Iran-Israel Tensions: ఇరాన్ సీజ్ చేసిన ఇజ్రాయిల్ నౌకలో 17 మంది భారతీయ సిబ్బంది..
Iran-Israel Tensions: ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. దీంతో మధ్యప్రాచ్యంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. సిరియా డమాస్కస్లోని ఇరాన్ ఎంబసీపై ఇటీవల ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేసి , ఇరాన్ అగ్రశ్రేణి మిలిటరీ కమాండర్తో పాటు ఆరుగురు సైనిక అధికారులను హతమార్చింది. అప్పటి నుంచి ఇరాన్ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. వచ్చే 24 గంటల్లో ఏ క్షణానైనా ఇరాన్, ఇజ్రాయిల్పై నేరుగా దాడి చేసే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఎలాంటి దాడినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రకటించారు.
ఇదిలా ఉంటే తాజాగా ఈ రోజు ఇరాన్, ఇజ్రాయిల్కి చెందిన కార్గో షిప్పై హర్ముజ్ జలసంధి వద్ద దాడి చేసింది. MSC ఏరీస్ అనే జియోనిస్ట్(ఇజ్రాయిల్)కి చెందిన కంటైనర్ షిప్ని స్వాధీనం చేసుకున్నామని, దాన్ని ఇరాన్ ప్రాదేశిక జలాల వైపు మళ్లించామని ఇరాన్ స్టేట్ టీవీ తెలిపింది. ఈ పరిణామాలకు తీవ్ర మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇజ్రాయిల్, ఇరాన్ని హెచ్చరించింది.
Also Read
- RBI Gold Reserves: భారత్కు రాబోతున్న 104 టన్నుల బంగారం.. కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ
- Himanta Sarma: హిమంత వ్యాఖ్యలతో బంగ్లాదేశ్లో కలకలం..
- UAE: 48 గంటల్లో దేశం విడిచి వెళ్లండి.. పాకిస్తానీ ఉద్యోగులకు యూఏఈ షాక్..
- Jeffrey Epstein: ఎప్స్టీన్ మిస్టరీలో మరో ట్విస్ట్.. ఏడేళ్లుగా దాచిన 'సూసైడ్ లేటర్'.. ప్రపంచ కుబేరులకు దడ!
Read Also: Iran: ఇజ్రాయిల్ నౌకను సీజ్ చేసిన ఇరాన్.. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత..
అయితే, ఈ కార్గో నౌకలో ఉన్న మొత్తం 25 మంది సిబ్బందిలో 17 మంది భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భారతీయులు ఉన్నారని మాకు తెలుసు. మేము ఇరాన్తో భారత్ దౌత్యమార్గాల ద్వారా టచ్లో ఉందని భారతీయ పౌరుల భద్రత, సంక్షేమం, ముందస్తు విడుదల కోసం ప్రయత్నిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఓడ కంపెనీ ఇటాలియన్-స్విస్ గ్రూప్ ఎంఎస్సీ దీనిపై స్పందించింది. అందులో 25 మంది సిబ్బంది ఉన్నట్లు తెలిపింది. వారి శ్రేయస్సు కోసం ఓడను సురక్షితంగా తిరిగి వచ్చేలా చూసుకుంటున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ పరిణామాలపై ఇజ్రాయిల్ మండిపడుతోంది. ఇరాన్ ప్రపంచంలోనే అతిపెద్ద టెర్రర్ స్పాన్సర్ అని, దాని నెట్వర్క్ కేవలం ఇజ్రాయిల్, గాజా, లెబనాన్, సిరియా ప్రజలను బెదిరించదని ఇజ్రాయిల్ చెప్పింది. ఇరాన్ పాలకులు ఉక్రెయిన్, వెలుపల యుద్ధాలకు ఆజ్యం పోస్తుందని, ఇరాన్ దురాక్రమణ నుంచి రక్షించుకోవడానికి మేము సంసిద్ధతతో ఉన్నామని ప్రకటించింది. పరిస్థితిని తీవ్రతరం చేయడానికి ఇరాన్ ఇలాంటి మార్గాలను ఎంచుకుందని, దీని పర్యవసానాలు భరించాల్సి ఉంటుందని ఇజ్రాయిల్ సైనిక ప్రతినిధి డేనియల్ హగారి అన్నారు.
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!