Temples vs Tamilnadu Govt : తమిళనాడు సర్కార్ వర్సెస్ దేవాలయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు ప్రభుత్వం, ఆలయాల నిర్వాహకుల మధ్య వివాదం చినికి చినికి గాలివాన చందంగా మారుతోంది. నేడు ఆస్తుల లెక్కపై దీక్షితుల వైఖరి పై ఉత్కంఠ నెలకొంది. తమిళనాడులో దీక్షితుల నిర్వహణలో వందలాది ఆలయాలున్నాయి. చిదంబరం ఆలయాల్లో దీక్షితులదే నిర్వహణ బాధ్యత. అయితే, ఇప్పటివరకు జోక్యం చేసుకోలేదు దేవాదాయ శాఖ.
తాజాగా అధీనాలు, దీక్షితుల ఆధ్వర్యంలో ఉన్న ఆలయ ఆస్తుల లెక్కించాలని స్టాలిన్ ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం వివాదానికి కారణం అవుతోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు అధీనాధిపతులు, దీక్షితులు. అన్ని ప్రధాన దేవాలయాల నిర్వహణను నియంత్రిస్తున్న తమిళనాడు హిందూ మత..ధర్మాదాయ శాఖ (హెచ్ఆర్ అండ్ సిఇ) శాఖ చిదంబరం నటరాజ ఆలయానికి చెందిన వారి ఖాతాలు, ఆస్తుల వివరాలను తమ వద్ద ఉంచాలని కోరుతూ వారికి నోటీసులు పంపడం వివాదానికి కారణం అవుతోంది.
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
దేవాలయానికి చెందిన ఆస్తులకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించాలని దీక్షితులు వర్గానికి తమిళనాడు రాష్ట్ర హిందూ మత, ధర్మాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేయడం మరింత వివాదాన్ని పెంచింది. ఆలయ ఆస్తులువివరాలను జూన్ 7 , 8 తేదీల్లో తెలిపాలని నోటీసుల్లో పేర్కొంది. ఆలయంలోని కనగసభలో దర్శనం పునఃప్రారంభించాలంటూ హెచ్ఆర్ అండ్ సీఈ శాఖ ఉత్తర్వులు జారీ చేయడంపై దీక్షితులు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేశారు.
ద్రావిడన్ మోడల్ పాలన మాకు అక్కరలేదంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నిన్న చిదంబరం నటరాజ.స్వామి ఆలయంలో దీక్షితులతో దేవాదాయ శాఖ మంత్రి శేఖర్ బాబు భేటీ అయ్యారు. ఆస్తుల లెక్క తేల్చడంలో తగ్గేది లేదన్న మంత్రి వైఖరిపై మండిపడుతున్నారు. అధీనాధిపతులు, దీక్షితులతో చర్చిస్తున్నామని, కొందరు కావాలనే వివాదం చేస్తున్నారన్నారు మంత్రి. నాస్తికులు, ఆస్తికులు కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు వెళ్లాలన్నారు శేఖర్ బాబు. చిదంబరం ఆలయానికి దేవాదాయ శాఖ అధికారులు వెళ్ళనుండడంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ ఏర్పడింది. ఆలయ సంపద విషయంలో ప్రభుత్వంతో ఎలాంటి పోరాటానికైనా తాము రెడీగా ఉన్నామని దీక్షితుల వర్గం పేర్కొంది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!