Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Inflation Is An Extreme Form The Reason Is The Rise In Food Prices

RBI: ద్రవ్యోల్బణం తీవ్ర రూపం.. ఆహార ధరల పెరుగుదలే కారణం

Published Date :August 25, 2023 , 9:27 am
By Naga Maneendra
RBI:   ద్రవ్యోల్బణం తీవ్ర రూపం.. ఆహార ధరల పెరుగుదలే కారణం
  • Follow Us :
  • google news
  • dailyhunt

RBI: జులై నెలలో ద్రవ్యోల్బణం తీవ్ర రూపం దాల్చినట్టు రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది. ద్రవ్యోల్బణం తీవ్ర రూపం దాల్చడానికి ఆహార ధరల పెరుగుదలే ప్రధాన కారణంగా ఆర్‌బీఐ భావించింది. సూచీలో కీలక విభాగాలైన కూరగాయలు, ఇతర ఆహార పదార్థాల ధరలు తీవ్రంగా పెరగడం దీనికి కారణంగా భావించింది. ఆహార ధరల పెరుగుదలే వ్యవస్థలో ప్రధాన ఆందోళనకర అంశమని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంతదాస్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన (ఎంపీసీ) కమిటీ అభిప్రాయపడింది. ఈ పరిస్థితిలో కఠిన ద్రవ్య విధానవైపే మొగ్గుచూపాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. ప్రస్తుతానికి బ్యాంకులకు ఇచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు… రెపో (6.5 శాతం) దానినే యధావిధిగా కొనసాగించాలని కమిటీలోని ఆరుగురు సభ్యులైన ఎండీ పాత్ర, శశాంక భిడే, అషిమా గోయల్, జయంత్‌ ఆర్‌ వర్మ, రాజీవ్‌ రంజన్‌లు ఓటు వేశారు. ఆగస్టు 8 నుంచి 10వ తేదీ వరకూ జరిగిన ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష మినిట్స్‌ గురువారం విడుదలయ్యాయి. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే తమ పని ఇంకా ముగియలేదని, కూరగాయలు తదితర ఆహార పదార్థాల ధరల ప్రాతిపదికన మొదటి రౌండ్‌ ద్రవ్య విధాన నిర్ణయాలు ఉంటాయని శక్తికాంత్‌ దాస్‌ తెలిపారు. విస్తృత ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, అంచనాలు, ఆందోళనల ప్రాతిపదికన రెండవ..రౌండ్‌ ప్రభావాన్ని ముందస్తుగా తొలగించడానికి తాము సిద్ధంగా ఉండాలని.. దానికి తక్షణం కఠిన విధానమే సరైందని కమిటీ భావిస్తోందని దాస్‌ సమావేశంలో చెప్పారు.

Read Also: Telangana: తెలంగాణలో మరో రెండు రెవెన్యూ డివిజన్లు.. ప్రాథమిక నోటిఫికేషన్ జారీ

ఆర్‌బీఐ పాలసీ తదనంతరం వెలువడిన జూలై నెల ద్రవ్యోల్బణం తీవ్ర రూపం దాల్చడం ఆర్‌బీఐ గమనించింది. కీలక ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం జూలైలో ఏకంగా 7.44 శాతంగా (2022 ఇదే నెల ధరలతో పోల్చి ధరల పెరుగుదల) నమోదయ్యింది. గడచిన 15 నెలల్లో ఈ స్థాయి రిటైల్‌ ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి. సూచీలో కీలక విభాగాలైన కూరగాయలు, ఇతర ఆహార పదార్థాల ధరలు తీవ్రంగా పెరగడం దీనికి కారణం. ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశాల ప్రకారం, రిటైల్‌ ద్రవ్యోల్బణం ప్లస్‌ లేదా మైనస్‌తో 4 శాతం వద్ద ఉండాలి. అంటే అప్పర్‌ బ్యాండ్లో 6 శాతం అధిగమిస్తే… దానిని ఎకానమీలో డేంజర్‌ బెల్స్ గా పరిగణించాల్సి ఉంటుంది. జూలైలో అంకెలు ఈ స్థాయిని అధిగమించాయి. 2022 జూలైలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.71 శాతం ఉంటే, ఈ ఏడాది జూన్‌లో 4.87గా నమోదయ్యింది. జులైలో మళ్లీ తీవ్ర రూపం దాల్చింది. వినియోగ ధరల సూచీలో కీలక విభాగాలు చూస్తే.. ఒక్క ఫుడ్‌ బాస్కెట్‌ ద్రవ్యోల్బణం జూలైలో 11.51 శాతంగా నమోదయ్యింది. జూన్‌ నెలలో ఇది కాస్త 4.55 శాతం.. జులై 2022లో ఈ రేటు 6.69 శాతంగా ఉంది. ఒక్క కూరగాయల ధరలే జులై లో ఏకంగా 37.43 శాతం పెరిగాయి.

Read Also: Varalakshmi Vratham 2023: వరాలనొసగే ‘వరలక్ష్మీ వ్రతం’ పూజా విధానం.. మీ భక్తి టీవీలో లైవ్‌‌లో చూడండి!

ఉక్రేయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా క్రూడ్‌ ధరల తీవ్రత పెరిగింది. దీంతో అంతర్జాతీయంగా క్రూడ్‌ ధరలు పెరిగాయి. ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో ఈ సవాలును అధిగమించడానికి ఆర్‌బీఐ 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి నాటికి రెపో రేటును 250 బేసిస్‌ పాయింట్లు పెంచింది. దీనితో రెపో రేటు 6.5 శాతానికి చేరింది. ద్రవ్యోల్బణం కొద్దిగ అదుపులోనికి వస్తుందన్న సంకేతాల నేపథ్యంలో ఈ నెల సమీక్షసహా గడచిన మూడు సమావేశాల్లో యథాతథ రేటు కొనసాగింపునకే ఆర్‌బీఐ పెద్దపీట వేసింది. కానీ ద్రవ్యోల్బణం భయాలు తొలగిపోలేదని, అవసరమైతే కఠిన ద్రవ్య విధానానికే మొగ్గుచూపుతామని కూడా ఆర్‌బీఐ ప్రకటించింది. ఇదే విషయాన్ని ఈ నెల సమీక్షా సమావేశం అనంతరం ఆర్‌బీఐ గవర్నర్‌ పునరుద్ఘాటించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • food prices
  • inflation
  • RBI
  • reason
  • rise

తాజావార్తలు

  • CSK IPL 2026: ఐపీఎల్ 2026కు ముందు సీఎస్‌కేకు భారీ ఎదురుదెబ్బ.. స్టార్ ప్లేయర్ ఈ సీజన్ మొత్తానికి దూరం

  • Massive Water Cloud Discovered in Space: అంతరిక్షంలో భారీ మేఘం.. సముద్రాలన్నింటి కంటే 140 ట్రిలియన్ల రెట్ల ఎక్కువ నీరు..!

  • USA Crime : అమెరికాలో తెలుగు యువకుడు అరెస్ట్.. ఒక్క తప్పు జీవితం తలకిందులు..!

  • Telangana: ఐదుగురిని ప్రభుత్వ విప్‌లుగా నియమించిన తెలంగాణ ప్రభుత్వం..

  • Balineni Srinivasa Reddy Tweet Delete: మాజీ మంత్రి బాలినేని ట్వీట్ ఎపిసోడ్‌లో ట్విస్ట్..

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions