Supreme Court: ‘‘ప్రజల్ని చంద్రుడి పైకి తరలించాలా? మరెక్కడికైనా పంపాలా?’’ అంటూ సుప్రీంకోర్టు శుక్రవారం పిటిషనర్పై ఫైర్ అయింది. భారతదేశ జనాభాలో 75 శాతం మంది భూకంపాల జోన్లోనే ఉన్నారని, భూకంపాల వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడానికి అధికారులు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టేస్తూ, ఈ వ్యాఖ్యలు చేసింది.
Delhi riots case: 2020 ఈశాన్య ఢిల్లీ అల్లర్ కేసులో నిందితుడిగా ఉన్న జేఎన్యూ మాజీ విద్యార్ధి, ఢిల్లీ ట్రయల్ కోర్టు జైలులో ఉన్న ఉమర్ ఖలీద్కు ఢిల్లీ కోర్టు తాత్కాలిక బెయిల్ ఇచ్చింది. తన సోదరి వివాహానికి హాజరు కావడానికి రెండు వారాల తాత్కాలిక బెయిల్ మంజూరైంది. కోర్టు డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 29 వరకు రూ. 20,000 వ్యక్తిగత బాండ్పై, అదే మొత్తంలో ఇద్దరు పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. ఉమర్ మధ్యంతర…
Phone Tapping Case : తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావును వెంటనే సిట్ (SIT) ముందు సరెండర్ కావాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఇప్పటివరకు అరెస్ట్ నుంచి సుప్రీంకోర్టు రక్షణ కల్పిస్తూ వచ్చినప్పటికీ, తాజాగా ఈ రక్షణను తొలగించి, కస్టడీలో విచారించాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసు విషయంలో ప్రభాకర్ రావు విచారణకు ఏ…
Phone Tapping Case : తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ సుప్రీంకోర్టులో రేపటికి వాయిదా పడింది. ఈ సందర్భంగా, కేసు దర్యాప్తునకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది ధర్మాసనానికి ఒక ముఖ్య విషయాన్ని తెలియజేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు దర్యాప్తు సంస్థతో ఏమాత్రం సహకరించడం లేదని, దర్యాప్తు సంస్థతో ఆయన ఆటలాడుతున్నారని ఆరోపించారు. అంతేకాకుండా, కీలకమైన రుజువులను నిర్వీర్యం చేసే ప్రయత్నంలో…
ఇండిగో సంక్షోభంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక స్టేట్మెంట్ జారీ చేసింది. దేశ వ్యాప్తంగా నెలకొన్న ఇండిగో సంక్షోభంపై అత్యవసర విచారణ చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సోమవారం పిటిషన్ విచారణకు రాగా... సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
BR Gavai: ముంబై విశ్వవిద్యాలయంలో జరిగిన ‘అఫర్మేటివ్ యాక్షన్ అండ్ ఈక్వల్ ఆపర్చునిటీ’ అంశంపై భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) బీఆర్ గవాయ్ మాట్లాడుతూ.. షెడ్యూల్డ్ కులాల (SC) రిజర్వేషన్లలో "క్రీమీ లేయర్" సూత్రాన్ని అమలు చేయాలని తాను ఇచ్చిన తీర్పుపై సొంత కులం నుంచే విమర్శలను ఎదురవుతున్నట్లు వెల్లడించారు.
High Tension in Vijayawada: విజయవాడ భవానీపురంలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు బాధితులు.. వారిని స్థానికులు అడ్డుకున్నారు. మరోవైపు.. రోడ్లపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు బాధితులు. ఆందోళన చేస్తున్న వారిని అడ్డుకుంటున్నారు పోలీసులు.. అయితే, పోలీసులను చుట్టుముట్టి వారితో వాగ్వాదానికి దిగారు బాధితులు. మరోవైపు.. భవానీపురంలో భవనాలు కూల్చివేసిన తర్వాత.. సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. కూల్చివేతలు ఆపాలని ఉత్తర్వులు ఇచ్చింది. Read Also: Top Headlines @ 9 PM: టాప్…
CJI Surya Kant: తప్పిపోయిన ఐదుగురు రోహింగ్యాలను గుర్తించాలని కోరుతూ దాఖలపై పిటిషన్పై సీజేఐ సూర్యకాంత్ తీవ్రంగా స్పందించారు. అక్రమ వలసదారులకు దేశం రెడ్ కార్పెట్ పరిచి స్వాగతించాలా.? అని ప్రశ్నించారు. ఎవరైనా అక్రమంగా దేశంలోకి ప్రవేశిస్తే వారిని దేశంలో ఉంచాల్సిన బాధ్యత ఉందా అని ప్రధాన న్యాయమూర్తి అడిగారు. రోహింగ్యాలను చట్టపరమైన ప్రక్రియ ద్వారా బహిష్కరించాలని పిటిషన్ లో కోరారు.
వక్ఫ్ రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. UMEED పోర్టల్లో అన్ని వక్ఫ్ ఆస్తులను (‘వక్ఫ్ బై యూజర్’ హోదా ఉన్న వాటితో సహా) నమోదు చేయడానికి ఆరు నెలల గడువును ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించబోమని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. వక్ఫ్ (సవరణ) చట్టం, 2025 ప్రకారం వక్ఫ్ ఆస్తులను నమోదు చేయడానికి ఆరు నెలల గడువును పొడిగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సోమవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది. కొత్త చట్టం ప్రకారం అందించిన…
Maulana Mahmood Madani: జమియత్ ఉలేమా-ఎ-హింద్ చీఫ్ మౌలానా మహమూద్ మదాని మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో జరిగిన ఒక కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీదు, ట్రిపుల్ తలాక్, జ్ఞాన్వాపి-కాశీ వంటి కేసులతో సుప్రీం, హైకోర్టులపై ప్రభుత్వాలు ఒత్తిడిని పెంచుతున్నాయని ఆరోపించారు