Iran: ఇరాన్ దాడి చేస్తుందని ఇజ్రాయిల్ భయపడుతోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran: సిరియాలో దాడి చేసిన తర్వాత ఇరాన్ ఎప్పుడు దాడి చేస్తోందో అని ఇజ్రాయిల్ భయపడుతోందని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సలహాదారు యాహ్యా రహీమ్ సఫానీ అన్నారు. జియోనిస్ట్(ఇజ్రాయిల్)పూర్తి భయాందోళనతో, అప్రమత్తంగా ఉన్నారని ఆయన శనివారం వ్యాఖ్యానించారు. ఇరాన్ ఏం చేయాలనుకుంటుందో వారికి తెలియదు, కాబట్టి వారు, వారి మద్దతుదారులు భయభ్రాంతులకు గురవుతున్నారు అని ఆయన చెప్పారు. ప్రతీ రాత్రి కూడా దాడి కోసం ఇజ్రాయిల్ వేచిచూస్తోందని అన్నారు. ‘‘ఈ మానసిక, మీడియా, రాజకీయ యుద్ధం ఇజ్రాయిల్కి యుద్ధం కన్నా భయకరంగా ఉంది. ఎందుకంటే వారు ప్రతీ రాత్రి దాడి కోసం ఎదురుచూస్తున్నారు. వారిలో చాలా మంది పారిపోయి షెల్టర్లకు వెళ్లారు’’ అని సఫానీ అన్నారు.
Read Also: Asaduddin Owaisi: తమిళనాడులో కొత్త పొత్తు.. అన్నాడీఎంకేతో జతకట్టిన ఎంఐఎం
Also Read
- Cannes: కేన్స్ ఫెస్టివల్స్లో మిస్ వెనిజులా 2025పై దాడి.. ముఖం రక్తసిక్తం.. ఫొటోలు వైరల్
- Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
- Cockroach Trend Goes Global: పాకిస్థాన్కు చేరిన బొద్దింకల ట్రెండ్.. పాక్లో "కాక్రోచ్" పేరుతో కొత్త పార్టీలు..
- Chinese Alcohol: బీరు కాదు.. విస్కీ అసలే కాదు.. చైనీస్ శతాబ్దాలుగా తాగే మద్యం ఏంటి? దాని ప్రత్యేక ఏంటి?
ఏప్రిల్ 1న సిరియా డమాస్కస్లోని ఇరాన్ ఎంబసీపై ఇజ్రాయిల్ వైమానిక దాడి చేసి ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ఫ్ ఇద్దరు జనరల్స్తో సహా ఏడుగురు సభ్యులను చంపింది. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రతిజ్ఞ చేసింది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, ఈ దాడికి ఇజ్రాయిల్ బాధ్యత వహించలేదు. ఇరాన్ దాడి చేస్తుందనే వార్తల నేపథ్యంలో ఇజ్రాయిల్ దక్షిణ గాజాలోని తన సేనల్ని ఉపసంహరించుకోవడమే కాకుండా, సైన్యానికి సెలవులు రద్దు చేసింది. వైమానిక రక్షణ నిర్వహించడానికి డ్రాఫ్ట్ రిజర్వ్ సైనికులను పెంచాలని అధికారులు నిర్ణయించారు.
ఏప్రిల్ 1 నాటి సిరియా దాడిలో ఇరాన్ అత్యున్నత జనరల్ మొహమ్మద్ రెజా జాహెదీ, మహ్మద్ హదీ హాజీ రహీమిలు మరణించారు. 2020లో బాగ్దాద్ ఎయిర్పోర్టులో అమెరికా క్షిపణి దాడిలో ఇరాన్ ఖుద్స్ ఫోర్స్ చీఫ్ జనరల్ ఖాసి సులేమానిని చంపిన తర్వాత తాజాగా సిరియా దాడిలోనే ఇరాన్ తన అత్యున్నత సైనికాధికారుల్ని కోల్పోయింది. దీంతోనే ఆ దేశం ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. ఇజ్రాయిల్-హమాస్ గాజా యుద్ధం నేపథ్యంలో సిరియాపై ఇజ్రాయిల్ దాడి జరిగింది. ఇజ్రాయిల్పై అక్టోబర్ 7నాటి హమాస్ దాడిలో ఇరాన్ ప్రమేయం ఉందని ఇజ్రాయిల్ ఆరోపిస్తోంది.
తాజావార్తలు
-
SRH vs RCB: 300+ లోడింగ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కాటేరమ్మ కొడుకులు.!
-
CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
-
KTR : అసెంబ్లీ రద్దు చెయ్.. ప్రజల తీర్పు ఏంటో చూద్దాం
-
Machilipatnam: కామర్స్ లెక్చరర్ ‘కామ లీలలు’.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
-
Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్కు లేఖ..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!