Iran's strikes in Pakistan: పాకిస్తాన్పై ఇరాన్ దాడి చేసింది. బలూచిస్తాన్ లోని కీలమైన రెండు ప్రాంతాలపై వైమానికి దాడులకు పాల్పడింది. దీనిపై భారత్ స్పందించింది. ఇది రెండు దేశాలకు సంబంధించిన విషయమని, ఉగ్రవాదం పట్ల ఇరాన్ స్పందించిందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇరాన్ తన ఆత్మరక్షణ కోసం దాడులు చేసినట్లు భారత్ అర్థం చేసుకుంటుందని తెలిపింది. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ వైఖరిని భారత్ మరోసారి నొక్కి చెప్పింది.
Pakistan : పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరంపై దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. పాకిస్థాన్లోని జైష్-అల్-అద్ల్ ఉగ్రవాద సంస్థ స్థావరాలపై మంగళవారం దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది.
సిరియా, నార్తన్ ఇరాక్ ప్రాంతాలపై ఇరాన్ దాడులకు దిగింది. సిరియా, ఇరాక్ ఆధీనంలోని స్వయం ప్రతిపత్తి కలిగిన కుర్దిస్థాన్ ఏరియాలో ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని క్షిపణిలతో దాడులు చేసింది.
ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులకు పాల్పడుతున్న హౌతీ తిరుగుబాటుదారులపై అమెరికా, బ్రిటన్ బలగాలు ఎదురుదాడికి దిగాయి. రెండు దేశాల సైన్యాలు హౌతీ తిరుగుబాటుదారులు ఉపయోగించే డజన్ల కొద్దీ స్థావరాలపై బాంబు దాడులు చేశాయి.
CM Revanth Reddy: వివిధ దేశాల ప్రతినిధులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆతిథ్యం ఇచ్చారు. హైదరాబాద్లోని కుతుబ్షాహీ టూంబ్స్లో 13 దేశాల ప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆతిథ్యం ఇచ్చారు.
Iran: ఇస్లామిక్ దేశం ఇరాన్లో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో అందరికి తెలుసు. అక్కడ హత్యలకు పాల్పడిని, మోసం చేసినా, డ్రగ్స్ అక్రమ రవాణా వంటి వాటికి మరణశిక్షలు విధిస్తుంటారు. ఇక స్త్రీలు మత పద్ధతులు ఉల్లంఘించినా, హిజాబ్ ధరించకపోయిన శిక్షలు కఠినంగా ఉంటాయి. హిజాబ్ ధరించని కారణంగా అక్కడి మోరాలిటీ పోలిసింగ్ దాడుల్లో 2022లో మహ్సా అమిని అనే యువతిని కొట్టి చంపేశారు. ఈ వివాదం అక్కడ మహిళల్లో, యువతలో తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైంది. పెద్ద…
Islamic State: ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ మాజీ చీఫ్ ఖాసిం సులేమానీ స్మారకార్థం, ఆయన హత్యకు గురై నాలుగేళ్లు అవుతున్న సందర్భంగా.. ఇరాన్ లోని కెర్మాన్లో శ్రద్ధాంజలి ఘటించేందుకు వేల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ సమయంలో జరిగిన రెండు భారీ బాంబు పేలుళ్లలో 103 మంది మరణించారు. అయితే ఈ దాడి తమ పనే అని ‘ఇస్లామిక్ స్టేట్’ ఉగ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించింది. టెలిగ్రామ్ ఛానెల్లో ఈ విషయాన్ని పోస్ట్ చేసింది.
ఇరాన్లో జరిగిన బాంబు పేలుళ్లలో మృతుల పట్ల భారత్ సంతాపం వ్యక్తం చేసింది. ఇరాన్లోని కెర్మాన్లో గురువారం జరిగిన బాంబు పేలుళ్లపై విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ విచారం వ్యక్తం చేశారు. ఇరాన్ ప్రభుత్వానికి, ప్రజలకు భారతదేశం కూడా సంఘీభావం తెలిపింది.
Iran Blasts: ఇరాన్ రివల్యూషనరీ జనరల్ ఖాసిం సులేమాని మరణించి నాలుగేళ్లు అవుతున్న నేపథ్యంలో ఆయన సంస్మరణ సభ నిర్వహిస్తున్న కార్యక్రమంలో జంట పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్ల వల్ల 95 మంది చనిపోయారు. అయితే ఈ పేలుళ్లకు అమెరికా, ఇజ్రాయిల్ కారణమని ఇరాన్ బుధవారం నిందించింది. గాజా యుద్ధం నేపథ్యంలో మరోసారి ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగాయి. అయితే ఇరాన్ దాడిలో తమ ప్రమేయం లేని అమెరికా చెప్పింది. ఇదిలా ఉంటే ఈ దాడిపై ఇజ్రాయిల్…
నాలుగేళ్ల క్రితం అమెరికా డ్రోన్ దాడిలో ఇరాన్ జనరల్ ఖాసిం సులేమానీని హతమార్చింది. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా సమాధి దగ్గర నివాళులు అర్పించేందుకు ప్రజలు గుమికూడిన సమయంలో రెండు పెద్ద బాంబు పేలుళ్లు ఆ ప్రాంతాన్ని అతలాకుతలం చేశాయి. ఈ పేలుడులో కనీసం 100 మందికి పైగా మరణించగా.. 170 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. జనవరి 3, 2020న ఇరాక్ రాజధాని బాగ్దాద్ సమీపంలో ఖాసిం సులేమానీని అమెరికా చంపినప్పుడు, కాన్వాయ్లోని రెండు కార్లు…