Telangana Rajya Sabha Candidates: తెలంగాణ నుంచి రాజ్యసభకు వేం నరేందర్రెడ్డి, సింఘ్వి..
- తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడిగా వేం నరేందర్రెడ్డి ఖరారు
- రేపు నామినేషన్ దాఖలు చేయనున్న అభిషేక్ మనుసింఘ్వి, వేం నరేందర్రెడ్డి
- అధిష్టానం గ్రీన్ సిగ్నల్తో నామినేషన్ల పర్వం ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఉత్కంఠకు తెరపడింది. అధికార కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను ఖరారు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వేం నరేందర్రెడ్డి పేరును అధిష్టానం అధికారికంగా ఖరారు చేసింది. వీరు రేపు (గురువారం) తమ నామినేషన్లను దాఖలు చేయనున్నారు.
తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపే అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి పేరును కూడా ఖరారు చేశారు. జాతీయ రాజకీయాల్లో ఆయనకున్న అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజకీయంగా ఎంతో కాలంగా వెన్నంటి ఉన్న వేం నరేందర్రెడ్డికి ఈసారి అవకాశం దక్కింది. సీఎం పీసీసీ చీఫ్గా ఉన్నప్పటి నుంచి నరేందర్ రెడ్డి పార్టీ కోసం చేసిన సేవలకు దక్కిన గుర్తింపుగా దీనిని భావిస్తున్నారు.
Also Read
- KTR: "మీ గల్లీ కేసీఆర్ మీరే కావాలి".. అలాంటి వాళ్లకే కార్పొరేట్ టికెట్ ఇస్తామన్న కేటీఆర్..
- Hyderabad: పసిబిడ్డతో వెళ్తున్న మహిళపై కామాంధుడి వికృత చేష్టలు.. ఇంకొకడు ఇలాంటి పని చేయాలంటే వణుకు పుట్టేలా..
- OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
- Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
అభ్యర్థులు ఖరారు కావడంతో, అభిషేక్ మను సింఘ్వి , వేం నరేందర్రెడ్డి రేపు అధికారికంగా నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలాబలాల దృష్ట్యా ఈ ఇద్దరు అభ్యర్థుల గెలుపు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ అభ్యర్థుల ఎంపికకు ముందు ఏఐసీసీ అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ జూమ్ మీటింగ్ ద్వారా సుదీర్ఘంగా చర్చించారు. సామాజిక సమీకరణాలు , పార్టీ విధేయతను పరిగణలోకి తీసుకుని మల్లికార్జున ఖర్గే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Off The Record : ఢిల్లీ వర్సెస్ గల్లీ.. బీజేపీ హైకమాండ్ నిర్ణయాలపై తెలంగాణ నేతల గుర్రు?
తాజావార్తలు
-
Satya Kumar Yadav: ‘ఎబోలా’పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం.. అధికారులకు ఆదేశాలు జారీ.!
-
Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇక నుంచి ఆ ప్రాంతాలకు వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్స్..
-
Anaparthi: చోరీ ముఠా గుట్టురట్టు.. 13 కేసుల్లో నిందితుల అరెస్ట్.. రూ.75 లక్షల బంగారం స్వాధీనం
-
West Bengal: బంగ్లాదేశీయులు, రోహింగ్యాలకు బ్యాడ్ న్యూస్.. బెంగాల్ ప్రభుత్వం బిగ్ యాక్షన్! ఆ సెంటర్లు రెడీ..
-
RR VS MI: రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్.. అందరి కళ్లు వైభవ్ సూర్యవంశీ వైపే..
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?