Israel-Iran Tensions: ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తత కారణంగా చమురు సంక్షోభం మొదలవుతుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Iran Tensions: శనివారం అర్ధరాత్రి ఇరాన్ తన ప్రధాన శత్రువు ఇజ్రాయెల్పై వేగవంతమైన వైమానిక దాడులను ప్రారంభించినప్పుడు మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఇరాన్ 300 కంటే ఎక్కువ డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించిందని, వాయు రక్షణ వ్యవస్థ ద్వారా దాదాపు అన్నింటినీ నిలిపివేసినట్లు ఇజ్రాయెల్ చెబుతోంది. ఒకవైపు, ఇజ్రాయెల్ మిత్రదేశమైన అమెరికా రెండు దేశాల మధ్య తదుపరి దాడులను నిరోధించడానికి ప్రయత్నిస్తుండగా.. ఇజ్రాయెల్ వార్ క్యాబినెట్, దాని ప్రతీకార చర్య గురించి మాట్లాడుతూ, మా సొంత మార్గంలో, మేము ఎంచుకున్న సమయంలో చర్య తీసుకుంటామని చెప్పింది. రెండు దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రపంచ మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ టెన్షన్ కారణంగా సోమవారం భారత స్టాక్ మార్కెట్లో భారీ క్షీణత కనిపిస్తోంది. బంగారం, వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. అదే సమయంలో భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్న చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది.
రెండు వారాల క్రితం సిరియా రాజధాని డమాస్కస్లోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి చేయడంతో చమురు ధరల పెరుగుదల ప్రారంభమైంది. ఏప్రిల్ 1న జరిగిన దాడిలో ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ సీనియర్ కమాండర్, అతని ఇద్దరు సహాయకులు మరణించారు. అప్పటి నుండి ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేస్తుందనే భయాలు ఉన్నాయి, దీని కారణంగా చమురు ధరలు పెరిగాయి. ఏప్రిల్ 12న ఇరాన్ దాడికి ముందు, చమురు ధరలు 1% పెరిగాయి. ముడి చమురు అంతర్జాతీయ బెంచ్మార్క్ అయిన బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు 90.45కి చేరుకుంది. రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడం వల్ల సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందనే భయం చమురు మార్కెట్లో ఉన్నందున ఈ ఉప్పెన వచ్చింది. అయితే, ఇరాన్ దాడి తర్వాత, చమురు ధరలలో స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది.
Also Read
- Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..
- T20 World Cup: ఆమె భర్త కోసం ప్రాక్టీస్ ఎగ్గొట్టింది.. చివరకు డ్రెస్సింగ్ రూమ్లో పరువు పోయింది..
- Off The Record: ఉదయగిరి టీడీపీలో అంతర్గత విభేదాలు? ఆయనపై అసంతృప్తి పెరుగుతోందా?
- Indian Railway: ఇండియన్ రైల్వేలో సరికొత్త విప్లవం.. టెక్నాలజీ వాడకంలో భారత్ నెక్స్ట్ లెవెల్..
చమురు ధరలు బ్యారెల్కు 130 డాలర్లకు చేరుకోవచ్చు..
అక్టోబరు 7, 2023న ఇజ్రాయెల్పై హమాస్ దాడి తర్వాత గాజాపై ఇజ్రాయెల్ దాడి ప్రారంభమైంది, అదే సమయంలో ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య యుద్ధ స్థాయి పెరుగుతుందని, యుద్ధం చెలరేగుతుందనే భయం నిరంతరం ఉంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధానికి అవకాశం ఉన్న దృష్ట్యా, ముడి చమురు ధరలు 6 నెలల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇదిలావుండగా, చమురు ఉత్పత్తి దేశాలైన ఒపెక్ కూడా చమురు మార్కెట్ స్థిరంగా ఉండటానికి రోజుకు 22 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తిలో కోత విధిస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది.
