Nobel Peace Prize: నోబెల్ శాంతి బహుమతిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు చివరకు నిరాశే ఎదురైంది. ట్రంప్ను కాదని వెనిజుల ప్రతిపక్ష నాయకురాలు కొరినో మచాడోను ‘‘నోబెల్ శాంతి బహుమతి 2025’’ వరించింది. ఆమెకు నోబెల్ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత, ఈ విషయంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు.
White House Reaction: నోబెల్ శాంతి బహుమతిని సాధించాలని పట్టుదలతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు నిరాశ ఎదురైంది. ఆయన నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకునే అవకాశాన్ని తృటిలో కోల్పోయారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తు్న్నారు. ముందు నుంచి కూడా ఆ అవార్డుకు తనను తాను బలమైన పోటీదారుగా ట్రంప్ భావించారు. అమెరికా అధ్యక్షుడికి ఈ ఏడాది నోబెల్ బహుమతి రాకపోవడంపై వైట్ హౌస్ ఘాటుగా స్పందించింది. READ ALSO: SS Rajamouli : రాజమౌళికి…
Maria Corina Machado: అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ కల చెదిరింది. వాస్తవానికి ట్రంప్కు నోబెల్ బహుమతి శాంతి బహుమతి కైవసం చేసుకోవాలనే కోరిక బలంగా ఉంది. కానీ వాస్తవానికి శుక్రవారం ఆయనను మట్టికరిపించి వెనిజులా ఉక్కు మహిళ ఈ ప్రతిష్టాత్మకమై పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు. ఇంతకీ ఈ ఉక్కు మహిళ ఘనత ఏంటి, ఆమెను నోబెల్ వరించడానికి వెనుక ఉన్న కారణాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.. READ ALSO: AP Cabinet Meeting: కేబినెట్లో మంత్రులకు…
Nobel Peace Prize 2025: ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న నోబెల్ శాంతి బహుమతి ప్రకటన శుక్రవారం వెలువడింది. ఈ అవార్డుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అగ్రరాజ్యాధినేత డోనాల్డ్ ట్రంప్కు నోబెల్ కమిటి నుంచి మొండి చెయ్యి ఎదురయ్యింది. ఇప్పుడు సోషల్ మీడియాలో పాపం ట్రంప్ అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఇంతకీ ఎవరికి ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారం వరించిందో తెలుసా.. READ ALSO: AP Cabinet Decisions: ముగిసిన ఏపీ కేబినెట్…
Trump Nobel Peace Prize: నోబెల్ శాంతి బహుమతిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఈరోజు ఈ అవార్డుకు సంబంధించి ప్రకటన రానున్న నేపథ్యంలో ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Nobel Peace Prize 2025: తనను తాను పీస్ ప్రెసిడెంట్గా పిలుచుకునే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. నోబెల్ శాంతి బహుమతి తనకే వస్తుందని గట్టి నమ్మకంగా ఉన్నాడు. నార్వేలోని ఓస్లోలో నార్వేజియన్ కమిటీ ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి గ్రహీత పేరును నేడు ప్రకటించనుంది. 338 మంది వ్యక్తులు, సంస్థలు ఈ బహుమతికి నామినేట్ అయ్యారు. అయితే, వీరిలో డొనాల్డ్ ట్రంప్కు ఈ గౌరవం దక్కుతుందా లేదా అన్నదానిపైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది. చాలా…
PM Narendra Modi: ప్రధాని నరేంద్రమోడీ, యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడారు. ఇజ్రాయిల్-హమాస్ మధ్య గాజా శాంతి ఒప్పందం కుదరడంపై మోడీ, ట్రంప్కు అభినందనలు తెలిపారు. భారతదేశం-అమెరికా వాణిజ్యంపై ఇరువురు నేతలు చర్చించారు.
UK PM: భారత ఆర్థిక వ్యవస్థ 2028 నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని యూకే ప్రధాని కీర్ స్టార్మర్ అన్నారు. భారత్ ఈ స్థాయికి చేరుకునే మార్గంలో ఉందని ఆయన అన్నారు. యూకే ప్రధాని వ్యాఖ్యలు, ట్రంప్ ‘‘డెడ్ ఎకానమీ’’ వ్యాఖ్యలకు కౌంటర్గా ఉన్నాయి. భారత్ ఇటీవలే జపాన్ను అధిగమించి నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది.
Israel Hamas Peace Deal: ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఒప్పందంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. తాజాగా ట్రంప్ ఫాక్స్ న్యూస్ హోస్ట్ సీన్ హన్నిటీకి ఇచ్చిన ఫోన్ కాల్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన నెతన్యాహుతో తన సంభాషణను గుర్తు చేసుకున్నారు. బందీల విడుదల, గాజా కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటన తర్వాత అందరూ “ఇజ్రాయెల్ను మళ్ళీ ప్రేమిస్తున్నారని” ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు…
Israel-Hamas Peace Deal: ఇజ్రాయెల్- హమాస్ మధ్య కుదిరిన గాజా శాంతి ఒప్పంద ప్రణాళిక మొదటి దశ ఒప్పందాన్ని భారతదేశం స్వాగతించింది. ఈ ఒప్పందం ఇజ్రాయెల్ బందీల విడుదలతో పాటు కొన్ని ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ సైన్యాల ఉపసంహరణకు అవకాశం ఉంది.