Suicide: తండ్రి ఫోన్ వాడొద్దన్నందుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న కూతురు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్ లో దారుణం చోటు చేసుకుంది. తండ్రి ఫోన్ వాడొద్దని చెప్పినందుకు.. 10వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన భజరంగనగర్లో చోటుచేసుకుంది. అంతకుముందు కూతురుపై కోపోద్రిక్తుడైన తండ్రి.. శాంతింపజేసేందుకు తాను వెళ్లిన గదికి వెళ్లి చూడగా.. అమ్మాయి ఉరివేసుకుని ఉండటం చూసి చలించిపోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కోట పోలీసులు.. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించి కేసు దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకోలేదు.
Mahadev Betting App Scam: వైజాగ్లో మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కాం కలకలం.. ఇద్దరు అరెస్ట్
Also Read
- Anantha Babu Case: జైల్లో ఇంటి భోజనం కోరిన అనంతబాబు.. కోర్టు కీలక ఆదేశాలు
- Mahua Moitra: ఆ రాత్రంతా ఏడ్చాను.. సువేందు అండగా ఉన్నారు.. మహువా మొయిత్రా సంచలన వ్యాఖ్యలు
- Perni Nani: సిట్ విచారణపై వైసీపీ తీవ్ర అభ్యంతరం.. సాయికృష్ణ కేసులో విచారణ డొల్ల..!
- Virat Kohli One8 Shoes: కోహ్లీ కొత్త బ్రాండ్ సంచలనం.. ఒక్క రోజులోనే కోట్ల రూపాయల బిజినెస్..
బోర్ఖెడా పోలీస్ స్టేషన్కు చెందిన ఏఎస్ఐ ద్వారకా లాల్ మాట్లాడుతూ.. మృతురాలు నగరంలోని బోర్ఖెడ పోలీస్ స్టేషన్ పరిధిలోని తన అమ్మమ్మ ఇంట్లో నివసిస్తుంది. తండ్రి కూడా ఆ బాలికతోనే ఉంటున్నాడు. అయితే.. మొబైల్ వాడొద్దని తండ్రి కోపంతో బాలిక కృపాంగిని తిట్టడంతో తన గదిలోకి వెళ్లింది. ఆ తర్వాత తండ్రి తన పని మీద బయటకు వెళ్లాడు. అయితే చాలా సేపటి వరకు ఆ గదిలో నుంచి ఎలాంటి మాటలు వినకపోవడంతో అమ్మమ్మ తలుపు తట్టింది. అయినప్పటికీ గట్టిగా తలుపులు కొట్టినా.. ఎలాంటి చలనం లేకపోవడంతో ప్రక్కన ఉన్నవారికి పిలిచి.. ఆ తర్వాత వారితో పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తలుపులు తెరిచి చూడగా విద్యార్థి ఉరి వేసుకుని కనిపించింది.
Mallanna Jatara: ఐనవోలు జాతరకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 4 గంటలు..
కాగా.. పరీక్షలు దగ్గరపడుతుండటంతో మొబైల్ను ఉపయోగించవద్దని చెప్పినట్లు తండ్రి తన ప్రాథమిక వాంగ్మూలంలో పోలీసులకు తెలిపాడు. ఇంతకు ముందు కూడా బాలిక మొబైల్ ఎక్కువగా ఉపయోగించేది.. చాలా సార్లు తిట్టేవాళ్ళం. కానీ ఆమె ఇలా చేస్తుందని తమకు తెలియదని బాలిక తండ్రి వాపోతున్నాడు. ఇదిలా ఉంటే.. 2023లో కోటాలో అత్యధికంగా 26 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వాస్తవానికి.. ప్రతి సంవత్సరం సవాళ్ళతో కూడిన పరీక్షలు, తల్లిదండ్రుల అంచనాల భారం, ఇంటి నుండి దూరంగా ఒంటరితనం కారణంగా, స్వల్ప ఒత్తిడి కారణంగా ఆత్మహత్య సంఘటనలు ఉండేవి. అయితే 2023లో కోచింగ్ విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలు అందరినీ భయాందోళనకు గురిచేస్తున్నాయి.
తాజావార్తలు
-
Ginger Chutney: కొలతలతో నిల్వ ఉండే టిఫిన్ సెంటర్ అల్లం చట్నీ.. సింపుల్గా ఇలా చేసేయండి!
-
Anantha Babu Case: జైల్లో ఇంటి భోజనం కోరిన అనంతబాబు.. కోర్టు కీలక ఆదేశాలు
-
Mahua Moitra: ఆ రాత్రంతా ఏడ్చాను.. సువేందు అండగా ఉన్నారు.. మహువా మొయిత్రా సంచలన వ్యాఖ్యలు
-
Perni Nani: సిట్ విచారణపై వైసీపీ తీవ్ర అభ్యంతరం.. సాయికృష్ణ కేసులో విచారణ డొల్ల..!
-
Hangover Relief Tips: హ్యాంగోవర్తో ఇబ్బంది పడుతున్నారా.? అయితే ఈ టిప్స్ పాటించండి..
ట్రెండింగ్
-
Kitchen Tips : చెక్క, ప్లాస్టిక్, స్టీల్.. వంటగదికి ఏ చాపింగ్ బోర్డు ఆరోగ్యకరమో తెలుసా..?
-
సూపర్కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!
-
Water Bottle Cleaning: మీరు నీళ్లు తాగే బాటిల్ శుభ్రంగా ఉందా.? బ్యాక్టీరియా, దుర్వాసన రాకుండా ఇలా చేసేయండి.!