India-Saudi Arabia: భారత్, సౌదీ అరేబియాల సంయుక్త సైనిక విన్యాసాలు రాజస్థాన్లో సోమవారం ప్రారంభమయ్యాయి. ఇరు దేశాల మధ్య సైనిక సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి తమ తొలి సంయుక్త విన్యాసాలను ప్రారంభించినట్టు ఇండియన్ ఆర్మీ తెలిపింది. ‘సదా తన్సీక్’ పేరుతో చేపట్టే ఈ విన్యాసాలు ఫిబ్రవరి 10వరకు కొనసాగనున్నాయి. ఇందులో సౌదీ అరేబియా నుంచి 45 మంది, భారత ఆర్మీకి చెందిన 45 మంది సైనికులతో కూడిన బ్రిగేడ్ ఆఫ్ ది గార్డ్స్ పాల్గొననున్నారు. ఈ డ్రిల్స్లో మొబైల్ వెహికల్ చెక్ పోస్ట్లు, కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు, హౌస్ ఇంటర్వెన్షన్ డ్రిల్స్, రిఫ్లెక్స్ షూటింగ్, స్లిథరింగ్, స్నిపర్ ఫైరింగ్ల ఏర్పాటు ఉంటుంది. ‘యునైటెడ్ నేషన్స్ చార్టర్ VII అధ్యాయం ప్రకారం సెమీ-ఎడారి భూభాగంలో ఉమ్మడి కార్యకలాపాల కోసం దళాలకు శిక్షణ ఇవ్వడం ఈ వ్యాయామం లక్ష్యం. ఇది ఇరు దేశాల సైనికుల మధ్య పరస్పర చర్య, బంధుత్వం, స్నేహాన్ని పెంపొందించడానికి దోహదపడుతుంది’ అని ఆర్మీ పేర్కొంది.
Read Also: US Visa: భారతీయులకు వీసాల జారీలో అమెరికా రికార్డ్..