Israel: మధ్యప్రాచ్చంలో ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బుధవారం రోజు జెరూసలెంలోని ప్రఖ్యాత అల్-అక్సా మసీదులో ఘర్షణ తర్వాత ఇజ్రాయిల్ వరసగా దాడులను ఎదుర్కొంటోంది. అల్-అక్సా ఘటన తర్వాత పాలస్తీనా గాజా నుంచి, లెబనాన్ నుంచి రాకెట్ దాడులను ఎదర్కొంది ఇజ్రాయిల్. దీనికి ప్రతీగా ఇజ్రాయిల్ పాలస్తీనా, లెబనాన్ పై వైమానిక దాడులు చేస్తోంది.
Israel blames Hamas for multiple rockets launched from Lebanon: ఇజ్రాయిల్, లెబనాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. లెబనాన్ నుంచి హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయిల్ పై రాకెట్ దాడులు చేసినట్లు ఆ దేశం ఆరోపిస్తోంది. ఇప్పటికే లెబనాన్ చర్యలపై ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు స్పందించారు. శతృవులు మూల్యం చెల్లించుకోక తప్పదని మెచ్చరించారు. ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ గురువారం అర్థరాత్రి పాలస్తీనా గాజా స్ట్రిప్ పై వైమానికి దాడులు నిర్వహించింది.
26/11 Mumbai Attack: 26/11 ముంబయి దాడికి ప్లాన్ చేసినవారు భారీ మూల్యాన్ని చెల్లించాల్సిందే అని ఇజ్రాయిల్ పార్లమెంట్ స్పీకర్ అన్నారు. తొలిసారిగా భారత్ పర్యటకు వచ్చిన అమీర్ ఓహానా నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత్ కు వచ్చారు. ముంబై దాడికి ప్లాన్ చేసిన లష్కరేతోయిబా ఉగ్రవాది ఎవరైనా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని అన్నారు. భారత్, ఇజ్రాయిల్ రెండు ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్నాయని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అన్ని దేశాలు ముందుకు రావాలని ఆయన అన్నారు.
ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ నగరం నబ్లస్పై బుధవారం జరిగిన దాడిలో ఇజ్రాయెల్ దళాలు 10 మంది పాలస్తీనియన్లను చంపగా, 80 మందికి పైగా తుపాకీ గాయాలకు గురయ్యారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
Russia-Ukraine War: రష్యా, ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం ఈ నెలలో ఏడాదికి చేరింది. ఏడాది కాలంగా ఇరు దేశాలు మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్ని ఉన్నాయి. ఇప్పటికే రష్యా, ఉక్రెయిన్ లోని ఖేర్సన్, జపోరొజ్జియా, లూహాన్స్క్, డోనాట్స్క్ ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది. మరోవైపు ఉక్రెయిన్ అమెరికా, యూరప్ దేశాలు, ఇతర నాటో దేశాలు ఇచ్చే ఆర్థిక, సైనిక సహకారంతో రష్యాతో పోరాడుతోంది.
పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడి జరిపింది. జెనిన్లోని శరణార్థి శిబిరంపై జరిగిన ఈ దాడుల్లో పది మంది ప్రాణాలు కోల్పోయారు. పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్లో ఇజ్రాయెల్ సైన్యం జరిపిన ఈ దాడుల్లో పలువురికి తీవ్ర గాయాలయ్యాయని అధికారులు తెలిపారు.
ఇజ్రాయెల్ నూతన ప్రధానిగా బెంజమిన్ నెతన్యాహు ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో నెతన్యాహు ఇజ్రాయెల్లో ఎక్కువకాలం ప్రధానిగా పని చేసిన వ్యక్తిగా పేరుగాంచారు.
భారత్కు చెందిన మద్రాస్ ఐఐటీ, ఇజ్రాయెల్కు చెందిన టెల్ అవీవ్ యూనివర్సిటీ, అమెరికాకు చెందిన కొలంబియా వర్సిటీ పరిశోధకులు "GNB1 ఎన్సెఫలోపతి" అనే అరుదైన జన్యు మెదడు వ్యాధిని అధ్యయనం చేస్తున్నారు.
2000Year Old Candle : ఇజ్రాయెల్లో రెండు వేల ఏండ్ల కిందటి మట్టి క్యాండిల్ లభ్యమైంది. నాలుగో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు గలీలీ సమీపంలోని కిబ్బట్జ్ పరోడ్ ప్రాంతంలో దీన్ని గుర్తించారు.