హమాస్ ఉగ్రవాదులపై ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించింది. శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్పై హమాస్ ఉగ్రవాదులు భారీ సంఖ్యలో రాకెట్లతో దాడి చేశారు. ఇజ్రాయెల్ వైపు నుంచి ప్రతీకార చర్య కూడా వచ్చింది. ప్రస్తుతం చాలా మంది భారతీయ పౌరులు ఇజ్రాయెల్లో ఉన్నారు.
ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య కొనసాగుతున్న యుద్ధం మధ్య.. ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ కు వెళ్లే తన విమానాలను రద్దు చేసింది. తమ ప్రయాణికులు, సిబ్బంది భద్రత కోసం ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ నుండి వెళ్లే ఎయిరిండియా విమానాలను అక్టోబర్ 14 వరకు నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు.
Israel-Hamas: హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ పై తీవ్రమై ఉగ్రదాడి చేశారు. ఈ దాడిని ఇండియా, యూకే, యూఎస్ఏ, సౌదీ అరేబియా, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాల అధినేతలు ఖండించారు. ఇప్పటికే ఈ దాడుల వల్ల ఇజ్రాయిల్ లో 300 మందికి పైగా మరణించారు. మరోవైపు ఇజ్రాయిల్ వైమానికి దళం గాజాలోని హమాస్ స్థావరాలపై దాడులు చేస్తోంది. గాజాలో కూడా 250 మందికి పైగా ప్రజలు చనిపోగా.. 1600 మంది వరకు గాయపడినట్లు పాలస్తీనా వైద్య విభాగం వెల్లడించింది.
Israel: ఇజ్రాయిల్ పై హమాస్ మిలిటెంట్లు జరిపిన భీకరదాడిలో ఇప్పటి వరకు 300కు పైగా మంది మరణించారు. గాజా నుంచి ఇజ్రాయిల్ భూభాగంలోకి వచ్చిన ఉగ్రవాదులు పలువురు ఇజ్రాయిల్ పౌరులను, సైనికులను కిడ్నాప్ చేశారు.
Hamas Attack On Isreal:: ఇజ్రాయిల్పై హమాస్ దాడి ఆ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. పటిష్ట ఇంటెలిజెన్స్ విభాగం ఉన్నా కూడా ఇజ్రాయిల్ ఈ దాడిని పసిగట్ట లేకపోయింది. హమాస్ జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు 300 మందికి పైగా మరణించారు. గాజా నుంచి ఇజ్రాయిల్ ప్రాంతాల్లోకి చొరబడిన ఉగ్రవాదులు ఇజ్రాయిలీ పౌరులను బందీలుగా పట్టుకెళ్లారు. ప్రస్తుతం వాటికి సంబంధించిన వీడియోలో ఇంటర్నెట్ లో వైరలవుతున్నాయి.
Israel: ఇజ్రాయిల్పై హమాస్ మిలిటెంట్లు జరిగిన దాడికి మరికొన్ని ఇస్లామిక్ మిలిటెంటు గ్రూపులు మద్దతుగా నిలుస్తున్నాయి. తాజాగా హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ ఇజ్రాయిల్ లోని వివాదాస్పద ప్రాంతాలపైకి దాడులు చేసింది. ఇజ్రాయిల్ సరిహద్దు దేశం లెబనాన్ నుంచి ఈ దాడులు జరిగాయి. ఇజ్రాయిల్ సరిహద్దులోని వివాదాస్పద ప్రాంతాల్లో ఉన్న సైనిక స్థావరాలపై ఆర్టిలరీ షెల్స్, గైడెడ్ మిస్సైళ్లను పేల్చినట్లు లెబనాల్ లో ఉన్న హమాస్ మద్దతుదారు హిజ్బుల్లా ఆదివారం తెలిపింది.
Nushrratt Bharuccha: ఇజ్రాయిల్పై హమాస్ మిలిటెంట్లు శనివారం భీకరదాడి చేశారు. ఏకంగా 5000 రాకెట్లను గాజా నుంచి ఇజ్రాయిల్ వైపు ప్రయోగించారు. ఈ దాడుల్లో 300 మందికి పైగా ఇజ్రాయిలీలు చనిపోగా.. పలువురిని బందీలుగా హమాస్ నిర్బంధించి గాజాకు తీసుకెళ్లింది మరోవైపు ఇజ్రాయిల్ ప్రతీకారంతో రగిలిపోతోంది. గాజా నగరాన్ని లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో 250కి పైగా ప్రజలు మరణించారు.
Hamas Attack On Israel: గాజాను పాలిస్తున్న హమాస్ మిలిటెంట్లు ఎప్పుడూ లేని విధంగా ఇజ్రాయిల్ పై భీకరదాడి చేశారు. ఈ దాడిలో ఇప్పటి వరకు 300 మందికిపైగా ఇజ్రాయిలు చనిపోగా.. చాలా మందిని బందీలుగా మిలిటెంట్లు పట్టుకుని, గాజాకు తీసుకెళ్లారు. ప్రపంచవ్యాప్తంగా భారత్తో సహా వివిధ దేశాలు హమాస్ దాడిని ఖండించాయి. అయితే ఇరాన్ మాత్రం హమాస్ దాడికి మద్దతు తెలుపుతూ, ఈ దాడి ఎంతో గర్వంగా ఉందని వ్యాఖ్యానించింది. పలు ఇస్లామిక్ దేశాల్లో ప్రజలు…
Israel-Hamas War: మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గాజా నుంచి హమాస్ మిలిటంట్లు ఇజ్రాయిల్ పై దాడి చేయడంతో ఇరువర్గాల మధ్య యుద్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఈ రోజు అత్యవసరంగా సమావేశం కాబోతోంది. మిడిల్ ఈస్ట్ పరిస్థితుల గురించి క్లోజ్డ్ డోర్ సెషన్ నిర్వహించబోతోందని యూఎన్ వెబ్సైట్ పేర్కొంది. ఇజ్రాయిల్పై హమాస్ దాడులు చేసిన నేపథ్యంలో ఇజ్రాయిల్ యుద్ధంలో ఉందని ఆ దేశ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ అన్నారు.
India Is With Israel: హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ పై భీకరదాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇప్పటి వరకు 200 మంది మరణించినట్లు ఇజ్రాయిల్ ఆర్మీ వెల్లడించింది. మరోవైపు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ గాజాపై వైమానిక దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో వందలకు పైగా పాలస్తీనియన్లు మరణిస్తున్నారు. తాము యుద్ధంలో ఉన్నట్లు ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు ప్రకటించారు. ఇజ్రాయిల్ పౌరులు, సైనికులను బందీలుగా గాజాలోకి తీసుకెళ్లారు హమాస్ మిలిటెంట్లు.