Suicide: తండ్రి ఫోన్ వాడొద్దన్నందుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న కూతురు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్ లో దారుణం చోటు చేసుకుంది. తండ్రి ఫోన్ వాడొద్దని చెప్పినందుకు.. 10వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన భజరంగనగర్లో చోటుచేసుకుంది. అంతకుముందు కూతురుపై కోపోద్రిక్తుడైన తండ్రి.. శాంతింపజేసేందుకు తాను వెళ్లిన గదికి వెళ్లి చూడగా.. అమ్మాయి ఉరివేసుకుని ఉండటం చూసి చలించిపోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కోట పోలీసులు.. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించి కేసు దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకోలేదు.
Mahadev Betting App Scam: వైజాగ్లో మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కాం కలకలం.. ఇద్దరు అరెస్ట్
Also Read
- Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
- 50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
- 144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
- Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
బోర్ఖెడా పోలీస్ స్టేషన్కు చెందిన ఏఎస్ఐ ద్వారకా లాల్ మాట్లాడుతూ.. మృతురాలు నగరంలోని బోర్ఖెడ పోలీస్ స్టేషన్ పరిధిలోని తన అమ్మమ్మ ఇంట్లో నివసిస్తుంది. తండ్రి కూడా ఆ బాలికతోనే ఉంటున్నాడు. అయితే.. మొబైల్ వాడొద్దని తండ్రి కోపంతో బాలిక కృపాంగిని తిట్టడంతో తన గదిలోకి వెళ్లింది. ఆ తర్వాత తండ్రి తన పని మీద బయటకు వెళ్లాడు. అయితే చాలా సేపటి వరకు ఆ గదిలో నుంచి ఎలాంటి మాటలు వినకపోవడంతో అమ్మమ్మ తలుపు తట్టింది. అయినప్పటికీ గట్టిగా తలుపులు కొట్టినా.. ఎలాంటి చలనం లేకపోవడంతో ప్రక్కన ఉన్నవారికి పిలిచి.. ఆ తర్వాత వారితో పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తలుపులు తెరిచి చూడగా విద్యార్థి ఉరి వేసుకుని కనిపించింది.
Mallanna Jatara: ఐనవోలు జాతరకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 4 గంటలు..
కాగా.. పరీక్షలు దగ్గరపడుతుండటంతో మొబైల్ను ఉపయోగించవద్దని చెప్పినట్లు తండ్రి తన ప్రాథమిక వాంగ్మూలంలో పోలీసులకు తెలిపాడు. ఇంతకు ముందు కూడా బాలిక మొబైల్ ఎక్కువగా ఉపయోగించేది.. చాలా సార్లు తిట్టేవాళ్ళం. కానీ ఆమె ఇలా చేస్తుందని తమకు తెలియదని బాలిక తండ్రి వాపోతున్నాడు. ఇదిలా ఉంటే.. 2023లో కోటాలో అత్యధికంగా 26 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వాస్తవానికి.. ప్రతి సంవత్సరం సవాళ్ళతో కూడిన పరీక్షలు, తల్లిదండ్రుల అంచనాల భారం, ఇంటి నుండి దూరంగా ఒంటరితనం కారణంగా, స్వల్ప ఒత్తిడి కారణంగా ఆత్మహత్య సంఘటనలు ఉండేవి. అయితే 2023లో కోచింగ్ విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలు అందరినీ భయాందోళనకు గురిచేస్తున్నాయి.
తాజావార్తలు
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
-
Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
-
PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
Allu Arjun : అల్లు అర్జున్ తెలుగు డైరెక్టర్స్ను పట్టించుకోడా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!