TG Municipal Elections Live Updates: తెలంగాణలో పురపోరు తుది ఘట్టానికి చేరుకుంది. నేడు ఉదయం 8 గంటలకే మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమవుతుంది. 12,993 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. 3 నుంచి 8 రౌండ్లలో ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. 136 కౌంటింగ్ కేంద్రాల్లో మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతుంది.. తరువాత సాధారణ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపడతారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు, కార్యకర్తలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్టీవీలో పురపాలిక ఎన్నికల ఫలితాల లైవ్ అప్డెట్స్ మీకోసం..
సంగారెడ్డి మున్సిపాలిటీ ఒకటో వార్డు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు
BRS-07
BJP-02
CONG-0
సంగారెడ్డి మున్సిపాలిటీ రెండో వార్డు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు
CONG-03
BRS-01
BJP-02
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ.. పూర్తయిన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు.. బ్యాలెట్ బాక్సులు తెరిచి బ్యాలెట్ ఓట్లను కట్టలు కడుతున్న సిబ్బంది.. 25 బ్యాలెట్స్ ను ఒక్కో కట్టాలో చేర్చి కట్టలు కడుతున్న సిబ్బంది.. మొదటి రౌండ్ లో 480 కట్టలు లెక్కించనున్న అధికారులు..
భద్రాద్రిలో మొదటి ఫలితం అశ్వారావుపేట వచ్చేలా ప్లాన్.. ఇది అధికార కాంగ్రెస్కు సెంటిమెంట్.. అసెంబ్లీ ఎన్నికల్లో మొదట అశ్వరావుపేట కాంగ్రెస్కు విజయం.. ఈ సారి కూడా మొదటి ఫలితం వచ్చేలా అన్ని ఒకే రౌండ్లో ఫలితం వెల్లడి చేయనున్న అధికారులు..
నల్లగొండ జిల్లా: ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్.. స్ట్రాంగ్ రూమ్ ల నుండి కౌంటింగ్ హాల్లోకి చేరిన బ్యాలెట్ బాక్స్లు.. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తి అయ్యాక.. ప్రారంభం కానున్న బ్యాలెట్ లెక్కింపు.. నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో అన్ని వార్డులకు ఏకకాలంలో జరగనున్న ఓట్ల లెక్కింపు.. యాదాద్రి జిల్లా మున్సిపాలిటీలలో వార్డులను 3 నుంచి 4 రౌండ్లుగా విభజించి లెక్కించనున్న ఓట్లు..
ఆదిలాబాద్.. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభం.. ఆదిలాబాద్ లో మొత్తం 435 పోస్టల్ ఓట్లు..
ఉమ్మడి వరంగల్ జిల్లా లోని 12 మున్సిపాలిటీలో కౌంటింగ్ ప్రారంభం.. ఎనిమిది గంటలకి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ని ప్రారంభించిన కౌంటింగ్ సిబ్బంది..
సంగారెడ్డి మున్సిపల్ కౌంటింగ్ కేంద్రం తారా డిగ్రీ కాలేజీ కౌంటింగ్ రూమ్ నంబర్ 6లో నిలిచిన విద్యుత్.. ఇంకా ప్రారంభం కానీ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు
మున్సిపల్ ఎన్నికల ఫలితాల లెక్కింపు షురూ.. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీగా బందోబస్తు.. 136 కౌంటింగ్ కేంద్రాల్లో మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు.. తరువాత సాధారణ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు..
కొద్ది సేపట్లో ప్రారంభం కానున్న ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్.. కౌంటింగ్ కోసం పటిష్ట ఏర్పాట్లు చేసిన జిల్లా ఎన్నికల అధికారులు.. మంగల్ పల్లి లోని శ్రీ ఇందూ కాలేజీ లో కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు.. మొత్తం 24 వార్డులకు 48 పోలింగ్ బూత్లు.. కౌంటింగ్ కోసం 12 టేబుల్స్ ఏర్పాటు చేసిన అధికారులు.. రెండు రౌండ్లలో పూర్తి కానున్న కౌంటింగ్ ప్రక్రియ.. ఎన్నికల ఆర్ఓ అనంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరగనున్న కౌంటింగ్.. కౌంటింగ్ లో పాల్గొన్న 100 మంది సిబ్బంది..
వరంగల్ ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధం.. 12 మున్సిపాలిటీలలో కౌంటింగ్ కు ఏర్పాట్లు చేసిన అధికారులు.. ఉదయం 8 గంటల నుండి కౌంటింగ్ ప్రారంభం.. అభ్యర్థులతో పాటు ఏజెంట్లకు ఐడికార్డు ఉంటేనే అనుమతి.. మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణ, సీసీకెమెరాల నిఘాలో కౌంటింగ్.. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్టమైన భద్రత.. నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో కౌంటింగ్, 30 వార్డులకు 10 టేబుల్స్, 6 రౌండ్స్.. పరకాల గణపతి డిగ్రీ కాలేజీలో కౌంటింగ్, 22 వార్డులకు 7 టేబుల్స్, 4 రౌండ్స్..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో హీటెక్కిస్తున్న క్యాంపుల రాజకీయం.. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు శిబిరాలకు తరలింపు.. నిర్మల్, ఆదిలాబాద్, ఖానాపూర్, మంచిర్యాల బీజేపీ అభ్యర్థులు మహారాష్ట్రలోని క్యాంపులకు తరలింపు.. ఆసిఫాబాద్, ఖానాపూర్, బెల్లంపల్లి బీఆర్ఎస్ అభ్యర్థులను క్యాంపునకు తరలించిన ఆ పార్టీ నేతలు.. ఆదిలాబాద్, నిర్మల్, కాగజ్ నగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను హైదరాబాద్ శిబిరానికి తరలింపు.. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులను ఒక్క చోటకు చేర్చిన కాంగ్రెస్ నేతలు..
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం.. కౌంటింగ్ సెంటర్లోకి అభ్యర్థులతో పాటు ఒక ఏజెంట్కు అనుమతి.. మొదట పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు.. సెంటర్ల వద్ద పోలీసు ఆంక్షలు..144 సెక్షన్ అమలు.. ఉమ్మడి జిల్లాలో 1కార్పొరేషన్, 7 మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు.. నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు.. ఒక్కో డివిజన్ కు ఒక్కో టేబుల్ మొత్తం 60 డివిజన్ లకు 60 టేబుల్స్ ఏర్పాటు..
కరీంనగర్ జిల్లా: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు మున్సిపల్ కార్పొరేషన్స్, 13 మున్సిపాలిటీల్లో కౌంటిక్ కు సర్వం సిద్ధం.. ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న కౌంటింగ్.. కరీంనగర్ కార్పొరేషన్ కు సంబంధించిన కౌంటింగ్ సెంటర్ ఎస్సారార్ కళాశాలలో ఏర్పాటు.. కౌంటింగ్ సెంటర్ వద్ద భారీగా మూడంచెల భద్రత.. పాసులున్నవారికే లోనికి అనుమతి..
నేడు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్.. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం.. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ లలోని2981 వార్డులకు ఎన్నికలు.. మొదట పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపు.. తర్వాత 25 బ్యాలెట్లను కట్టలుగా కట్టి ఓ డ్రమ్ లో వేసి కలుపుతారు.. ఒక్కో రౌండ్లో వెయ్యి ఓట్ల లెక్కింపు.. కౌంటింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు నిషేధం.. కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, అభ్యర్థులు, వారి ఎన్నికల ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లకు మాత్రమే కౌంటింగ్ హాల్ లోపలికి అనుమతి..