ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మూలాలు భారతదేశంలోనే ఉన్నాయని తెలుసా? అది కూడా ఉత్తరప్రదేశ్లోని బారాబంకి జిల్లాలోని కింటూర్ అనే చిన్న గ్రామం నుంచి. ఇది చాలా మందికి ఆశ్చర్యం కలిగించే విషయం. ఖమేనీ తండ్రి, తాత, పూర్వీకులు భారత్లోని షియా మత స్కాలర్షిప్ కేంద్రంగా ఉండిన ఈ ప్రాంతంతో సంబంధం కలిగి ఉన్నారు. ఇది ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ చరిత్రలో ఒక ఆసక్తికరమైన లింక్. Also Read:PV Sindhu: యుద్ధం ఎఫెక్ట్.. రణరంగంగా…
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. శనివారం తొలుత ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా క్షిపణులతో విరుచుకుపడ్డాయి. ఇరాన్ అధ్యక్ష భవనంతో సహా అనేక ప్రాంతాల్లో బాంబ్ పేలుళ్లు సంభవించాయి. ఈ దాడుల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది.
బెదిరించినట్టుగానే ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టాయి. శనివారం ఇరాన్పై భీకర దాడులకు దిగాయి. టెహ్రాన్లో అధ్యక్షుడి కార్యాలయం సహా ఇరాన్ వైమానిక స్థావరాలు లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడి దాడులు ప్రారంభించాయి.
మరోసారి ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అమెరికా హెచ్చరించినట్లుగానే ఇరాన్పై యుద్ధం మొదలైంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ క్షిపణులు ప్రయోగించింది.
మధ్యప్రాచ్యంలో టెన్షన్.. టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇరాన్పై దాడి కోసం అమెరికా భారీ ప్రణాళికలు రచిస్తోంది. తమ దారికి తెచ్చుకునేందుకు అమెరికా తీవ్ర కసరత్తు ప్రారంభించింది. తాజాగా మధ్య ప్రాచ్యంలో బలగాలు మోహరింపు కోసం అగ్ర రాజ్యం భారీ ‘ఎయిర్ బ్రిడ్జి’ని ఏర్పాటు చేసింది.
మధ్యప్రాచ్యంలో మరో భీకర యుద్ధం జరగబోతుందా? సుదీర్ఘ కాలం ఉద్రిక్తలు తలెత్తబోతున్నాయా? క్షిపణి, రాకెట్, డ్రోన్ దాడులతో దద్దరిల్లబోతుందా? అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.
US-Iran Tension: ఇరాన్, అమెరికా మధ్య ఓ వైపు అణు చర్చలు జరుగుతున్నప్పటికీ, మరోవైపు ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి. ఇరాన్ అధికారులు రెండు వారాల్లో కొత్త ప్రతిపాదనతో చర్చలు జరపడానికి అంగీకరించినప్పటికీ, అమెరికా మాత్రం ఇరాన్ సమీపంలో సైన్యాన్ని మోహరిస్తూనే ఉంది.
Iran: యూఎస్, ఇరాన్ మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి. ఓ వైపు జెనీవాలో ఇరాన్, అమెరికా మధ్య జరిగిన అణు చర్చలు దాదాపు మూడు గంటలకే ముగిసిన తర్వాత ఇరాన్ హర్ముజ్ జలసంధిలో క్షిపణుల్ని ప్రయోగించింది. మంగళవారం సైనిక కసరత్తుల కోసం వ్యూహాత్మక జలసంధిని పాక్షికంగా మూసేసింది. జెనీవాలో జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి ఉందనే విషయాలు బయటకు రాలేదు.
అమెరికా-ఇరాన్ మధ్య మంగళవారం కీలక చర్చలు జరగనున్నాయి. మరోసారి అణు ఒప్పందంపై రెండు దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఇరు దేశాల మధ్య మంగళవారం చర్చలు జరగనున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఓ రేంజ్లో ఉద్రిక్తతలు తలెత్తాయి. ఏ క్షణంలోనైనా ఇరాన్పై అమెరికా దాడి చేయొచ్చని వార్తలు వచ్చాయి. అణు ఒప్పందం చేసుకోకపోతే దాడులు జరుగుతాయని ట్రంప్ పదే పదే వార్నింగ్లు ఇస్తూ వచ్చారు. అయితే తొలుత ఇరాన్ మొండికేసింది. ఇప్పుడు ఏమైందో.. ఏమో తెలియదు గానీ మెత్తబడినట్లుగా తెలుస్తోంది.