Viral Video: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా భారత్-నమీబియా మధ్య మ్యాచ్ ఈరోజు సాయంత్రం 7 గంటలకు ఢిల్లీ లోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. అయితే ఈ మ్యాచ్కు ముందు స్టేడియం లో ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
7.78mm స్లిమ్ డిజైన్, Dimensity 7100 ప్రాసెసర్తో ఫిబ్రవరి 18న రానున్న Infinix Note Edge 5G!
ఈ వైరల్ వీడియోలో ఏముందన్న విషయానికి వస్తే.. స్టేడియంలోకి వచ్చిన అభిమానులు తాగి మిగిల్చిన కూల్ డ్రింక్ ను మళ్లీ బాటిల్లో పోస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ ఘటన అక్కడిఫుడ్ అండ్ సేఫ్టీ విషయాలపై, అలాగే భద్రతపై సందేహాలు కలిగిస్తోంది. ఈ వీడియోను చూసిన చాలామంది.. ప్రేక్షకుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం జరుగుతోందనే విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ వీడియో తాజాగా అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన నెదర్లాండ్స్ – నమీబియా మ్యాచ్ తర్వాత తీసినదిగా సమాచారం.
SL vs OMAN: పసికూనను గడగడలాడించిన శ్రీలంక.. ఓమాన్పై 105 పరుగుల ఘన విజయం!
ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తోంది. ఇక నేడు రాత్రి 7:00 లకు నమీబియాతో మ్యాచ్ ఆడనుంది. మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా కొలంబోకు వెళ్లి అక్కడ పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడనుంది. ఐసీసీ టోర్నమెంట్లలో భారత్, నమీబియా నేడు మూడోసారి తలపడుతున్నాయి. ఇది వరకు 2003 వన్డే వరల్డ్ కప్, 2021 టీ20 వరల్డ్ కప్ రెండు సందర్భాల్లోనూ పాల్గొనగా భారత్ విజయం సాధించింది.
अरुण जेटली स्टेडियम मे बचे हुए कोल्ड ड्रिंक को बोतल मे वापस भरा जा रहा है।
अगले दिन यही दर्शको को वापस पीला दिया जाएगा।#HugDay #INDvsNAM pic.twitter.com/ykKBNdCwZQ
— Silent Hill (@SilentHill50) February 12, 2026