Operation Ajay: ఇజ్రాయిల్- పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ మధ్య పూర్తిస్థాయి యుద్ధంగా మారుతున్న నేపథ్యంలో భారతదేశం, ఇజ్రాయిల్ లో చిక్కుకున్న తమ పౌరులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ‘ఆపరేషన్ అజయ్’ని ప్రారంభించింది. ఇజ్రాయిల్ లో భారతీయులు 18,000 మంది ఉన్నారు. ప్రత్యేక చార్టర్ విమానాల ద్వారా ఏర్పాట్లు చేస్తున్నారు.
Israel-Hamas War: ఇజ్రాయిల్పై హమాస్ ఉగ్రసంస్థ మెరుపుదాడి యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపోయేలా చేసింది. పటిష్ట నిఘా వ్యవస్థ, సైన్యం ఉన్న ఇజ్రాయిల్ కూడా ఈ దాడిని కలలో కూడా ఊహించి ఉండకపోవచ్చు. పారా గ్లైడర్లు, బుల్డోజర్ల ద్వారా ఇజ్రాయిల్ సరిహద్దు దాటి లోపలకి వచ్చిన హమాస్ ఉగ్రమూకలు దొరికిన వారిని దొరికినట్లు చంపేశాయి. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 1200 మందికి పైగా చనిపోయారు.
Israel-Hamas War: ఇజ్రాయిల్ పై దాడి చేసి చిన్న పిల్లల్ని, వృద్ధుల్ని, మహిళల్ని హతమార్చింది హమాస్ ఉగ్రవాద సంస్థ. హమాస్ జరిపిన దాడిలో ఇప్పటి వరకు 1200 మందికి పైగా ఇజ్రాయిల్ పౌరులు మరణించారు. ఇదిలా ఉంటే హమాస్ జరిపిన అనాగరిక హత్యల చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు. బుధవారం ఎక్స్ లో పోస్ట్ చేస్తూ.. హమాస్, ఐసిస్ కన్నా హీనంగా ఉందని విమర్శించారు. ఒక జాతిని నిర్మూలించాలనుకున్న ఉగ్రవాదులే ఇలాంటి…
Israel-Hamas War: ఇజ్రాయిల్పై హమాస్ ఉగ్రవాదుల దాడి మిడిల్ ఈస్ట్ లో మరోసారి టెన్షన్ వాతావరణం తీసుకువచ్చింది. హమాస్ దాడుల వల్ల ఇప్పటి వరకు 1200 మందికి పైగా ఇజ్రాయిలీ పౌరులు మరణించగా.. పలువురు బందీలుగా చేసుకుని గాజాకు తీసుకెళ్లింది హమాస్. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ తీవ్ర ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది.
Israel-Hamas War: ఇజ్రాయిల్పై హమాస్ తీవ్రవాదులు శనివారం భీకరదాడులకు పాల్పడ్డారు. ఈ దాడులకు ప్రతీకారంగా గాజా స్ట్రిప్పై ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) విరుచుకుపడుతోంది. గాజాలోని ప్రముఖ భవనాలను బాంబులతో కుప్పకూలుస్తోంది. ఈ దాడులకు ప్రధాన సూత్రధారి, హమాస్ మిలిటరీ వింగ్ చీఫ్ మహ్మద్ డయిఫ్ ఇంటిని టార్గెట్ చేసింది ఇజ్రాయిల్. ఈ దాడిలో డయిఫ్ కుటుంబ సభ్యులు మరణించినట్లుగా హమాస్ ధృవీకరించింది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఇరు వైపుల మరణాల సంఖ్య 3000ను దాటింది.
Israel–Hamas war: దశాబ్దాలు గడుస్తున్న ఇప్పటికీ ఇజ్రాయిల్, పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ మధ్యన పచ్చి గడ్డి వేస్తే భగ్గుమంటుంది. గత కొంతకాలంగా ఆ ఘర్షణలు సద్దుమణిగినట్లు అనిపించిన మళ్లీ శనివారం ఇజ్రాయిల్ హమాస్ మధ్య ప్రారంభమైన యుద్ధం నేటికీ కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధంలో ఇరు దేశాల వైపు నుండి భారీ ప్రాణ నష్టం జరిగింది. ఇలా రెండు దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధంలో సాధారణ ప్రజలు బలైపోతున్నారు. అయితే తాజాగా ఇజ్రాయిల్ హమాస్ పైన…
Israel: హమాస్ ఉగ్రవాదుల చేసిన దుశ్చర్యలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇది యుద్ధం కాదు, ఊచకోతలా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా తలను తెగనరికారు. ఒక కిబుట్జ్లో ఏకంగా 40 మంది చిన్నారులను దారుణంగా చంపేశారు. కొందరు తలలు వేరి చేసి ఉన్నట్లు అక్కడికి వెళ్లిన మీడియా సంస్థల ప్రతినిధులు తెలిపారు.
Aligarh Muslim University: ఇజ్రాయిల్- పాలస్తీనా హమాస్ యుద్ధంలో ఇండియాలోని ప్రజలు కూడా ఇరుపక్షాలకు మద్దతు తెలుపుతున్నారు. తాజాగా అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ(ఏఎంయూ)లో పాలస్తీనాకు మద్దతుగా కొందరు విద్యార్థులు ర్యాలీ నిర్వహించడం వివాదాస్పదమైంది. పాలస్తీనాకు సంఘీభావం తెలిపేందుకు పలువరు విద్యార్థులు సోమవారం మార్చ్ నిర్వహించినట్లు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Israel: గాజాపై విరుచుకుపడేందుకు ఇజ్రాయిల్ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. శనివారం హమాస్ టెర్రరిస్టులు జరిపిన దాడిలో 900 మంది వరకు ఇజ్రాయిల్ ప్రజలు చనిపోయారు. ఇదిలా ఉంటే భారీ స్థాయిలో యుద్ధం చేసేందుకు ఇజ్రాయిల్ సమాయత్తం అవుతోంది. ఇప్పటికే తాము యుద్ధంలో ఉన్నామని ఆ దేశ ప్రధాని బెంజిమెన్ నెతన్యహూ ప్రకటించాడు. యుద్ధం మీరు మొదలుపెట్టారు, తాము ముగిస్తామని హమాస్కి వార్నింగ్ ఇచ్చారు.
Israel-Hamas: ఇజ్రాయిల్పై హమాస్ ఉగ్రవాదుల దాడి భీకర యుద్ధానికి దారి తీసింది. శనివారం తెల్లవారుజామున హమాస్ మిలిటెంట్లు గాజా ప్రాంతం నుంచి ఇజ్రాయిల్ పైకి రాకెట్లతో దాడి జరిపారు. ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ ని ఏమార్చి సరిహద్దులు దాటి ఇజ్రాయిల్ పౌరులను చంపారు. పలువురిని బందీలుగా పట్టుకుని గాజాలోకి తీసుకెళ్లారు.