Israel: పాలస్తీనా గాజా స్ట్రిప్ నుంచి హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ పై మెరుపుదాడి చేశారు. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే ఇజ్రాయిల్ భూభాగంపైకి 5000 రాకెట్ల్ ప్రయోగించారు. ఈ దాడుల్లో 50 మంది దాకా మరణించగా.. 30 మందిని ఉగ్రవాదులు బందీలుగా పట్టుకున్నారు. గాజా ప్రాంతంలో ఇజ్రాయిల్ పౌరులపై మిలిటెంట్లు తుపాకులతో కాల్పులు జరిపారు. ఇజ్రాయిల్ పట్టణాల్లో స్వైర విహారం చేస్తూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారు.
Israel-Gaza Conflict: గాజా స్ట్రిప్లోని హమాస్ ఉగ్రవాదులు శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ వైపు డజన్ల కొద్దీ రాకెట్లను ప్రయోగించారు. ఇది యుద్ధ పరిస్థితిని సృష్టించింది.
Israel: చైనా ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్’ ప్రత్యామ్నాయంగా భావిస్తున్న ‘ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ కారిడార్(IMEC)’పై ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ ప్రశంసలు కురిపించారు. ఈ ప్రాజెక్టు మన చరిత్రలోనే అతిపెద్ద సహకార ప్రాజెక్టుగా నిలుస్తుందని అన్నారు. దీని వల్ల తూర్పు దేశాలు, ఇజ్రాయిల్, మొత్తం ప్రపంచానికి ప్రయోజనం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. జీ20 సమావేశాల్లో శనివారం అమెరికా, భారతదేశం, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ దేశాధినేతలు సంయుక్తంగా ప్రకటించారు.
ఇజ్రాయెల్లో తవ్వకాల్లో ఓ పురావస్తు ఆవిష్కరణ బయటపడింది. ఇజ్రాయెల్లోని పురాతన నగరమైన టెల్ ఎరానీలో 5,500 ఏళ్ల కాలం నాంటి పురాతన రాయి, మట్టి ఇటుకతో నిర్మించిన గేటును పరిశోధకులు కనుగొన్నారని ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ మంగళవారం ప్రకటించింది.
తల్లిదండ్రులు జన్మనిస్తే.. వైద్యులు పునర్జన్మను ఇస్తారని అంటారు. అది ఇజ్రాయిల్లోని ఒక బాలుని విషయంలో నిజమైంది. కారు ప్రమాదంలో తెగిన తలను అతికించి.. బ్రతకడు అనుకున్న 12 ఏళ్ల బాలున్ని వైద్యులు అత్యంత కఠినతరమైన ఆపరేషన్ను చేసి.. బాలున్ని బ్రతికించారు.
న్యాయ సంస్కరణలకు ఇజ్రాయెల్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఇజ్రాయెల్లో ఎన్ని ఆందోళనలు ఎదురైనా నెతన్యాహు ప్రభుత్వం తెచ్చిన న్యాయ సంస్కరణలకు పార్లమెంట్ ప్రాథమికంగా ఆమోదముద్ర వేసింది.
Israel: ఇజ్రాయిల్ మరోసారి గాజాపై విరుచుకుపడింది. గాజాలోని హమాస్ లక్ష్యంగా వైమానికి దాడులు నిర్వహించింది. ఇజ్రాయిల్ భూభాగంపైకి గాజా నుంచి డజన్ల కొద్దీ రాకెట్లు ప్రయోగించబడ్డాయి. గాజా స్ట్రిప్ లోని అనేక భాగాలపై ఇజ్రాయిల్ వైమానిక దాడులు నిర్వహించింది. హమాస్ శిక్షణా కేంద్రాలు లక్ష్యంగా దాడులు జరిగినట్లు ఇజ్రాయిల్ ఆర్మీ వెల్లడించింది. దక్షిణ ఇజ్రాయెల్ పైకి 35 రాకెట్లను గాజా నుంచి ప్రయోగించారు.
ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పాలస్తీనియన్లకు మద్దతుగా ఐక్యమైన, స్థిరమైన ఫ్రంట్ను ఏర్పాటు చేయాలని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ముస్లిం దేశాలకు పిలుపునిచ్చారు. అల్జీరియా అధ్యక్షుడు అబ్దెల్మాడ్జిద్ టెబ్బౌన్తో ఫోన్ సంభాషణలో రైసీ ప్రాంతీయ, అంతర్జాతీయ వ్యవహారాలపై చర్చించారు.
Israel: ఇజ్రాయిల్ వరస దాడులతో అట్టుడుకుతోంది. సరిహద్దు దేశాల నుంచి వరసగా రాకెట్ దాడులను ఎదుర్కొంటోంది. జెరూసలెం అల్-అక్సా మసీదు ఘటన తర్వాత నుంచి పాలస్తీనా, లెబనాన్ నుంచి ఇజ్రాయిల్ పైకి రాకెట్ దాడులు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా సిరియా నుంచి రాకెట్ దాడులు జరిగాయి.