Gaza Crisis: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం తర్వాత దెబ్బతిన్న గాజాలో పాలన, పునర్నిర్మాణాన్ని పర్యవేక్షించేందుకు ఉద్దేశించిన గాజా ‘‘బోర్డ్ ఆఫ్ పీస్’’లోకి భారతదేశాన్ని ట్రంప్ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ట్రంప్ స్వయంగా ప్రధానమైన బోర్డుకు అధ్యక్షత వహిస్తుండగా, పాలస్తీనా టెక్నోక్రాట్ కమిటీ గాజా పాలన బాధ్యతల్ని చూస్తుంది, ఎగ్జిక్యూటివ్ బోర్డ్ సలహాదారు పాత్రను పోషించే మరో విభాగంగా ఉంది. 20 పాయింట్ల గాజా శాంతి ప్రణాళికలో భాగంగా జనవరి 15న ఈ బోర్డును ఏర్పాటు చేశారు.
Donald Trump: ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ దిగిపోయే సమయం వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇరాన్ వ్యాప్తంగా వారాల తరబడి ఎగిసిపడిన నిరసనల తర్వాత అమెరికా నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ‘‘ఇరాన్లో కొత్త నాయకత్వం కోసం వెతకాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని అన్నారు.
Greenland: డెన్మార్ ఆధీనంలో ఉన్న గ్రీన్ల్యాండ్ ద్వీపాన్ని బల ప్రయోగంతో సొంత చేసుకోవాలని అమెరికా భావిస్తోంది. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రీన్ల్యాండ్ను తమకు అప్పగించాలని ఒత్తిడి చేస్తున్నారు. అవసరమైతే సైనిక చర్యకు కూడా దిగుతామని హెచ్చరికలు చేశారు.
US: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రపంచ దేశాలపై టారిఫ్స్తో విరుచుకుపడుతున్నారు. ఇండియాపై ఏకంగా 50 శాతం సుంకాలు విధించారు. మరోవైపు, రేర్ ఎర్త్ ఖనిజాల కోసం పాకిస్తాన్తో డీల్ కుదుర్చుకున్నారు. ఇదిలా ఉంటే, ట్రంప్ అవలంభిస్తున్న విధానాలపై యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు, ట్రంప్ పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీ సభ్యుడు రిచ్ మెక్కార్మిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ పట్ల ట్రంప్ తీరును తప్పుపట్టారు. భారతదేశం అమెరికాలో పెట్టుబడుతుపెడుతోందని, పాకిస్తాన్ నుంచి…
గత కొద్దిరోజులుగా ఇరాన్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఇక భద్రతా దళాల కాల్పుల్లో ఇప్పటి వరకు వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
Trump Tariffs: ఇరాన్ ప్రజాతిరుగుబాటు నేపథ్యంలో, ఆ దేశంతో వాణిజ్యం చేసే దేశాలపై 25 శాతం సుంకాలను విధిస్తామని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే, ఈ నిర్ణయం భారత్పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇరాన్ టాప్-5 వాణిజ్య భాగస్వాముల్లో భారత్ ఉంది.
Trump: ప్రజా ఉద్యమంతో ఇరాన్ అట్టుడుకుతోంది. సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మతపాలనకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చారు. రాజధాని టెహ్రాన్తో పాటు అన్ని ప్రావిన్సుల్లో ప్రజాందోళన ఎగిసిపడుతోంది. ఇదిలా ఉంటే, ఈ ఉద్యమాన్ని బలవంతంగా అణిచివేసేందుకు ఖమేనీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దూకుడుగా పోతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ కలకలం రేపుతోంది. తనకు తానుగా వెనిజులా అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతోంది.
Trump: వెనిజులా దేశంపై దాడి చేసి, ఆ దేశాధ్యక్షుడి నికోలస్ మదురోను అమెరికా అరెస్ట్ చేసింది. అతడిపై నార్కో-టెర్రరిజం కేసుల్ని మోపింది. ఈ నేపథ్యంలో మరో దేశానికి యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికాతో వెంటనే ఒప్పందం చేసుకోవాలని మరో లాటిన్ అమెరికన్ దేశం క్యూబాను హెచ్చరించారు. లేకపోతే క్యూబాకు ఇకపై చమురు, ఆర్థిక సాయం ఉండదని హెచ్చరించారు. ‘‘క్యూబాకు ఇకపై చమురు, డబ్బులు ఉండవు. ఇంకా ఆలస్యం చేయకుండా అమెరికాతో వారు ఒప్పందం…
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో కిడ్నాప్ తర్వాత విలేకర్ల సమావేశంలో ట్రంప్ ఆసక్తికర వ్యా్ఖ్యలు చేశారు. మదురో మాదిరిగా పుతిన్ను కూడా భవిష్యత్లో కిడ్నాప్ చేస్తారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు.