US-Iran Tension: గాజా ‘‘బోర్డ్ ఆఫ్ పీస్’’ కార్యక్రమం జరిగిన వెంటనే అమెరికా ఇరాన్పై దాడులకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఇరాన్ వ్యాప్తంగా జరిగిన ప్రభుత్వం వ్యతిరేక నిరసనల్ని మత పాలకులు అణిచివేశారు. అయితే, దీనిని సాకుగా చూపుతూ యూఎస్ దాడులకు సిద్ధమవుతుందా?
అమెరికా-ఇరాన్ మధ్య మరోసారి తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 837 మంది నిరసనకారులను ఉరితీసేందుకు ఇరాన్ సిద్ధమైంది. దీంతో అగ్ర రాజ్యం అమెరికా అప్రమత్తమైంది. అమెరికాకు చెందిన అతి పెద్ద యూఎస్ఎస్ అబ్రహం లింకన్ నౌక్ ఇరాన్ సమీపంగా వెళ్తున్నట్లు తెలుస్తోంది.
గాజాలో పాలన కోసం ట్రంప్ శాంతి మండలిని ఏర్పాటు చేస్తున్నాన్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఈ శాంతి మండలిలో భారత్తో పాటు అనేక దేశాలను ట్రంప్ ఆహ్వానించారు. అయితే ఈ శాంతి మండలిని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తొలుత వ్యతిరేకించారు. తాజాగా మనసు మార్చుకున్నారు.
ఇరాన్ను నిన్నామొన్నటి దాకా ట్రంప్ పదే పదే వార్నింగ్లు ఇచ్చారు. కొద్దిరోజుల తర్వాత సౌదీ, ఖతార్ మధ్యవర్తిత్వంతో అమెరికా మెత్తబడింది. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వంతు వచ్చింది. తాజాగా ఇరాన్కు నెతన్యాహు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటి వరకు తెలియని శక్తిని చూస్తారంటూ సూచించారు.
Iran Protests: వెనిజులా సైనిక చర్య నేపథ్యంలో, అమెరికా ఇరాన్లో ఏదైనా సైనిక చర్య చేపడుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే, ఇరాన్ వ్యాప్తంగా ప్రజలు తీవ్రస్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ద్రవ్యోల్భణం, నిరుద్యోగం, ప్రభుత్వంపై ఉద్యమాన్ని తీవ్రం చేస్తున్నారు. ఇప్పటికే, ఈ అల్లర్లలో 30 మందికి పైగా చనిపోయారు. మరోవైపు, బలవంతంగా ఇరాన్ ప్రభుత్వం, నిరసనకారులపై కాల్పులు జరిపితే చూస్తూ ఊరుకోబోమని అమెరికా ఇప్పటికే ప్రకటించింది.
ఇరాన్లో సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. టెహ్రాన్లో పరిపాలనా భవనం దగ్గరకు నిరసనకారులు రావడంతో భద్రతా దళాలు కాల్పులకు తెగబడ్డారు. దీంతో 16 మంది ఆందోళనకారులు మృతిచెందారు.
భారత్-పాకిస్థాన్ యుద్ధం విషయాన్ని ట్రంప్ మరోసారి ప్రస్తావించారు. రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపితే సరైన క్రెడిట్ దక్కలేదని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్లోరిడాలోని పామ్ బీచ్లో నెతన్యాహును కలిసిన సందర్భంగా మరోసారి ట్రంప్ గుర్తుచేశారు.
Israel: ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో నమాజ్ చేస్తున్న పాలస్తీనా వ్యక్తి పైకి గురువారం ఒక ఇజ్రాయిలీ సైనికుడు వాహనంతో దూసుకెళ్లడం వివాదాస్పదంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో తమకు అందిందని ఇజ్రాయిల్ సైన్యం ఒక ప్రకటనలో వెల్లడించింది.
గాజా-ఇజ్రాయెల్ యుద్ధం ఏ రేంజ్లో జరిగిందో ప్రపంచం మొత్తానికి తెలిసిందే. రెండేళ్ల పాటు గ్యాప్ లేకుండా రెండు దేశాల మధ్య వార్ నడిచింది. హమాస్ ఉగ్రవాదుల అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం భీకర యుద్ధం చేసింది.