రాజస్థాన్లో కాంగ్రెస్ నుంచి అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన 15 రోజుల తర్వాత ఈ మధ్యాహ్నం మంత్రులకు శాఖలను అప్పగించారు. అత్యధికులు తొలిసారిగా మంత్రులుగా పనిచేసినవారే. మంత్రులకు బాధ్యతలు అప్పగించే ముందు బీజేపీ అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించడంతో పోర్ట్ఫోలియో ప్రకటనకు కొంత సమయం పట్టింది.
రాజస్థాన్లో నకిలీ పెన్షనర్లపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీంతో 4 లక్షల మంది పెన్షన్లు నిలిపివేసింది. సామాజిక న్యాయం, సాధికారత శాఖ అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు.
రాజస్థాన్ లోని కోటాలో విద్యార్థులు ఈసారి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోలేరు. నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి కోచింగ్ సెంటర్లు, విద్యార్థులకు కోటా పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా కోచింగ్ ఏరియాలో లౌడ్ మ్యూజిక్ సిస్టమ్పై నిషేధం ఉంటుందని పోలీసులు తెలిపారు. హాస్టళ్లు, పేయింగ్ గెస్ట్లు, మెస్ల దగ్గర మద్యం, మత్తు పదార్థాలు సేవించరాదని చెప్పారు. కోటా సిటీ ఎస్పీ శరద్ చౌదరి కూడా ఈ ఉత్తర్వును కచ్చితంగా అమలు చేయాలని కోచింగ్…
Rajastan : సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రాజస్థాన్ మంత్రివర్గ విస్తరణ తేదీ ఖరారైంది. నేటి మధ్యాహ్నం 3:15 గంటలకు భజన్ లాల్ ప్రభుత్వం మంత్రివర్గం ఏర్పాటు చేయబడుతుంది. దాదాపు 18 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు చర్చ జరుగుతోంది.
రాజస్థాన్ ప్రభుత్వం నూతన సంవత్సర కానుక ఇచ్చింది. జనవరి 1 నుండి ఉజ్వల గ్యాస్ సిలిండర్ రూ.450కు అందించనుంది. రాజస్థాన్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా.. బిజెపి మేనిఫెస్టోలోని అన్ని హామీలలో ఉజ్వల పథకం లబ్ధిదారులకు 450 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు. పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన వాగ్దానాలన్నింటినీ మోడీ హామీలుగా ప్రచారం చేసింది. ఇప్పుడు దీనిని నెరవేరుస్తూ ఉజ్వల పథకం లబ్ధిదారుల కోసం బీజేపీ ఈ ప్రకటన చేసింది.
Heater Incident: రాజస్థాన్ రాష్ట్రంలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. గదిలోని హీటర్కి మంటలు అంటుకోవడంతో తండ్రి, మూడు నెలల కూతురు సజీవదహనమయ్యారు. ఖైర్తాల్-తిజారా జిల్లాలో శనివారం ఈ ఘటన జరిగింది. గదిలోని హీటర్తో మంటలు చెలరేగడంతో తండ్రీ, కూతురు మరణించారు. ఈ ఘటనలో అతని భార్యకు గాయాలయ్యాయి.
భారత్ లో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో నెల రోజుల్లో 52 శాతం పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అలర్ట్ చేసింది. భారత్ లోనూ కరోనా కేసుల పెరుగుదల కలవర పెడుతుంది.
భారతదేశం అంతటా హైవేల వెంట అనేక దేవాలయాలు మరియు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. మీరు జోధ్పూర్ మరియు అహ్మదాబాద్లను కలుపుతూ జాతీయ రహదారి 62లో ప్రయాణిస్తే, మీకు అలాంటి పుణ్యక్షేత్రం ఒకటి కనిపిస్తుంది కానీ దేవుడు లేకుండా బుల్లెట్ బైక్ ఉంటుంది.. అలా ఉండటానికి పెద్ద కథే ఉందట.. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఆ ఆలయంలోని ‘దేవత’ RNJ 7773 రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన 350 cc రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ మోటార్సైకిల్. ఓం బన్నా మందిరం లేదా…
రాజస్తాన్లో దారుణం చోటుచేసుకుంది. 13 ఏళ్ల మైనర్ బాలికను బలవంతంగా పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి పది రోజులుగా ఆమె అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన రాజస్తాన్లోని అజ్మీర్లో జరిగింది. ఈ ఘటనపై బాధితురాలు, ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. రాజస్తాన్కు చెందిన 13 ఏళ్ల బాలికను ఓ వ్యక్తి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు.…