INF VS PAK Final: ఎమర్జింగ్ ఆసియా కప్ ఫైనల్లో భారత్ ఓటమి.. సీనియర్లను దాటలే కదా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీనియర్స్ కానీ, జూనియర్స్ కానీ ఒక్కటే ఫార్ములాను వాడుతున్నట్లుంది. మొన్నటికి మొన్న ప్రపంచ ఛాంపియన్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో సీనియర్స్ ఓడితే.. ఇప్పుడు ఎమర్జింగ్ ఆసియా కప్ ఫైనల్ జూనియర్లు అదే సీన్ రిపీట్ చేశారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న భారత క్రికెట్ అభిమానులు నిరాశలయ్యాయి. ఎమర్జింగ్ ఆసియా కప్ ఫైనల్లో భారత A జట్టు, పాకిస్తాన్ A జట్టు చేతిలో 128 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. మొదట టాస్ గెలిచిన భారత్.. పాకిస్తాన్కి బ్యాటింగ్ అప్పగించింది. దీంతో పాక్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 352 పరుగుల భారీ స్కోరు చేసింది.
Kannada Actresses: మొన్న సౌందర్య.. నేడు జగతి.. భర్తలను వదిలి.. వారితో ఎఫైర్.. ?
Also Read
- Novak Djokovic: రోజర్ ఫెడరర్ రికార్డుకు చెక్ మెట్.. వింబుల్డన్లో చరిత్ర సృష్టించిన జొకోవిచ్.!
- AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. జిల్లా కలెక్టరేట్లలో భారీ మార్పులు..!
- 185Hz డిస్ప్లే, 9,000mAh బ్యాటరీతో రానున్న OnePlus Ace 7 Series స్మార్ట్ ఫోన్స్.!
- Ayodhya Ram Mandir Trust: నేటి అయోధ్య ట్రస్ట్ భేటీపై ఉత్కంఠ.. ఐదు ప్రధాన అజెండాలు
పాకిస్తాన్ బ్యాటింగ్ లో ఓపెనర్లు సయిం ఆయుబ్ 51 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 59 పరుగులు చేయగా.. సహీబ్జాదా ఫర్హాన్ 62 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 65 పరుగులు చేశాడు. 29 ఏళ్ల తయ్యాబ్ తాహీర్ 71 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో విధ్వంసం సృష్టించడంతో 108 పరుగులు చేసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ బ్యాట్స్ మెన్ సెంచరీ చేయడంతోనే పాక్ స్కోరు భారీ దిశగా వెళ్లింది. ఇక భారత బౌలర్లలో రాజవర్థన్ హంగర్గేకర్, రియాన్ పరాగ్ రెండేసి వికెట్లు తీయగా.. హర్షిత్ రాణా, మనవ్ సుథార్, నిశాంత్ సింధులకు తలా వికెట్ పడగొట్టారు.
Health Tips : రోజూ రాత్రి ఒక లవంగాన్ని తింటే ఏం జరుగుతుందో తెలుసా?
353 పరుగుల భారీ లక్ష్యఛేదనలో రంగంలోకి దిగిన టీమిండియాకి శుభారంభం దక్కింది. 28 బంతుల్లో 4 ఫోర్లతో 29 పరుగులు చేసిన సాయి సుదర్శన్, అభిషేక్ శర్మతో కలిసి తొలి వికెట్కి 64 పరుగుల భాగస్వామ్యం జోడించాడు. అయితే అర్షద్ ఇక్బాల్ బౌలింగ్లో సాయి సుదర్శన్ అవుట్ అయ్యాడు. అయితే ఈ బంతి నో బాల్గా టీవీ రిప్లైలో ఇచ్చినప్పటికీ.. థర్డ్ అంపైర్ మాత్రం ఔట్ అనే ఇచ్చాడు. మరో బ్యాటర్ నికిన్ జోష్ కూడా బ్యాట్ కు తగలనప్పటికీ.. అంపైర్ అవుట్ ఇచ్చాడు. కేవలం ఓపెనర్ అభిషేక్ శర్మ మాత్రమే ఒంటరి పోరాటం చేశాడు. 51 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్తో 61 పరుగులు చేసాడు. మరోవైపు కెప్టెన్ యష్ ధుల్ 41 బంతుల్లో 4 ఫోర్లతో 39 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతోనే టీమిండియా ఓటమి ఖరారైపోయింది. నిశాంత్ సింధు 10, ధృవ్ జురెల్ 9, రియాన్ పరాగ్ 14, హర్షిత్ రాణా 13, రాజవర్థన్ హంగర్గేకర్ 11 పరుగులు చేసి వెంటవెంటనే ఔటయ్యారు. చివరలో యువరాజ్సిన్హా దోహియా 5 పరుగులు చేసి అవుట్ కావడంతో టీమిండియా ఇన్నింగ్స్ 224 పరుగుల వద్ద ముగిసింది.
తాజావార్తలు
-
Novak Djokovic: రోజర్ ఫెడరర్ రికార్డుకు చెక్ మెట్.. వింబుల్డన్లో చరిత్ర సృష్టించిన జొకోవిచ్.!
-
Fertilizers: రైతులకు ఊరట! యూరియా, డీఏపీతో నిండిన 15 నౌకలు వచ్చేస్తున్నయ్.. ఎరువుల సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన
-
Nat Sciver-Brunt: ప్రపంచకప్ మాదే అనుకున్నాం.. చాలా బాధగా ఉంది.. బోరున ఏడ్చిన ఇంగ్లండ్ కెప్టెన్!
-
God of War: ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై రాజకీయ దుమారం.. తమిళనాడులో విడుదల అడ్డుకుంటామంటూ హెచ్చరిక
-
AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. జిల్లా కలెక్టరేట్లలో భారీ మార్పులు..!
ట్రెండింగ్
-
185Hz డిస్ప్లే, 9,000mAh బ్యాటరీతో రానున్న OnePlus Ace 7 Series స్మార్ట్ ఫోన్స్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!