Harish Rana Dies: 13 ఏళ్లుగా కోమాతో నరకం అనుభవిస్తున్న హరీష్ రాణా ఎట్టకేలకు తుది శ్వాస విడిచారు. భారతదేశంలో పాసివ్ యుథనేషియా(ఇచ్చా మరణం)గా అనుమతి పొందిన తొలి వ్యక్తిగా హరీష్ రాణా సంచలనం సృష్టించారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఢిల్లీలోని ఎయిమ్స్లో ఆయన మంగళవారం తుది శ్వాస విడిచారు.
తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. గత కొంతకాలంగా ఈ కేసు విచారణలో భాగంగా ఆయనకు ఉన్న మధ్యంతర బెయిల్ను రెగ్యులర్ బెయిల్గా మారుస్తూ జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ మహాదేవన్ల ధర్మాసనం మంగళవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు విచారణ దాదాపు ముగింపు దశకు చేరుకుందని, మరో రెండు వారాల్లో సప్లిమెంటరీ…
కరోనా మహమ్మారి.. ఈ పేరు వింటేనే గుండెలు గుభేలుమంటుంటాయి. ప్రపంచానికి సంకెళ్లు పడినట్లుగా కరోనా విశ్వరూపం చూపింది. వేలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. వందలాది మంది అనారోగ్యానికి గురయ్యారు. కోవిడ్ నుంచి విముక్తి కోసం ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ తయరీకి కృషి చేసి చివరకు వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. భారత్ లో కోవాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను అందించిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాక్సిన్ల ప్రభావంతో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధిత…
8వ తరగతి పుస్తకంలో ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అనే పాఠ్యాంశం దేశాన్ని కుదిపేస్తోంది. ఈ వ్యవహారంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం బుధవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా ఈ అంశంపై మరోసారి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ సీరియస్ అయ్యారు
8వ తరగతి పుస్తకంలో ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అనే పాఠ్యాంశంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం బుధవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదేం పద్ధతి అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒక సంస్థను అవమానిస్తామంటే చూస్తూ ఊరుకోబోమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించిన న్యాయస్థానం.. గురువారం విచారిస్తామని స్పష్టం చేసింది.
8వ తరగతి పుస్తకంలో ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అనే పాఠ్యాంశం చేర్చడంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదేం పద్ధతి అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒక సంస్థను అవమానిస్తామంటే చూస్తూ ఊరుకోబోమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
ప్రజలందర్నీ సమానంగా ఆదరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అందరికీ కనీస జీవనప్రమాణాలు అందివ్వటమే లక్ష్యంగా పాలన సాగాలి. కానీ నిరుపేదలకు ఆసరా ఇవ్వటానికి ఉద్దేశించిన సంక్షేమం రూపు మార్చిన ప్రభుత్వాలు.. ఇష్టారాజ్యంగా ఉచితాలతో బరితెగిస్తున్నాయి. ఈ పోకడలే పుట్టి ముంచుతాయని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఉచితాలపై కొంతకాలంగా కొనసాగుతున్న చర్చకు సుప్రీంకోర్టు తెరదించింది. ఉచితాలను, సంక్షేమాన్ని కలగలిపి చూడొద్దని దిశానిర్దేశం చేసింది. ఆర్థికవ్యవస్థను కుదేలు చేసే ఉచితాలను పక్కనపెట్టి.. నిరుపేదల కనీస అవసరాలు తీర్చే విధంగా…
ఎన్నికల ముందు ఉచిత పథకాలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పంచుకుంటూ పోతే అభివృద్ధికి ఒక్క పైసా కూడా మిగలదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై గత కొద్దిరోజులుగా రకరకాలైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిందని.. కంటి చూపును కూడా కోల్పోయారని వార్తలు వినిపిస్తున్నాయి. ఓ వైపు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.
దేశ వ్యాప్తంగా వీధి కుక్కల సమస్యపై పెద్ద ఎత్తున రాద్ధాంతం జరుగుతోంది. వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల తర్వాత జంతు ప్రేమికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో డాగ్ లవర్స్ పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు.