ట్రినిడాడ్లో ప్లేయింగ్ లెవన్ పై కెప్టెన్ రోహిత్ శర్మను అడిగినప్పుడు.. సమాధానం చెప్పలేదు. అంతేకాకుండా చాలా కారణాలను చెప్పాడు. డొమినికా మరియు పోర్ట్ ఆఫ్ స్పెయిన్ మధ్య వ్యత్యాసాన్ని ఎత్తి చూపాడు. డొమినికా పరిస్థితి.. అక్కడి పిచ్ గురించి తనకు బాగా తెలుసునని రోహిత్ అన్నారు. కానీ.. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ విషయంలో అలా కాదన్నాడు. అంతేకాకుండా ట్రినిడాడ్ లో ప్రతికూల వాతావరణమే ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు.
గతేడాది టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్ను భారత్ ఓడించిన తీరును ఇంకెవరూ మరిచిపోరు. ఆ విజయం విరాట్ కోహ్లీ కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ గా చెబుతారు. అంతేకాకుండా పాకిస్థాన్పై భారత్ సాధించిన అద్భుతమైన విజయాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే మ్యాచ్. ఆ మ్యాచ్ లో కింగ్ కోహ్లీ ఆడిన ఆటతీరును క్రికెట్ అభిమానులు ఎవరూ మర్చిపోరు. అయితే ఇప్పుడు కోహ్లీ ఆ మ్యాచ్ లో ఆడిన తీరును స్ఫూర్తిగా తీసుకుని ఎమర్జింగ్ ఆసియా కప్లో పాకిస్థాన్తో తలపడేందుకు భారత్-ఎ ఆటగాళ్లు…
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్లో ఓటమి తర్వాత సరిగ్గా నెల రోజుల విరామం అనంతరం భారత అభిమానుల కోసం మళ్లీ క్రికెట్ సందడి మొదలైంది. భారత జట్టు మరోసారి సంప్రదాయ క్రికెట్లో కొత్త పోరుకు సన్నద్ధమైంది. 2023–25 డబ్ల్యూటీసీ క్యాలెండర్లో భాగంగా భారత్ తమ తొలి సిరీస్ బరిలోకి దిగనుంది.
విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే సహా పలువురు ఆటగాళ్లు డిఫరెంట్ డ్రిల్ చేస్తున్న వీడియోను బీసీసీఐ సోమవారం పోస్ట్ చేసింది. ప్రాక్టీస్ సెషన్లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ డ్రిల్తో పాటు, టీమ్ ఇండియా తన ఫీల్డింగ్ను మెరుగుపరచడానికి ప్రత్యేక కసరత్తు చేసింది.
ఇండియా ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ చాలా కాలంగా టీమ్ కు దూరంగా ఉన్నాడు. టీమిండియాలో పునరాగమనం కోసం ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత జట్టులో.. ఈసారి కూడా ఇషాంత్ శర్మకు చోటు దక్కలేదు. కానీ వెస్టిండీస్ సిరీస్ లో ఇషాంత్ కనిపించనున్నాడు. భారత్, వెస్టిండీస్ సిరీస్లతో ఇషాంత్ అరంగేట్రం చేయబోతున్నాడంటే.. నిజమనే చెప్పాలి కానీ మ్యాచ్ లో కాదు. ఈ సిరీస్లో ఇషాంత్ కామెంట్రీ చేస్తూ కనిపించనున్నాడు.
2023 ప్రపంచకప్ క్వాలిఫయర్లో శ్రీలంక విజేతగా నిలిచింది. ఫైనల్లో నెదర్లాండ్స్పై 128 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయానికి మహిష్ తీక్షణ హీరోగా నిలిచాడు. 18 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. తీక్షణ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలవగా, 60 పరుగులతో 3 వికెట్లు తీసిన సీన్ విలియమ్స్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచాడు.
నాలుగు నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మళ్లీ మైదానంలోకి దిగిన భారత మహిళా క్రికెట్ జట్టు అనుకున్నట్టుగానే విజయాన్ని నమోదు చేసింది. మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో టీమిండియా మహిళల జట్టు విజయం సాధించింది. బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టి20లో 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఆఫ్ఘనిస్థాన్ జట్టు స్పిన్ బౌలింగ్కు చాలా ఫేమస్ అని క్రికెట్ ఫ్యాన్స్ కు తెలిసిన విషయమే. ఈ జట్టులో రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ వంటి బౌలర్లు.. ఎలాంటి బ్యాట్స్మెన్నైనా ఇబ్బంది పెట్టగలరు. అయితే శనివారం బంగ్లాదేశ్తో జరిగిన రెండో వన్డేలో అఫ్గానిస్థాన్ బ్యాట్స్మెన్లు తమ సత్తా చాటుతూ భారీ స్కోరు చేశారు. ఆఫ్ఘనిస్థాన్ 9 వికెట్ల నష్టానికి 331 పరుగులు చేసింది.
మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ) నుంచి తప్పుకుంటున్నట్లు అంబటి రాయుడు తెలిపాడు. ఈ విషయాన్ని టెక్సాస్ సూపర్ కింగ్స్ ట్విటర్లో తెలిపింది. రాయుడు లీగ్ నుంచి తప్పుకుంటున్న విషయమై.. టీఎస్కే ట్వీట్ లో వివరణ ఇచ్చింది. ‘ఎంఎల్సీ ఫస్ట్ సీజన్ లో అంబటి రాయుడు అందుబాటులో ఉండటం లేదు.
వెస్టిండీస్తో జరిగే ఐదు టీ20ల సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అందులో హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మకు చోటు దక్కింది. గత ఐపీఎల్ లో అద్భుత ప్రదర్శన కనబరిచిన తిలక్.. ఎట్టకేలకు టీ20ల్లో స్థానం దక్కించుకున్నాడు. అందరూ అనుకున్నట్టుగానే జాతీయ స్థాయిలో ఆడుతాడని పలువురు క్రికెటర్లు చెప్పారు.