అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబ్ పేల్చారు. ఇటీవల చెప్పినట్టుగానే.. కలప, ఫర్నిచర్పై సుంకాల మోత మోగించారు. కలపపై 10 శాతం.. కిచెన్ క్యాబినెట్లు, అప్హోల్స్టర్డ్ ఫర్నిచర్పై 25 శాతం సుంకాలను విధించారు. ఈ సుంకాలు అక్టోబర్ 14 నుంచి అమల్లోకి రానున్నాయి. అమెరికా జాతీయ భద్రత, దేశీయ తయారీని పెంచడంలో భాగంగా ట్రంప్ టారిఫ్లను వరుసగా పెంచుతున్నారు. కిచెన్ క్యాబినెట్, బాత్రూమ్ పరికరాలు, అప్హోల్స్టర్డ్ ఫర్నిచర్, భారీ ట్రక్కులపై భారీ సుంకాలు విధిస్తానంటూ ఇటీవల…
India At UN: ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అబద్ధాలకు భారత్ ధీటుగా బదులిచ్చింది. నిన్న యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో షరీఫ్ మాట్లాడుతూ.. తాము ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ను ఓడించామని ప్రగల్భాలు పలికారు. ట్రంప్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణకు పాకిస్తాన్ అంగీకరించిందని చెప్పుకొచ్చారు. ట్రంప్ శాంతి కాముకుడని, ఆయనకు నోబెల్ బహుమతి ఇవ్వాలని పాకిస్తాన్ ప్రతిపాదించింది. హిందుత్వ ఉగ్రవాదం ప్రపంచానికి ప్రమాదకరమని అసత్యాలను ప్రచారం చేశాడు.
USA: పాకిస్తాన్కు పెద్ద ఎదురుదెబ్బ తాకింది. పాకిస్తాన్లో చమురు నిల్వలు ఉన్నాయంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత నెలలో ప్రకటన చేశాడు. పాకిస్తాన్లో బిలియన్ల విలువైన నిల్వలు ఉన్నాయని చెప్పాడు. అయితే, ఇప్పుడు అమెరికా ఇంధన కార్యదర్శి క్రిస్ రైట్, ట్రంప్ వాదనలకు విరుద్ధంగా ప్రకటన చేశారు. పాకిస్తాన్లో చమురు నిల్వలను అన్వేషించడంలో అమెరికాకు ఆసక్తి లేనది చెప్పాడు. Read Also: RBI Digital Payment Rules: యూజర్స్ కు అలర్ట్.. డిజిటల్ చెల్లింపులపై ఆర్బీఐ…
H-1B Visa Row: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసా రుసుమును $100,000 (రూ. 88 లక్షలు)కు పెంచడం ఒక్కసారిగా భారతీయ టెక్కీలో ఆందోళన నింపింది. తమ అమెరికన్ డ్రీమ్స్ను ట్రంప్ కాలరాస్తున్నాడనే ఆవేదన వ్యక్తమైంది. H-1B వీసా ఫీజు పెంపు విషయం గందరగోళంగా మారుతున్న తరుణంలో మేము ఉన్నామంటూ ఓ యూరోపియన్ దేశం ముందుకు వచ్చింది. భారత టెక్కీలు తమ దేశానికి రావాలని ఆహ్వానించింది.
రాష్ట్ర హోదా కల్పించాలని లడఖ్లో నిరసనలు.. బీజేపీ ఆఫీస్ దగ్ధం రాష్ట్ర హోదాను డిమాండ్ చేస్తూ లడఖ్లో నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బుధవారం బంద్కు పిలుపునిచ్చారు. దీంతో నిరసనకారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. దీంతో నిరసనకారులకు పోలీసుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీస్ వాహనాలను ఆందోళనకారులు తగలబెట్టారు. అలాగే బీజేపీ కార్యాలయానికి కూడా నిప్పుపెట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బుధవారం ఉదయం లడఖ్లోని లేహ్…
Trump: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 80వ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగిస్తూ, భారత్, చైనాలపై విమర్శలు చేశారు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు భారత్, చైనా నిధులు ఇస్తున్నాయని మండిపడ్డారు. రష్యన్ చమురు కొనుగోలు ద్వారా ఈ రెండు దేశాలు రష్యాకు సహకరిస్తున్నాయంటూ ఆరోపణలు గుప్పించారు. భారత్, చైనాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారానే యుద్ధానికి ప్రాథమిక నిధుల్ని సమకూరుస్తోందని అన్నారు.
H-1B Visa Fee: అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్, గత వారం H-1B వీసాలపై – $100,000(రూ. 88 లక్షలు) రుసుము విధించాలనే నిర్ణయంతో ఒక్కసారిగా భారతీయ టెక్కీలు ఉలిక్కిపడ్డారు. తమ అమెరికన్ డ్రీమ్స్కు ట్రంప్ చెక్ పెట్టారని భావించారు. కొత్త నిబంధనల ప్రకారం, అమెరికాలోకి ఎంట్రీ లభించదనే భయంతో చాలా మంది విదేశీ వర్కర్లు, ముఖ్యంగా భారతీయులు ఆందోళన చెందారు. అమెరికన్ టెక్ కంపెనీలు తమ H-1B వీసాలు కలిగిన ఉద్యోగులు అమెరికా విడిచి వెళ్లొద్దని,…
Afghanistan: ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం అమెరికాకు సవాల్ విసిరింది. ట్రంప్ ప్రభుత్వం ఆఫ్ఘనిస్థాన్లోని బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలను చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై అఫ్ఘానిస్థాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. అమెరికా ప్రయత్నాలను ఒక బూటకమని పేర్కొన్నారు. అమెరికన్లకు ఆఫ్ఘన్ భూమిలో ఒక్క ముక్క కూడా లభించదని ఆయన స్పష్టం చేశారు. బాగ్రామ్ వైమానిక స్థావరం ఇప్పుడు తాలిబన్ ప్రభుత్వ నియంత్రణలో ఉందని, ఆఫ్ఘాన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక…
Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి మరోసారి అవే మాటలు వచ్చాయి. తానే ఇండియా-పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపానంటూ మరో సారి క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేశారు. ఇప్పటికే 40 కన్నా ఎక్కువ సార్లు పలు సందర్భాల్లో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 7 యుద్ధాలను ఆపినందుకు తనకు ‘‘నోబెల్ శాంతి బహుమతి’’ ఇవ్వాలని అన్నారు.
H-1B visa: H-1B visa వీసాపై డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారతీయ టెక్కీలో తీవ్ర ఆందోళన పెంచింది. వీసాల కోసం ఏకంగా USD 100,000 (రూ. 88 లక్షలు) చెల్లించాలని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ఈ నిర్ణయం అమెరికన్ డ్రీమ్ ఉన్న యువతను కంగారు పెట్టింది. ముఖ్యంగా, హెచ్1బీ వీసా కలిగిన వారిలో భారతీయులే 70 శాతం మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి.