్ధం నడుచుకోలేదని ఆరోపించింది. ఎన్ కౌంటర్ లో పాలుపంచుకున్న 10 మంది పోలీసులపై హత్యా నేరాన్ని నమోదు చేయాలని సిఫార్సు చేసింది.…
సుప్రీంకోర్ట్ లో జ్ఞానవాపీ విచారణ జరుగుతోంది. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం చర్చనీయాంశంగా జ్ఞానవాపీ మసీదు వ్యవహారం మారింది. రెండు వర్గాల మధ్య ఏర్పడిన వివాదం కావడంతో సుప్రీం కోర్ట్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే సుప్రీం కోర్ట్ ఈ వ్యవహారాన్ని వారణాసిజిల్లా కోర్ట్ లోనే విచారించాలనే నిర్ణయంపై మొగ్గు చూపింది. జిల్లా జడ్జీ ఈ విచారణను చేపడితే బాగుంటుందని జస్టిస్ చంద్రచూడ్ సూచించారు. సీనియర్, అనుభవం ఉన్న జడ్జీ ఈ కేసును విచారిస్తారని సుప్రీం కోర్ట్…
దేశవ్యాప్తంగా సంచలన రేపిన దిశ ఎన్ కౌంటర్ కేసులో పోలీసులు కట్టుకథలు చెప్పారని.. ఎన్ కౌంటర్ బూటకం అని సిర్పూర్కర్ కమిషన్ తేల్చి చెప్పింది. చట్టపరమైన నిబంధనలను, పోలీస్ మాన్యువల్ రూల్స్ ను అతిక్రమించారని తెలిపింది కమిషన్. మీడియాకు విచారణ కమిషన్ కు పోలీసులు కట్టుకథలు చెప్పారని కమిషన్ తెలిపింది. ఎన్ కౌంటర్ స్థలంలో సీసీ కెమెరా పుటేజ్ దొరక్కుండా చేసిందని రిపోర్ట్ ఇచ్చింది సిర్పూర్కర్ కమిషన్. దిశ నిందుతులే పోలీసులపై కాల్పులు జరిపారనేది అబద్ధం అని…