దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టినా..అక్కడక్కడా పెరుగుతున్న కేసుల నేపథ్యంలో అప్రమత్తంగా వుండాలంటున్నారు నిపుణులు. ఇదిలా వుంటే పిల్లల వ్యాక్సినేషన్ సురక్షితమేనని నిపుణులు విశ్లేషించిన సంగతి తెలిసిందే. దీనిపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తన కీలక తీర్పు వెల్లడించింది. నిపుణులు తమ అభిప్రాయం చెప్పాక తాము నిర్ణయాన్ని వెలువరించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశంలో పిల్లలకు కొవిడ్ టీకాలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. శాస్త్రీయ ఏకాభిప్రాయం, ప్రపంచ సాధికార సంస్థల సూచనలకు అనుగుణంగానే ఉన్నట్లు…
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఆమ్రపాలి సంస్థతో నెలకొన్న వివాదాలపై జోక్యం చేసుకోవాలని అతడు పిటిషన్ దాఖలు చేశాడు. ఇదే అంశంలో గతంలో కూడా ధోనీ కోర్టు మెట్లెక్కాడు. ఆమ్రపాలితో నడుస్తున్న వివాదాలపై జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టును ధోనీ తన పిటిషన్లో అభ్యర్థించాడు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు మే 6న విచారణ చేపట్టనున్నట్లు ప్రకటించింది. 2009-2016 మధ్యలో ఆమ్రపాలి కన్స్ట్రక్షన్ కంపెనీకి ధోనీ బ్రాండ్…
అక్రమ లేఅవుట్లు అతిపెద్ద సమస్యగా మారిందని అభిప్రాయపడింది సుప్రీంకోర్టు… దేశవ్యాప్తంగా అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది.. అక్రమ లేఅవుట్ల క్రమబద్దీకరణను సవాల్ చేసిన జువ్వాడి సాగర్ రావు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టింది సుప్రీం.. కేసులో అమికస్ క్యూరీగా సీనియర్ అడ్వకేట్ శంకర్ నారాయణను నియమించింది అత్యున్నత న్యాయస్థానం.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు జస్టిస్ నాగేశ్వరరావు.. అక్రమ లేఅవుట్లు అతిపెద్ద సమస్యగా మారాయన్న ఆయన.. అనియంత్రిత…
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ హింస కేసులో ప్రధాన నిందితుడు, కేంద్రమంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా కోర్టులో లొంగిపోయాడు. లఖింపూర్లో వ్యవసాయ చట్టాలపై శాంతియుతంగా పోరాడుతున్న రైతులపైకి కారుతో వేగంగా దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు సహా ఆ తర్వాత జరిగిన అల్లర్లలో మరో నలుగురు సహా మొత్తం 8 మంది మృతికి కారకుడయ్యాడంటూ ఆశిష్ మిశ్రాపై తీవ్ర అభియోగాలు వచ్చాయి. దీంతో ఆశిష్ మిశ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఆశిష్ మిశ్రాపై…
సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. మళ్లీ ఆయన్ను సర్వీస్లోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పీని తోసిపుచ్చింది సుప్రీం.. అయితే, హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ఈ పరిణామంతో ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట లభించగా.. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మీడియాతో మాట్లాడిన ఏబీ వెంకటేశ్వరరావు.. సీరియస్గా స్పందించారు. ఏపీ ప్రభుత్వ స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టేసిందని.. ఆంద్రప్రదేశ్…
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు మళ్లీ ఆయన్ను సర్వీస్లోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పీని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అయితే హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. కాగా సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట లభించినట్లు భావించొచ్చు. కాగా టీడీపీ హయాంలో అక్రమంగా నిఘా పరికరాలు కొనుగోలు చేసి గూఢచర్యం చేశారనే ఆరోపణల…
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వ్యవహారంపై గురువారం ఉదయం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై వాదోపవాదాలు జరిగాయి. ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎంతకాలం కొనసాగిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రెండేళ్లకు మించి సస్పెన్షన్ చేయకూడదన్న నిబంధనలు గమనించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన నిర్దేశాలు కోరామని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు వివరించారు. సస్పెన్షన్ కొనసాగించేందుకు నిర్దేశాలు కోరినట్లు…
లఖింపూర్ ఖేరీ కేసులో ఆశిష్ మిశ్రాకు బెయిల్ను రద్దు చేసింది సుప్రీంకోర్టు… అలహాబాద్ హైకోర్టు ఆశిష్మిశ్రాకు బెయిల్ మంజూరు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇదే సమయంలో.. వారం రోజుల్లోగా లొంగిపోవాలని ఆశిష్ మిశ్రాను ఆదేశాలు జారీ చేసింది అత్యున్నత న్యాయస్థానం… అలహాబాద్ హైకోర్టు ఆదేశాలను పక్కన పెడుతూ, లఖింపూర్ ఖేరీ హింసాకాండ నిందితుడు ఆశిష్ మిశ్రాకు మంజూరైన బెయిల్ను సుప్రీంకోర్టు రద్దు చేసింది.. కాగా, ఈ కేసులో అలహాబాద్ హైకోర్టు మిశ్రాకు బెయిల్ మంజూరు…
పాకిస్థాన్లోని ఇమ్రాన్ ఖాన్ సర్కార్పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం విషయంలో కీలక మలుపు చోటు చేసుకుంది.. నేషనల్ అసెంబ్లీని రద్దు చేస్తూ డిప్యూటీ స్పీకర్ ఖాసీం సూరి తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది పాక్ సుప్రీంకోర్టు… వెంటనే నేషనల్ అసెంబ్లీని పునరుద్ధరించాలని ఆదేశించింది… ఇక, నేషనల్ అసెంబ్లీని రద్దు చేయాల్సిందిగా ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. అధ్యక్షుడిని కోరలేరని పేర్కొంది.. ఇవాళ అసెంబ్లీని సమావేశ పర్చాలని, అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగాలని కూడా కోర్టు స్పష్టం చేసింది.…
న్యాయస్థానాల పట్ల ప్రభుత్వాలు వ్యవహరించే తీరుపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అసహనం వ్యక్తం చేశారు. కోర్టులు వెలువరించే తీర్పులు, వ్యక్తం చేసే అభిప్రాయాలు తమకు అనుకూలంగా రాకపోతే ప్రభుత్వాలు న్యాయమూర్తులను కించపరుస్తున్నారని.. ఇది దురదృష్టకర పరిణామం అని ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. గతంలో ప్రైవేట్ పార్టీలు మాత్రమే ఇలా వ్యవహరించేవి అని ఆయన గుర్తుచేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో మాజీ ఐఏఎస్ అధికారి ఆమన్కుమార్పై నమోదైన కేసును ఛత్తీస్గఢ్ హైకోర్టు కొట్టివేసింది.…