Supreme Court: యోగీ సర్కార్ బుల్డోజర్ యాక్షన్ పై విచారణ.. స్టే ఇచ్చేందుకు నిరాకరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తర్వాత యూపీతో పాటు దేశ వ్యాప్తంగా ముస్లింలు ఆందోళనలు చేశారు. అయితే కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చెలరేగాయి. ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్, ప్రయాగ్ రాజ్, హత్రాస్, సహరాన్ పూర్ ఏరియాల్లో రాళ్ల దాడులు, ఆస్తుల విధ్వంసం జరిగింది. దీంతో అక్కడి యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ కన్నెర్ర చేసింది. ఇప్పటికే 300కు పైగా నిందితులను అరెస్ట్ చేయగా.. ప్రధాన నిందితులకు సంబంధించి వారి అక్రమ ఆస్తులను బుల్డోజర్లతో కూల్చివేస్తోంది ప్రభుత్వం.
తాజాగా ఈ అంశంపై సుప్రీం కోర్ట్ లో విచారణ జరుగుతోంది. యూపీలో నిందితుల ఇళ్లు కూలగొట్టకుండా యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ కు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా జమియత్- ఉలేమా- ఏ- హింద్ సంస్థ సుప్రీం కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసింది. గురువారం ఈ పిటిషన్ ను కోర్ట్ విచారిస్తోంది. అక్రమ కూల్చివేతకు పాల్పడుతున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సింది సుప్రీం కోర్ట్ ను పిటిషన్ దారులు కోరారు. యూపీలో జావెద్ మహ్మద్ ఇంటితో సహా మరికొంత మంది ఇళ్లను కూల్చివేయడంపై ఈ పిటిషన్ దాఖలు చేశారు.
Also Read
జమియత్ ఉలేమా ఏ హింద్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం కోర్ట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్ కు వ్యతిరేఖంగా రెస్పాండ్ కావాలని.. మూడు రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని యూపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. వచ్చే వారం విచారణ జరుపుతామని కేసును వాయిదా వేసింది.అయితే కూల్చివేతకు స్టే ఇవ్వలేమని.. అయితే కూల్చివేతలు చట్టప్రకారం జరగాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
యూపీ ప్రభుత్వం తరుపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపించారు. యూపీలో సరైన ప్రక్రియలోనే కూల్చివేతలు జరగుతున్నాయని ఆయన సుప్రీంకు తెలిపారు. ఢిల్లీ జహంగీర్ పురి ప్రాంతంలో ఏ వర్గానికి చెందని ఆస్తి ఉందో చూడకుండా నిర్మాణాలను తొలగించారని..ఇటువంటి కూల్చివేతలు సరైన ప్రక్రియలోనే సాగుతున్నాయని ఆయన కోర్టుకు విన్నవించారు. ఇదే సమయంలో పిటిషనర్ల తరుపున వాదిస్తున్న సీయూ సింగ్.. కూల్చివేతలకు ముందు 15-40 రోజుల డెడ్ లైన్ ఉండాలని, కూల్చివేతలకు ముందు నోటీసులు అందించాలని సుప్రీంను కోరారు. ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూనే కూల్చివేతలు జరగుతున్నాయని ఆరోపించారు.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!