ఇరాన్ దాడి తర్వాత ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేస్తే, బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్కు 100 డాలర్ల కంటే ఎక్కువ పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ ప్రపంచంలోని ఏడవ అతిపెద్ద చమురు ఉత్పత్తి దేశం, ఒపెక్లో మూడవ అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు. యూఎస్ వ్యాపార వార్తల వెబ్సైట్ రాపిడాన్ ఎనర్జీ ఛైర్మన్, మాజీ సీనియర్ ఎనర్జీ అధికారి బాబ్ మెక్నాలీ CNBCతో మాట్లాడుతూ.. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పెరిగిన ఉద్రిక్తతలు ముడి చమురు ధరలకు కీలకమైన వాణిజ్య మార్గం అయిన హార్ముజ్లో సమస్యలను సృష్టిస్తే ముడిచమురు ధర బ్యారెల్కు120 డాలర్ల నుంచి 130 డాలర్ల వరకు పెరగొచ్చని తెలిపారు. ప్రపంచంలోని మొత్తం చమురు సరఫరాలో 20శాతం ఒమన్, ఇరాన్ మధ్య ఉన్న హార్ముజ్ జలసంధి గుండా వెళుతుంది. ఒపెక్ సభ్యదేశాలు సౌదీ అరేబియా, ఇరాన్, యూఏఈ, కువైట్, ఇరాక్ తమ చమురులో ఎక్కువ భాగం హార్ముజ్ జలసంధి ద్వారా పంపుతాయి. శనివారం ఇక్కడి నుంచి ఇజ్రాయెల్కు చెందిన వాణిజ్య నౌకను ఇరాన్ స్వాధీనం చేసుకుంది.
భారత్పై ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం
భారతదేశం ముడి చమురు యొక్క ప్రధాన దిగుమతిదారు, కాబట్టి ధరలలో ఏదైనా పెరుగుదల నేరుగా దేశం యొక్క ద్రవ్య లోటు, ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది. చమురు ధరలలో పెరుగుదల ఉంటే, అది కరెంట్ ఖాతా లోటును ప్రభావితం చేస్తుంది. కరెంట్ ఖాతా లోటు కూడా పెరుగుతుంది. దిగుమతి చేసుకున్న వస్తువుల ధర ఎగుమతి చేసిన వస్తువుల ధరను మించిపోయినప్పుడు ఇది పెరుగుతుంది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ముడి చమురు బ్యారెల్కు 10 డాలర్ల కంటే ఎక్కువ పెరుగుదల ఉంటే, అప్పుడు కరెంట్ ఖాతా లోటు 40-50 బేసిస్ పాయింట్లు పెరగవచ్చు. ఒక దేశం యొక్క కరెంట్ ఖాతా లోటు ఎక్కువగా ఉంటే, పెట్టుబడిదారుల విశ్వాసం తగ్గుతుంది. ఆ దేశ కరెన్సీ బలహీనపడవచ్చు. దీని కారణంగా దిగుమతులు ఖరీదైనవిగా మారతాయి. విదేశాల నుంచి దేశానికి ఖరీదైన వస్తువులు వచ్చినప్పుడు ద్రవ్యోల్బణం పెరగడం ఖాయమని, దీనివల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుందంటున్నారు నిపుణులు. అంటే చమురు ధరలు పెరిగితే భారత్ ద్రవ్యోల్బణం పెరగడం ఖాయం.
తాజావార్తలు
-
Story Board : నాలుగోసారి గెలవడానికి.. మోడీ దగ్గరున్న త్రిశూల వ్యూహాలేంటి..?
-
Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..
-
T20 World Cup: ఆమె భర్త కోసం ప్రాక్టీస్ ఎగ్గొట్టింది.. చివరకు డ్రెస్సింగ్ రూమ్లో పరువు పోయింది..
-
Golconda Hostel Incident : గోల్కొండ హాస్టల్లో షాక్.. బాత్రూంలో ప్రసవం, శిశువు మృతి!
-
Off The Record: ఉదయగిరి టీడీపీలో అంతర్గత విభేదాలు? ఆయనపై అసంతృప్తి పెరుగుతోందా?
ట్రెండింగ్
-
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!
-
Kitchen Tips : చెక్క, ప్లాస్టిక్, స్టీల్.. వంటగదికి ఏ చాపింగ్ బోర్డు ఆరోగ్యకరమో తెలుసా..?
-
సూపర్కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!