ఇరాన్లో నకిలీ ఉద్యోగ ఆఫర్లపై జాగ్రత్తగా ఉండాలంటూ భారతీయులకు కేంద్రం హెచ్చరించింది. క్రిమినల్ ముఠాలు తప్పుడు ఉద్యోగ హామీలతో వ్యక్తులను ఆకర్షించి కిడ్నాప్లకు పాల్పడుతున్నారని పేర్కొంది. ఇలాంటి తప్పుడు ప్రకటనలకు భారతీయులెవరూ బలికావొద్దని.. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని భారత విదేశాంగ కోరింది.
హౌతీయుల లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకరదాడులు చేసింది. యెమెన్ రాజధాని సనాలో అధ్యక్ష భవనం సమీపంలో ఇంధన గిడ్డంగి, రెండు విద్యుత్ కేంద్రాలు లక్ష్యంగా ఐడీఎఫ్ దాడి చేసింది.
అమెరికా, ఇజ్రాయెల్కు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. మరోసారి దాడి జరిగితే భారీ స్థాయిలో ఎదురుదాడి జరగడం ఖాయమని వార్నింగ్ ఇచ్చారు.
ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ హత్యకు ఇజ్రాయెల్ కుట్ర పన్నిందని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అనుబంధ ఫార్స్ న్యూస్ ఏజెన్సీ ఆదివారం నివేదించింది. జూన్ 13న ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులకు తెగబడింది. అణు స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది.
Iran Warns Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టార్గెట్గా ఇరాన్ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ట్రంప్ ఫ్లోరిడా నివాసం సేఫ్ కాదని.. అధ్యక్షుడు సన్బాత్ చేస్తున్న సమయంలో ఒక డ్రోన్ ట్రంప్ను ఢీకొట్టే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చారు.
Pakistan: పాకిస్తాన్ తన నీచబుద్ధిని పోనిచ్చుకోవడం లేదు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు 26 మంది అమాయకుల్ని చంపారనేది సుస్పష్టం. అయినా కూడా, ఆ దేశ నాయకత్వం తమ తప్పు లేదని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. అజర్బైజాన్ వేదికగా జరిగిన ఆర్థిక సహకార సంస్థ(ఈసీఓ) శిఖరాగ్ర సమావేశంలో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును దేవుని శత్రువులుగా పరిగణిస్తూ ఇరాన్లోని ప్రముఖ షియా మతాధికారి అయతుల్లా నాజర్ కమరెం షిరాజీ ఫత్వా జారీ చేశారు. వీరికి వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలంతా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా వీరిద్దరికి ఏ ముస్లిం నాయకులు కూడా మద్దతు ఇవ్వొద్దని ఫత్వాలో పేర్కొన్నారు.
Israel Iran Conflict: ఇటీవల ఇజ్రాయిల్ ‘‘ఆపరేషన్ రైజింగ్ లయన్’’ పేరుతో ఇరాన్ అణు కార్యక్రమాలపై వైమానిక దాడులు నిర్వహించింది. అణు ఫెసిలిటీలపై దాడులతో పాటు అణు శాస్త్రవేత్తలను, సైనిక కమాండర్లను హతమార్చింది. దాదాపుగా అత్యున్నత స్థాయిలో ఉన్న 60 మందిని టార్గెటెడ్ దాడుల్లో చంపేసింది.
అమెరికా-ఇరాన్ మధ్య ప్రస్తుతం మాటల యుద్ధం సాగుతోంది. నిన్నామొన్నటి దాకా క్షిపణులతో దాడులు చేసుకోగా.. తాజాగా వార్నింగ్లు ఇచ్చుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఇరాన్ హెచ్చరించింది.