INF VS PAK Final: ఎమర్జింగ్ ఆసియా కప్ ఫైనల్లో భారత్ ఓటమి.. సీనియర్లను దాటలే కదా..!
సీనియర్స్ కానీ, జూనియర్స్ కానీ ఒక్కటే ఫార్ములాను వాడుతున్నట్లుంది. మొన్నటికి మొన్న ప్రపంచ ఛాంపియన్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో సీనియర్స్ ఓడితే.. ఇప్పుడు ఎమర్జింగ్ ఆసియా కప్ ఫైనల్ జూనియర్లు అదే సీన్ రిపీట్ చేశారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న భారత క్రికెట్ అభిమానులు నిరాశలయ్యాయి. ఎమర్జింగ్ ఆసియా కప్ ఫైనల్లో భారత A జట్టు, పాకిస్తాన్ A జట్టు చేతిలో 128 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. మొదట టాస్ గెలిచిన భారత్.. పాకిస్తాన్కి బ్యాటింగ్ అప్పగించింది. దీంతో పాక్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 352 పరుగుల భారీ స్కోరు చేసింది.
Kannada Actresses: మొన్న సౌందర్య.. నేడు జగతి.. భర్తలను వదిలి.. వారితో ఎఫైర్.. ?
Also Read
- Peddi: చరణ్ ‘పెద్ది’ పంజా.. మహేష్ బాబు నిర్మిస్తున్న ‘రావు బహదూర్’కు థియేటర్ల సెగ!
- Devara 2: దేవర 2 నుండి.. నందమూరి ఫ్యాన్స్కు కొరటాల అదిరిపోయే ప్రామిస్!
- Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
- MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
పాకిస్తాన్ బ్యాటింగ్ లో ఓపెనర్లు సయిం ఆయుబ్ 51 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 59 పరుగులు చేయగా.. సహీబ్జాదా ఫర్హాన్ 62 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 65 పరుగులు చేశాడు. 29 ఏళ్ల తయ్యాబ్ తాహీర్ 71 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో విధ్వంసం సృష్టించడంతో 108 పరుగులు చేసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ బ్యాట్స్ మెన్ సెంచరీ చేయడంతోనే పాక్ స్కోరు భారీ దిశగా వెళ్లింది. ఇక భారత బౌలర్లలో రాజవర్థన్ హంగర్గేకర్, రియాన్ పరాగ్ రెండేసి వికెట్లు తీయగా.. హర్షిత్ రాణా, మనవ్ సుథార్, నిశాంత్ సింధులకు తలా వికెట్ పడగొట్టారు.
Health Tips : రోజూ రాత్రి ఒక లవంగాన్ని తింటే ఏం జరుగుతుందో తెలుసా?
353 పరుగుల భారీ లక్ష్యఛేదనలో రంగంలోకి దిగిన టీమిండియాకి శుభారంభం దక్కింది. 28 బంతుల్లో 4 ఫోర్లతో 29 పరుగులు చేసిన సాయి సుదర్శన్, అభిషేక్ శర్మతో కలిసి తొలి వికెట్కి 64 పరుగుల భాగస్వామ్యం జోడించాడు. అయితే అర్షద్ ఇక్బాల్ బౌలింగ్లో సాయి సుదర్శన్ అవుట్ అయ్యాడు. అయితే ఈ బంతి నో బాల్గా టీవీ రిప్లైలో ఇచ్చినప్పటికీ.. థర్డ్ అంపైర్ మాత్రం ఔట్ అనే ఇచ్చాడు. మరో బ్యాటర్ నికిన్ జోష్ కూడా బ్యాట్ కు తగలనప్పటికీ.. అంపైర్ అవుట్ ఇచ్చాడు. కేవలం ఓపెనర్ అభిషేక్ శర్మ మాత్రమే ఒంటరి పోరాటం చేశాడు. 51 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్తో 61 పరుగులు చేసాడు. మరోవైపు కెప్టెన్ యష్ ధుల్ 41 బంతుల్లో 4 ఫోర్లతో 39 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతోనే టీమిండియా ఓటమి ఖరారైపోయింది. నిశాంత్ సింధు 10, ధృవ్ జురెల్ 9, రియాన్ పరాగ్ 14, హర్షిత్ రాణా 13, రాజవర్థన్ హంగర్గేకర్ 11 పరుగులు చేసి వెంటవెంటనే ఔటయ్యారు. చివరలో యువరాజ్సిన్హా దోహియా 5 పరుగులు చేసి అవుట్ కావడంతో టీమిండియా ఇన్నింగ్స్ 224 పరుగుల వద్ద ముగిసింది.
తాజావార్తలు
-
Peddi: చరణ్ ‘పెద్ది’ పంజా.. మహేష్ బాబు నిర్మిస్తున్న ‘రావు బహదూర్’కు థియేటర్ల సెగ!
-
B.Tech Student: పాపం ఏం కష్టమొచ్చిందో.. డీజిల్ పోసుకొని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య..
-
PEDDI : పాన్ ఇండియా స్థాయిలో పెద్ది ‘పెయిడ్ ప్రీమియర్స్’ ప్లానింగ్
-
Vishwambhara : ‘పెద్ది’ అడ్డంకి తొలగింది.. విశ్వంభర రిలీజ్ కు లైన్ క్లియర్ అయింది
-
Devara 2: దేవర 2 నుండి.. నందమూరి ఫ్యాన్స్కు కొరటాల అదిరిపోయే ప్రామిస్!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!