పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్ మరో కీలక అధికారిని పోగొట్టుకుంది. ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ లాంటి కీలక నేతలను పోగొట్టుకున్న ఇరాన్.. తాజాగా మరో కీలక అధికారిని ఇజ్రాయెల్ అంతమొందించింది. ఈ మేరకు ఐడీఎఫ్ ఎక్స్లో పేర్కొంది.
Iran War: ఇరాన్ యుద్ధం రోజు రోజుకు తీవ్రమవుతోంది. యుద్ధం ప్రారంభమై 16 రోజులకు చేరింది. ఇజ్రాయిల్, అమెరికా ఇరాన్పై దాడులు చేసిన తొలిరోజే ఆ దేశ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీని చంపేశారు. దీంతో ఇరాన్ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూను చంపేస్తామని ఇరాన్ ఆదివారం ప్రతిజ్ఞ చేసింది.
దేశీయ స్టాక్ మార్కెట్ అల్లకల్లోలంగా మారింది. పశ్చిమాసియా యుద్ధం ప్రారంభం అయిన దగ్గర నుంచి మార్కెట్ కుదేల్ అయిపోతుంది. తాజాగా ఈ వారం ప్రారంభంలో కూడా మార్కెడ్ ఢమాల్ అయింది. సోమవారం ఉదయం భారీ నష్టాలతో మార్కెట్ ప్రారంభమైంది
ఇరాన్ సుప్రీం లీడర్గా అయతుల్లా అలీ ఖమేనీ కుమారుడు మోజ్తాబా ఖమేనీ (56) నియమితులయ్యారు. తమ పాత్ర లేకుండా ఇరాన్ సుప్రీం లీడర్గా ఎవరు ఎన్నికైనా చంపేస్తామని అమెరికా, ఇజ్రాయెల్ హెచ్చరించిన తర్వాత కూడా మోజ్తాబా ఖమేనీ ఎన్నిక కావడం తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
మధ్యప్రాచ్యం యుద్ధం వేళ ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ సంచలన ప్రకటన చేశారు. టెలివిజన్లో కీలక ప్రసంగం చేశారు. పక్క దేశాలపై దాడులు చేయబోమని తెలిపారు. ఈ సందర్భంగా ఇరుగుపొరుగు దేశాలకు కూడా క్షమాపణలు చెప్పారు.
బాంబులతో ఇరాన్ దద్దరిల్లుతోంది. ఇజ్రాయెల్, అమెరికా ఎడాపెడా దాడులు చేస్తోంది. గత శనివారం నుంచి ఏకధాటిగా దాడులు చేస్తోంది. దీంతో ఇరాన్లో బీభత్సం జరుగుతోంది.
బాబోయ్.. మధ్యప్రాచ్యం యుద్ధం మరింత తీవ్రతరం అవుతోంది. నిన్నటి నుంచి యుద్ధం భీకరంగా జరుగుతోంది. టెల్ అవీవ్పై ఇరాన్ దాడి చేసిన తర్వాత.. టెహ్రాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు దిగింది. ఖమేనీ కోసం నిర్మించిన బంకర్లను.. ఎయిర్పోర్టును పేల్చేసింది.
మధ్యప్రాచ్యంలో యుద్ధం మరింత తీవ్రతరం అవుతోంది. గత నెల 28న ప్రారంభమైన యుద్ధం రోజురోజుకు పెరిగిపోతుంది. దాడులు-ప్రతిదాడులతో పశ్చిమాసియా దద్దరిల్లిపోతోంది.
అయతుల్లా అలీ ఖమేనీ. ఇరాన్ సుప్రీం లీడర్. అత్యున్నతమైన హోదాలో ఉన్న నాయకుడు. ప్రపంచంలో గుర్తింపు ఉన్న నేత. అలాంటి నాయకుడిని ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా అంతమొందించాయి. ఈ ఘటన ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసింది.
మధ్యప్రాచ్య యుద్ధంతో దేశీయ స్టాక్ మార్కెట్ కుదేల్ అయిపోతుంది. ఈ వారం మార్కెట్ ప్రారంభం నుంచి భారీ నష్టాలను ఎదుర్కొంటోంది. ఇప్పటికే లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది.