Hamas Attack On Israel: గాజాను పాలిస్తున్న హమాస్ మిలిటెంట్లు ఎప్పుడూ లేని విధంగా ఇజ్రాయిల్ పై భీకరదాడి చేశారు. ఈ దాడిలో ఇప్పటి వరకు 300 మందికిపైగా ఇజ్రాయిలు చనిపోగా.. చాలా మందిని బందీలుగా మిలిటెంట్లు పట్టుకుని, గాజాకు తీసుకెళ్లారు. ప్రపంచవ్యాప్తంగా భారత్తో సహా వివిధ దేశాలు హమాస్ దాడిని ఖండించాయి. అయితే ఇరాన్ మాత్రం హమాస్ దాడికి మద్దతు తెలుపుతూ, ఈ దాడి ఎంతో గర్వంగా ఉందని వ్యాఖ్యానించింది. పలు ఇస్లామిక్ దేశాల్లో ప్రజలు…
Israel-Hamas War: మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గాజా నుంచి హమాస్ మిలిటంట్లు ఇజ్రాయిల్ పై దాడి చేయడంతో ఇరువర్గాల మధ్య యుద్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఈ రోజు అత్యవసరంగా సమావేశం కాబోతోంది. మిడిల్ ఈస్ట్ పరిస్థితుల గురించి క్లోజ్డ్ డోర్ సెషన్ నిర్వహించబోతోందని యూఎన్ వెబ్సైట్ పేర్కొంది. ఇజ్రాయిల్పై హమాస్ దాడులు చేసిన నేపథ్యంలో ఇజ్రాయిల్ యుద్ధంలో ఉందని ఆ దేశ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ అన్నారు.
India Is With Israel: హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ పై భీకరదాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇప్పటి వరకు 200 మంది మరణించినట్లు ఇజ్రాయిల్ ఆర్మీ వెల్లడించింది. మరోవైపు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ గాజాపై వైమానిక దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో వందలకు పైగా పాలస్తీనియన్లు మరణిస్తున్నారు. తాము యుద్ధంలో ఉన్నట్లు ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు ప్రకటించారు. ఇజ్రాయిల్ పౌరులు, సైనికులను బందీలుగా గాజాలోకి తీసుకెళ్లారు హమాస్ మిలిటెంట్లు.
Israel: ఇజ్రాయిల్పై గాజా స్ట్రిప్ నుంచి హమాస్ మిలిటెంట్లు మెరుపుదాడి చేశారు. 5000 రాకెట్లతో ఇజ్రాయిల్ పై విరుచుకుపడ్డారు. ఈ దాడిలో హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ పౌరులు, సైన్యాన్ని బందీలుగా పట్టుకుని గాజా నగరానికి తీసుకెళ్లారు .దీనికి సంబంధించిన అనేక వీడియోలు వైరల్ గా మారాయి. మిలిటెంట్లు ఇజ్రాయిల్ సైన్యానికి చెందిన వారిని చంపిన దృశ్యాలు, ఓ మహిళా సైనికురాలిని చంపి నగ్నంగా జీపులో తీసుకెళ్తున్న దృశ్యాలు ఇందులో ఉన్నాయి.
Air India: ఇజ్రాయిల్పై హమాస్ ఉగ్రవాదుల దాడి యుద్ధంగా మారింది. ఇజ్రాయిల్ ప్రతీకారంతో రగిలిపోతోంది. ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇప్పటి వరకు 40 మంది ఇజ్రాయిలీలు మరణించారు. చాలా మందిని హమాస్ బందీలుగా పట్టుకున్నట్లు సమాచారం. మరోవైపు ఇజ్రాయిల్ సైన్యం గాజా స్ట్రిప్ పై విరుచుకుపడుతోంది. వైమానిక దాడులతో హమాస్ స్థావరాలను టార్గెట్ చేస్తోంది. తాము యుద్ధంలో ఉన్నామని ఇప్పటికే ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ ప్రకటించారు.
Israel: ఇజ్రాయిల్ పాలస్తీనాల మధ్య తీవ్ర యుద్ధం చెలరేగింది. గాజా స్ట్రిప్ని పాలిస్తున్న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ పై మెరుపుదాడి చేశారు. పటిష్ట ఇంటెలిజెన్స్ నిఘా, గూఢచార సంస్థలు ఉన్న ఇజ్రాయిల్ ఈ దాడుల్ని ఊహించలేకపోయింది. ఏకంగా 20 నిమిషాల్లోనే 5000 రాకెట్లను ప్రయోగించింది. ఇప్పటికే ఈ దాడుల వల్ల ఇజ్రాయిల్ లో 40 మంది మరణించారు. 700 మందికి పైగా గాయాలయ్యాయి.
Israel: పాలస్తీనా హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్పై మెరుపుదాడి చేశారు. కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే 5000 రాకెట్లతో ఇజ్రాయిల్ భూభాగాలపై దాడులు నిర్వహించారు. సరిహద్దుల్లోనే పట్టణాలను టార్గెట్ చేస్తూ దాడులు జరిగాయి. గాజా నుంచి ఇజ్రాయిల్ భూభాగాల్లోకి చొరబడిన హమాస్ మిలిటెంట్లు సాధారణ పౌరులను పిట్టల్లా కాల్చారు.
Hamas Attack On Israel: ఇజ్రాయిల్పై పాలస్తీనా గాజా నుంచి హమాస్ తీవ్రవాదులు భీకరదాడులు చేశారు. కేవలం నిమిషాల వ్యవధిలోనే వేల సంఖ్యలో రాకెట్లను గాజా నుంచి ఇజ్రాయిల్ నగరాలు, పట్టణాలపై ప్రయోగించారు. ఇజ్రాయిల్ భూభాగంలోకి వెళ్లిన హమాస్ తీవ్రవాదులు అక్కడి సాధారణ పౌరులపై కాల్పులకు తెగబడ్డారు. పలువురు ఇజ్రాయిల్ జాతీయులను బందీలుగా పట్టుకున్నారు.
India issues advisory: ఇజ్రాయిల్, హమాస్ మిలిటెంట్ల మధ్య భారీ యుద్దం జరుగుతోంది. అంతకుముందు ఈరోజు హమాస్ మిలిటెంట్లు గాజా స్ట్రిప్ ప్రాంతం నుంచి 5000 రాకెట్లను ఇజ్రాయిల్ పైకి ప్రయోగించారు. ఈ నేపధ్యంతో తాము యుద్ధం చేస్తున్నామని ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యహు ప్రకటించారు. ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ లో ఉంటున్న భారత పౌరుల రక్షణ కోసం అక్కడి రాయబార కార్యాలయం కీలక సూచనల్ని జారీ చేసింది.