RBI: నిబంధనలను పాటించనుందకు ఎస్బీఐ, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ సింద్ బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఫెనాల్టీని విధించినట్లు సోమవారం తెలిపింది. ‘లోన్స్ అండ్ అడ్వాన్సెస్-చట్టబద్దమైన ఇతర పరిమితులను ఉల్లంఘించినందుకు, ఇంట్రా- గ్రూప్ లావాదేవీలకు సంబంధించిన గైడ్ లైన్స్ ని పాటించనందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై రూ. 1.3 కోట్ల జరిమానా విధించింది.
చెలామణిలో ఉన్న రూ.2000 నోట్లను మార్చుకునే సమయం త్వరలో ముగియనుంది. సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఈ పెద్దనోట్లను మార్చుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డెడ్ లైన్ విధించింది. అయితే ఇంకెంతో సమయం లేదు.. కేవలం 5 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇంకా 2000 రూపాయల నోట్లను మార్చుకోకపోతే.. వెంటనే మీ దగ్గరలోని బ్యాంకుకు వెళ్లి నోట్లను మార్చుకోండి.
RBI: ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు సంబంధించిన నిబంధనలలో మార్పులు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ సిద్ధమవుతోంది. రిజర్వ్ బ్యాంక్ కొత్త డ్రాఫ్ట్ రుణ వాయిదాలను చెల్లించని ఖాతాదారులను ఉద్దేశపూర్వక ఎగవేతదారుల జాబితాలో చేర్చడాన్ని బ్యాంకులకు సులభతరం, వేగవంతం చేస్తోంది.
Indian Economy By 2027: ఐదు ట్రిలియన్ డాలర్లు... ఆర్థిక వ్యవస్థ పరంగా ఇది ఒక మైలురాయి. దీనిని ఇప్పటివరకు కొన్ని దేశాలు మాత్రమే సాధించాయి. భారతదేశం ఈ మైలురాయిని సాధించడానికి చాలా దగ్గరగా ఉంది.
ICICI MD - CEO: దేశంలోని రెండో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో, ఎండీగా సందీప్ బక్షి నియామకానికి బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది.
RBI Data: విదేశీ మారకద్రవ్య నిల్వల్లో నిరంతర క్షీణతకు ప్రస్తుతం బ్రేక్ పడింది. ఈ ఏడాది సెప్టెంబరు 1తో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వలు 4 బిలియన్ డాలర్లు పెరిగాయి. దీంతో ఫారెక్స్ నిల్వలు 598.897 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఆగస్టు 25 నాటికి విదేశీ మారక నిల్వలు 594.85 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
UPI ATM: భారతదేశపు మొట్టమొదటి UPI ATM ప్రారంభించబడింది. హిటాచీ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన హిటాచీ పేమెంట్ సర్వీసెస్ UPI ATMను ప్రారంభించింది. ఈ సదుపాయంతో ప్రస్తుతం ఏటీఎం కార్డు లేకుండా డైరెక్టుగా UPI ద్వారా ATM నుండి డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చు.
93 percent 2000 Rupee Notes returned: రూ. 2 వేల నోట్లను తాత్కాలికంగా చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్టు ఈ ఏడాది మే 19వ తేదీన ఆర్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక రూ. 2000 నోట్లను మార్చుకోవడానికి సెప్టెంబర్ 30వ తేదీ వరకు గడువునిచ్చింది భారతీయ రిజర్వ్ బ్యాంక్. ఇక దీనికి సంబంధించే ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే 93 శాతం 2 వేల రూపాయల నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చేశాయని స్పష్టంచేసింది. ఆగస్టు…
జులై నెలలో ద్రవ్యోల్బణం తీవ్ర రూపం దాల్చినట్టు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ద్రవ్యోల్బణం తీవ్ర రూపం దాల్చడానికి ఆహార ధరల పెరుగుదలే ప్రధాన కారణంగా ఆర్బీఐ భావించింది.
RBI: ప్రస్తుతం నిత్యవసరాల ధరలు నింగిని తాకుతున్నాయి. మొన్నటి వరకు టమాటా ధరలు చుక్కలు చూపించాయి. పప్పుధాన్యాల ధరలు కూడా రాకెట్ లా దూసుకుపోతున్నాయి. దీంతో సామాన్యులపై భారం పడుతోంది. కూరగాయల ధరలు కూడా విపరీతంగా పెరగడంతో ఏమి కొనలేని పరిస్థితి నెలకొంది. దీంతొ దేశంలో ద్రవోల్బణం కూడా విపరీతంగా పెరుగుతోంది. ఇది ఆర్థికాభివృద్దికి అంతమంచిది కాదు. ఈ నేపథ్యంలో సామాన్యులకు ఊరట కలిగే ఒక విషయాన్ని వెల్లడించారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్. సెప్టెంబర్ నుంచి…