Congress: 2014 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి అమెరికా నిఘా సంస్థ CIA, ఇజ్రాయిల్ గూఢచార ఏజెన్సీ మొసాద్ కుట్ర పన్నాయని కాంగ్రెస్ మాజీ ఎంపీ కుమార్ కేట్కర్ ఆరోపించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాజీ జర్నలిస్ట్ కేట్కర్ మాట్లాడుతూ.. 2004 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 145 సీట్లు, ఐదేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో 206 సీట్లు గెలుచుకుందని అన్నారు. ట్రెండ్స్ ప్రకారం చూస్తే, కాంగ్రెస్ 250 సీట్లు గెలుచుకుని అధికారం…
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత పర్యటన మరోసారి వాయిదా పడింది. ఈ ఏడాది చివరిలో భారత్లో పర్యటించాల్సి ఉండగా ఢిల్లీ పేలుడు కారణంగా మరోసారి పర్యటన వాయిదా పడింది.
మెక్సికోలో ఇజ్రాయెల్ రాయబారి ఐనాట్ క్రాంజ్-నీగర్ హత్యకు ఇరాన్ కుట్ర పన్నిందని అమెరికా, ఇజ్రాయెల్ ఆరోపించాయి. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఈ హత్యకు ప్లాన్ చేశాయని శుక్రవారం వెల్లడించాయి.
ఇజ్రాయెల్కు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. వెస్ట్ బ్యాంక్ను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తే మా మద్దతు మొత్తాన్ని కోల్పోతారని ఇజ్రాయెల్కు అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వార్నింగ్ ఇచ్చారు. ఇది చాలా తెలివి తక్కువ పని అంటూ జేడీ వాన్స్ వ్యాఖ్యానించారు.
గాజాలో మళ్లీ బాంబుల మోత మోగుతోంది. ఒక వారం పాటు ప్రశాంతంగా ఉన్న గాజాలో మళ్లీ బాంబులు మోతతో దద్దరిల్లింది. ఇటీవల ఈజిప్టు వేదికగా గాజా శాంతి ఒప్పందం జరిగింది. హమాస్ ఉగ్రవాదులు.. బందీలను విడిచిపెట్టారు. అలాగే పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెట్టింది. ప్రస్తుతం అంతా కూల్గా ఉందనుకున్న సమయంలో మరోసారి ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడ్డాయి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలను హమాస్ ఉగ్రవాదులు లెక్కచేయడం లేదు. ఆయుధాలు విడిచిపెట్టాలని ట్రంప్ హెచ్చరించారు. కానీ హమాస్ మాత్రం లెక్కచేయడం లేదు. తాజాగా 8 మందిని బహిరంగంగా కాల్చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Hamas: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయిల్-హమాస మధ్య శాంతి ఒప్పందాన్ని కుదిర్చారు. 2 ఏళ్లుగా కొనసాగుతున్న యుద్ధాన్ని నిలిపేశారు. 20 మంది బతికి ఉన్న బందీలను హమాస్ విడుదల చేస్తోంది. బందీల విడుదలతో ఇజ్రాయిల్ మొత్తం ఆనందంతో సంబరాలు చేసుకుంది. ఇదిలా ఉంటే, ఈ ఆనందం మాటున ఒక విషాదం కూడా దాగుంది. రెండేళ్ల క్రితం అక్టోబర్ 07,2023లో హమాస్ జరిపిన దాడిలో, కిడ్నాప్కు గురైన నేపాల్ హిందూ విద్యార్థి బిపిన్ జోషి మరణించారు. అతడి…
గాజాలో శాంతి వాతావరణం నెలకొనడంతో ప్రపంచ వ్యాప్తంగా ట్రంప్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆయా దేశాధినేతలంతా ట్రంప్ను అభినందిస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కూడా చేశారు. తొలిసారి ట్రంప్ను బైడెన్ అభినందించారు.
గాజా శాంతి శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోడీ హాజరుకాకపోవడాన్ని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తప్పుపట్టారు. శాంతి సదస్సుకు రావాలని మోడీని ఈజిప్టు అధ్యక్షుడు, ట్రంప్ సంయుక్తంగా ఆహ్వానించారు. కానీ మోడీ వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నారు.
ఇజ్రాయెల్ పార్లమెంట్ (నెస్సెట్)లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్టాండింగ్ ఒవేషన్ అందుకున్నారు. అక్కడ ఆయనకు శాసనసభ్యుల నుంచి సుదీర్ఘ చప్పట్లు, హృదయపూర్వక ప్రశంసలు లభించాయి. ఈ సమావేశంలో, అమెరికా-ఇజ్రాయెల్ సంబంధాలను బలోపేతం చేయడానికి చేసిన కృషికి విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్, ఇజ్రాయెల్కు అమెరికా రాయబారి మైక్ హకబీ ప్రత్యేక ప్రశంసలు అందుకున్నారు. హమాస్ చెర నుంచి ప్రాణాలతో ఉన్న బందీలందరూ తిరిగి వచ్చిన తర్వాత ఇజ్రాయెల్లో అమెరికా అధ్యక్షుడు…