Israel-Hamas: బందీలకు ఏమైనా జరిగితే ఊరుకోమన్న ఇజ్రాయిల్.. అలా అయితే బందీలను ఉరితీస్తామన్న హమాస్..
Israel-Hamas: ఇజ్రాయిల్-హమాస్ మధ్య యుద్ధం భీకరంగా సాగుతోంది. ఇరు పక్షాలు ఒకరికొకరు వార్నింగ్ ఇచ్చుకుంటున్నాయి. ఇప్పటికే ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ మాట్లాడుతూ.. యుద్ధాన్ని హమాస్ మొదలుపెట్టింది, మేము ముగిస్తామని వార్నింగ్ ఇచ్చారు. హమాస్ ఉగ్రసంస్థను నెతన్యాహు ఐసిస్తో పోల్చారు. మేము యుద్ధాన్ని కోరుకేలేదు, మాపై రుద్ధబడిందని, ఐసిస్ ను నాశనం చేసేందుకు నాగరిక శక్తులు ఏకమైనట్లే, హమాస్ అంతానికి ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఇందుకు తగ్గట్లుగానే ఇజ్రాయిల్ సైన్యం గాజా ప్రాంతంపై బాంబులతో విరుచుకుపడుతోంది.
మరోవైపు ఇజ్రాయిల్ బందీలకు ఉరిశిక్ష విధిస్తామని హమాస్ మిలిటెంట్లు హెచ్చరించారు. గాజా ప్రజల నివాసాలపై ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా దాడులు చేస్తే ఇజ్రాయిల్ బందీలను చంపేస్తామని హమాస్ మిలిటరీ ప్రతినిధి అబు ఉబైదా హెచ్చరించారు. ఈ మరణశిక్షలను ప్రసారం చేస్తామని అతను చెప్పాడు. ఇక్కో బాంబుకు ఒక్కో బందీని హత్య చేస్తామని హెచ్చరించారు.
Also Read
- Maulana Salman Azhar: భారత్ శత్రువులకు పాక్ గడ్డపై నూకలు చెల్లాయా? జైష్ టాప్ కమాండర్ సల్మాన్ అజార్ ఖతం!
- UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్కు లాభం, పాకిస్తాన్కు నష్టం..
- Donald Trump: ట్రంప్ను రోస్ట్ చేసిన కింగ్ చార్లెస్.. మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారంటూ ఎగతాళి
- Ali Pervaiz Malik: పాక్ మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు.. మా దగ్గర ఒక్క రోజుకు కూడా పెట్రోల్ లేదు.. భారత్తో మనం పోల్చుకోలేము
Read Also: PM Modi: ఇజ్రాయిల్ ప్రధానితో మాట్లాడిన నరేంద్ర మోడీ.. అండగా ఉంటామని హామీ..
ఇజ్రాయిల్ నుంచి కిడ్నాప్ అయిన వారికి ఏమైనా జరిగితే హమాస్ పరిస్థితి మరింతగా దిగజారుతుందని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్( ఐడీఎఫ్) హెచ్చరికలు జారీ చేసింది. బందీల్లో ఉన్నవారిలో ఒక్క వృద్ధురాలికైనా, పసికందుకైనా వారు హాని చేస్తే హమాస్ పరిస్థితి మరింతగా దిగజారుతుందని, అది వారికి కూడా తెలసని ఐడీఎఫ్ ప్రతినిధి రిచర్డ్ హెచ్చరించారు.
ఇప్పటికే ఈ యుద్ధంలో 1600 మంది చనిపోయారు. హమాస్ దాడిలో 900 మంది ఇజ్రాయిల్ పౌరులు చనిపోగా.. ఇజ్రాయిల్ వైమానికి దళం గాజాపై జరిపిన దాడిలో 700 మందికి పైగా చనిపోయారు. రానున్న రోజుల్లో యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే గాజాస్ట్రిప్ ను ఇజ్రాయిల్ దిగ్భందించింది. కరెంట్, తాగునీరు, నిత్యావసరాలన్ని కట్ చేసింది. గాజాలోని ప్రజలు ఈజిప్టు పారిపోవాల్సిందిగా హెచ్చరించింది. ఇజ్రాయిల్ 3,00,000 మంది సైన్యాన్ని సమీకరించింది. వివిధ దేశాల్లో ఉన్న ఇజ్రాయిలీలు మాతృదేశ రక్షణ కోసం ఇజ్రాయిల్ కి తీరిగి వస్తున్నారు. గాజా సరిహద్దు ప్రాంతంలో వసతులు, బేస్లను ఇజ్రాయిల్ శరవేగంగా నిర్మిస్తోంది.
తాజావార్తలు
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
-
TRS: టీఆర్ఎస్ పార్టీలోకి 50 మంది చేరిక.. ఎక్కడంటే..
-
Hyderabad Metro : తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలోకి హైదరాబాద్ మెట్రో
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?