పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్తో అనంత్ అంబానీ నిశ్చితార్థం జరిగిన సందర్భంగా అంబానీ కుటుంబం గురువారం ఒక డ్యాన్స్ షోను ఏర్పాటు చేసింది.
Today (20-01-23) Business Headlines: మైక్రోసాఫ్ట్ @ తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో మరో 3 డేటా కేంద్రాలను ఏర్పాటుచేసేందుకు మైక్రోసాఫ్ట్ సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు 16 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ ఆసియా ప్రెసిడెంట్ అహ్మద్ మజహరి వెల్లడించారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు జరుగుతున్న సందర్భంగా ఆయన తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు మరియు ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ని కలిసి తమ నిర్ణయాన్ని తెలిపారు.
ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన చిన్నకొడుకు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ అధికారికంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ముంబైలో సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ జంట గురువారం అధికారికంగా నిశ్చితార్థం చేసుకున్నారు.
Radhika Merchant: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడి వివాహ కార్యక్రమాలు మొదలయ్యాయి. ముఖేష్ అంబానీ-నీతా అంబానీల చిన్న కొడుకు అనంత్ అంబానీతో రాధిక మర్చంట్ వివాహం జరగబోతోంది. మెహందీ వేడుకల్లో కాబోయే కోడలు రాధికా మర్చంట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
Exclusive Story on Ambani Companies: ఒక్కసారి ఊహించుకోండి. మనింట్లోని ప్రతి వస్తువూ ఒకే కంపెనీకి చెందినవైతే ఎలా ఉంటుందో?. ఒకే కంపెనీకి చెందినవి కాకపోయినా ఒకే వ్యక్తి నేతృత్వంలోని వివిధ సంస్థలకు చెందినవైనా అయితే ఎలా ఉంటుందో ఆలోచించండి. మనం తినే ఫుడ్డుతో మొదలుపెట్టి.. వేసుకునే బట్టలు.. ప్రయాణం చేసే కారులోని పెట్రోల్.. ఇంటర్నెట్.. గాడ్జెట్లు.. స్పోర్ట్స్ ఇలా ప్రతి ప్రొడక్టూ.. ప్రతి సర్వీసూ.. సింగిల్ పర్సన్ నడిపించే వ్యాపార సామ్రాజ్యం నుంచే వస్తున్నాయి.
India Can Be USD 40 Trillion Economy By 2047 Says Mukesh Ambani: రిలయన్స్ వ్యాపారం మర్రిచెట్టులా విస్తరిస్తోందని అన్నారు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ. రిలయన్స్ ఫ్యామిలీ డే ఫంక్షన్ లో ఆయన మాట్లాడారు. రానున్న రోజుల్లో భారత్ మరింతగా అభివృద్ధి చెందుతుందని..దాంట్లో రిలయన్స్ పాత్ర ఉంటుందని వెల్లడించారు. దశాబ్ధాలు గడిచిపోయాయి.. రిలయన్స్ మర్రిచెట్టులా దాని కొమ్మలు విశాలంగా విస్తరిస్తున్నాయని.. భారతీయుల జీవితాలను సుసంపన్నం చేస్తాయని ఆయన పేర్కొన్నారు.…
Today (29-12-22) Business Headlines: ఐఓసీ విస్తరణ ప్రణాళిక: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ 2 తెలుగు రాష్ట్రాల్లో అమలుచేస్తున్న మరియు అమలుచేయనున్న విస్తరణ ప్రణాళికలను వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరులో ఏర్పాటుచేస్తున్న ఎల్పీజీ బాట్లింగ్ యూనిట్ మరో 3 నెలల్లో అందుబాటులోకి రానుంది. తెలంగాణలోని హైదరాబాద్కు దగ్గరలో మల్కాపూర్ వద్ద టెర్మినల్ నిర్మాణం 87 శాతం పూర్తయింది.
Liverpool Football Club: ఇండియన్ బిజినెస్ మ్యాగ్నెట్లలో ఒకరైన రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధిపతి ముఖేష్ అంబానీ ఇప్పటికే మన దేశంలోని క్రీడా రంగంలోకి కూడా ప్రవేశించి తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. క్రికెట్లోని ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ముంబై ఇండియన్స్ జట్టును పదేళ్లకు పైగా విజయవంతంగా నడిపిస్తున్నారు. ఫుట్బాల్ టోర్నమెంట్ ‘ఇండియన్ సూపర్ లీగ్’కి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ఇప్పుడు విదేశాల్లోని క్రీడా రంగంలో సైతం పెట్టుబడులు పెట్టనున్నారా అనే వార్తలు వెలువడుతున్నాయి.
ప్రతి ఒక్కరి జీవితంలో తల్లిదండ్రులే అత్యంత ముఖ్యమని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ అన్నారు. గుజరాత్లోని పండిట్ దీనదయాళ్ ఎనర్జీ యూనివర్శిటీ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ.. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు విద్యార్థులకు ఇచ్చే మద్దతు గురించి తెలిపారు.
Mukesh Ambani’s Reliance Industries Tops India’s Most Valuable Firms List: భారతదేశంలో అత్యంత విలువైన సంస్థల జాబితాలో ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటిస్థానంలో నిలిచింది. భారతదేశంలోనే అత్యంత విలువైన సంస్థగా ఉంది. ‘2022 బుర్గుండి ప్రేవట్ హురున్ ఇండియా 500 టాప్ 10’ జాబితాలో తొలిస్థానంలో నిలిచింది. మొత్తం అన్ని కంపెనీల మొత్తం విలువ రూ. 226 లక్షల కోట్లు( 2.7 ట్రిలియన్ డాలర్లు)గా ఉంది. భారతదేశం నుంచి 500 అత్యుత్తమ…