అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ ఏడాది చాలా దూకుడుగా కనిపిస్తున్నారు. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారో.. లేదో వెనిజులా దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరికొన్ని దేశాలకు వార్నింగ్ ఇచ్చారు. ఇంకోవైపు వాణిజ్య యుద్ధంతో ఇంకొన్ని దేశాలను దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఈ మధ్య పదే పదే ట్రంప్ మాట్లాడుతూ తాను సంతోషంగా లేనని ప్రధాని మోడీకి తెలుసు అని చెప్పుకుంటూ వస్తున్నారు. గత ఏడాదంతా వాణిజ్య యుద్ధంతో ప్రపంచ దేశాలపై ట్రంప్ యుద్ధం చేయగా.. ఈ ఏడాది అందుకు భిన్నంగా వెళ్తున్నారు.
Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. తనను ‘‘సార్’’ అని సంభోదించారని ట్రంప్ అన్నారు. అపాచీ హెలికాప్టర్ల డెలివరీలపై ప్రధాని మోడీ తనను నేరుగా సంప్రదించారని చెప్పారు.
Operation Sindoor: ‘‘ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ ఫైటర్ జెట్లను కూల్చాము. భారత్ మా దెబ్బకు వణికిపోయింది.’’ అని ప్రగల్భాలు పలికిన పాకిస్తాన్ అసలు భయం ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది. భారత దాడులకు భయపడిన పాకిస్తాన్, అమెరికాను కాపాడాలని వేడుకున్నట్లు తెలుస్తోంది. తమ వైమానిక స్థావరాలు, ఉగ్రవాద శిబిరాలపై భారత్ విరుచుకుపడిన తర్వాత పాకిస్తాన్ సాయం కోసం అమెరికాకు పరిగెత్తిందని అమెరికా ప్రభుత్వ పత్రాలు తెలియజేస్తున్నాయి.
Iran Protests: వెనిజులా సైనిక చర్య నేపథ్యంలో, అమెరికా ఇరాన్లో ఏదైనా సైనిక చర్య చేపడుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే, ఇరాన్ వ్యాప్తంగా ప్రజలు తీవ్రస్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ద్రవ్యోల్భణం, నిరుద్యోగం, ప్రభుత్వంపై ఉద్యమాన్ని తీవ్రం చేస్తున్నారు. ఇప్పటికే, ఈ అల్లర్లలో 30 మందికి పైగా చనిపోయారు. మరోవైపు, బలవంతంగా ఇరాన్ ప్రభుత్వం, నిరసనకారులపై కాల్పులు జరిపితే చూస్తూ ఊరుకోబోమని అమెరికా ఇప్పటికే ప్రకటించింది.
Greenland: ఆర్కిటిక్ ద్వీపం, డెన్మార్క్ ఆధీనంలో ఉన్న ‘‘గ్రీన్ల్యాండ్’’పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కన్ను పడింది. దీనిని అమెరికాకు ఇచ్చేయాలంటూ ట్రంప్ డెన్మార్క్ను బెదిరిస్తున్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలో యూరప్ దేశాలు అన్ని ఒక్కటయ్యాయి. గ్రీన్ల్యాండ్ భవిష్యత్తును గ్రీన్ల్యాండ్, డెన్మార్క్ మాత్రమే నిర్ణయించుకోగలవని మంగళవారం యూరోపియన్ నాయకులు ప్రకటించారు.
Gustavo Petro: గత శనివారం వెనిజులాపై అమెరికా దాడులు చేసి, ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను అమెరికాకు బందీలుగా పట్టుకెళ్లారు. వీరిద్దరిపై నార్కో టెర్రరిజం, అక్రమ ఆయుధాల కేసుల్ని మోపింది. మదురో డ్రగ్స్ ముఠాకు నాయకత్వం వహిస్తున్నాడని ట్రంప్ ప్రధాన ఆరోపణ. యూఎస్లోకి పెద్ద ఎత్తున డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నాడని యూఎస్ ఆరోపిస్తోంది. ఇదిలా ఉంటే, వెనిజులాలో ఉండే చమురు, అదరుదైన ఖనిజాల కోసంమే ట్రంప్ ఈ కుట్రకు తెరదీశాడని మరికొందరు ఆరోపిస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతికర్త ఇమేజ్ను పెంపొందించుకోవడానికి ప్రయత్నించారు, కానీ ఆయన అధికారంలో ఉన్న మొదటి సంవత్సరంలో ఏడు దేశాలపై దాడికి పాల్పడ్డారు. లొకేషన్ ఆఫ్ ది ఆర్మ్డ్ కాన్ ఫ్లిక్ట్, ఈవెంట్ డేటా ప్రకారం, జనవరి 20, 2025 నుండి అమెరికా విదేశీ గడ్డపై మొత్తం 622 బాంబు దాడులు చేసింది. మే నెలలో, భారత్, పాకిస్తాన్ మధ్య వివాదంతో సహా ఎనిమిది యుద్ధాలను ఆపినట్లు ట్రంప్ పేర్కొన్నారు, కానీ భారత్ ఈ వాదనను…
USA: అమెరికా, వెనిజులాపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను బంధించి యూఎస్కు తీసుకువచ్చారు. అమెరికాలో డ్రగ్స్ సరఫరాకు కారణమవుతున్నాడని, డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు ఉన్నాయని మదురోపై కేసులు మోపబడ్డాయి. అయితే, ట్రంప్ చర్యల్ని పలు దేశాలు ఖండిస్తున్నాయి.
Kamala Harris: వెనిజులాపై అమెరికా దాడి, ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యని బంధించడంతో యావత్ ప్రపంచం ఒక్కసారిగా షాక్కు గురైంది. ఇజ్రాయిల్, అర్జెంటీనా వంటి కొన్ని దేశాలు ట్రంప్ చర్యల్ని సమర్థించగా.. చైనా, ఇరాన్, రష్యా వంటి దేశాలు యూఎస్ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాయి.