కొన్ని సినిమాలు వినోదం మాత్రమే పంచవు.. విలువలు నేర్పిస్తాయి.. ఇంకొన్ని సినిమాలు మనుషులలో మార్పును తీసుకొస్తాయి.. మరికొన్ని సినిమాలు ప్రజల జీవితాలనే మార్చేస్తాయి. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారువారి పాట’చిత్రం అదే తరహా లిస్టులోకి చేరింది. అప్పుడెప్పుడో మహర్షి సినిమా చూసి చాలామంది కాలేజ్ స్టూడెంట్స్ సండే వ్యవసాయం అంటూ గ్రామాలకు వెళ్లి వ్యవసాయం చేశారు.. అప్పట్లో అది సంచలనం క్రియేట్ చేసింది. ఇక తాజాగా ‘సర్కారు వారి పాట’ లో తీర్పు…
నీట్ పీజీ- 2022 పరీక్షపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షను వాయిదా వేయాలంటూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఆ పిటిషన్లపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా నీట్ పీజీ పరీక్షను వాయిదా వేయలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పరీక్ష ఆలస్యమైతే డాక్టర్ల కొరత ఏర్పడుతుందని, తద్వారా రోగుల సంరక్షణపై తీవ్ర ప్రభావం పడుతుందని కోర్టు అభిప్రాయపడింది. అటు పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న లక్షల విద్యార్థుల జీవితాలను అయోమయంలోకి నెడుతుందని,…
చట్టాలు కొందరికే చుట్టాలు. మన దేశంలో చాలా ఈజీగా ఈ కామెంట్ పాస్ అవుతూ ఉంటుంది. దీనికి కారణాలు లేకపోలేదు. చట్టాల అమలు తీరు అలా ఉంటుంది. రాజకీయ, వ్యక్తిగత కక్షలకు దుర్వినియోగం అయ్యే చట్టాలు అనేకం. వీటిల్లో కొన్ని ప్రమాదకర చట్టాలు కూడా ఉంటాయి. ఆనాటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా శతాబ్దాల క్రితం బ్రిటిషర్లు రూపొందించిన IPCలో కొన్ని సెక్షన్లు ఇప్పటికీ భారతీయులకు ఉరితాడుగానే ఉన్నాయి. అందులో 124A ఒకటి. తదుపరి సమీక్ష జరిగేవరకు ఈ…
దాదాపు 150 ఏళ్ల నాటి రాజద్రోహ సెక్షన్ 124ఏ చట్టం అమలుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. కోర్టు తీర్పును ప్రభావితం చేసేలా మోదీ సర్కారు ఎన్ని ట్రిక్కులు వేసినా, చట్టాన్ని నిలుపుదల చేస్తూ సుప్రీంకోర్టు బుధవారం ఆదేశాలు జారీచేసింది. చట్టంపై కేంద్ర ప్రభుత్వం పునఃసమీక్ష పూర్తయ్యి, కోర్టు తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకూ ఈ చట్టంకింద ఎటాంటి కేసులు, చర్యలు తీసుకోవద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. అలాగే, ఈ చట్టం కింద నమోదైన కేసుల్లో ప్రస్తుతం…
భార్యతో బలవంతపు శృంగారం నేరమా? మారిటల్ రేప్ (వైవాహిక అత్యాచారం)ని నేరంగా పరిగణించాలా? అనే విషయం ఢిల్లీ హైకోర్టు భిన్న తీర్పును వెలువరించింది.. భార్యతో బలవంతపు శృంగారం నేరమే అవుతుందని ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న జస్టిస్ రాజీవ్ షక్దేహర్ ఆదేశాలు ఇచ్చారు. అయితే, బెంచ్లోని మరో న్యాయమూర్తి జస్టిస్ హరిశంకర్ మాత్రం ఆ ఆదేశాలతో విభేధించారు.. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 19, 21లను సెక్షన్ 375(మినహాయింపు 2) ధిక్కరిస్తుందనడానికి ఎలాంటి మద్ధతు కనిపించడం…
దేశద్రోహ చట్టాన్ని రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ చట్టాన్ని పునఃసమీక్షిస్తామని ..అప్పటి వరకు న్యాయస్థానం దీనిపై తన సమయాన్ని వెచ్చించవద్దని సోమవారం కేంద్రం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కేంద్రంపై పలు ప్రశ్నలు సంధించటంతో పాటు కొన్ని సూచనలు కూడా చేసింది. దేశద్రోహం చట్టాన్ని పునఃపరిశీలించే వరకు పౌరుల ప్రయోజనాల పరిరక్షణపై కేంద్రం…
మైనారిటీల గుర్తింపు విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు… రాష్ట్ర స్థాయిలో హిందువులు సహా మైనారిటీలను గుర్తించే అంశంపై కేంద్రం భిన్నమైన వైఖరిని అవలంభించడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది మరియు మూడు నెలల్లో ఈ అంశంపై రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాలని ఆదేశాలు జారీ చేసింది.. దేశంలో హిందువులు 10 రాష్ట్రాల్లో మైనార్టీలుగా ఉన్నారని, రాష్ట్ర స్థాయిలో మైనార్టీల గుర్తింపు కోసం మార్గదర్శకాలు రూపొందించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టింది…
ఢిల్లీలోని షాహీన్బాగ్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి… కేంద్ర ప్రభుత్వ బుల్డోజర్ డ్రైవ్ను నిరసిస్తూ ఆందోళనకారులు నిరసన చేపట్టారు. అక్రమ కట్టడాల కూల్చివేత పేరుతో నరేంద్ర మోడీ సర్కార్ ఈ ప్రాంతంలోని ముస్లింల నివాసాల కూల్చివేతను ప్రారంభించిందని మండిపడుతున్నారు.. మరోవైపు.. షాహీన్బాగ్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై జోక్యం చేసుకోమని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.. కోర్టును ఆశ్రయించినవారిలో బాధితులు లేరని సుప్రీం పేర్కొంది.. ఈ వ్యవహారంలో రాజకీయ పార్టీ పిటిషన్ దాఖలు చేసిందని సుప్రీంకోర్టు పేర్కొంది. షాహీన్బాగ్లో ఆక్రమణల…
ఓ కేసులో నిందితుడిగా ఉన్న యువకుడు, విద్యార్థి విభాగం నాయకుడికి బెయిల్ వచ్చింది.. దీంతో, అతడికి అనుకూలంగా సంబరాలే జరిగాయి… ఏకంగా పోస్టర్లు వెలిశాయి.. అయ్యగారి కీర్తిని చాటుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.. ఈ పరిణామాలను సీరియస్గా తీసుకున్న సుప్రీంకోర్టు.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నిందితుడు బెయిల్ రద్దు చేసింది.. అంతే కాదు వారం రోజుల్లో లొంగిపోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అత్యాచారం కేసులో నిందితుడైన మధ్యప్రదేశ్ యువకుడికి బెయిల్…
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ బాధ్యతలు స్వీకరించిన తర్వాత న్యాయవ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.. సుప్రీంకోర్టుతో పాటు.. వివిధ రాష్ట్రాల హైకోర్టుల్లోనూ జడ్జీల నియామకం చేపట్టగా.. ఇప్పుడు సుప్రీంకోర్టుకు కొత్తగా మరో ఇద్దరు న్యాయమూర్తులు రానున్నారు.. గౌహటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుధాన్శు ధులియా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సిఫార్సు చేసింది సుప్రీంకోర్టు కొలీజియం.. ఆయన స్వస్థలం ఉత్తరాఖండ్.. దీంతో, సుప్రీంకోర్టులో ఉత్తరాఖండ్ నుంచి రెండవ న్యాయమూర్తి కానున్నారు ధులియా. Read Also:…