US Travel Ban: 30కి పైగా దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించిన ట్రంప్!
- 30 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించిన డొనాల్డ్ ట్రంప్..
- 15 దేశాలకు చెందిన పౌరులపై పాక్షిక ఆంక్షలు విధించిన యూఎస్..
- డొనాల్డ్ ట్రంప్ ప్రయాణ విధానంపై మరోసారి అంతర్జాతీయంగా చర్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Travel Ban: ప్రభుత్వం ప్రయాణ నిషేధాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరింత కఠినతరం చేశారు. తాజాగా మరో ఐదు దేశాల పౌరులపై పూర్తిస్థాయి ప్రయాణ నిషేధాన్ని అమలు చేయడంతో.. పాలస్తీనా అథారిటీ జారీ చేసిన పత్రాలతో ప్రయాణించే వారికి పూర్తిగా ప్రవేశంపై బ్యాన్ విధించింది. అలాగే, మరో 15 దేశాల పౌరులపై పాక్షిక పరిమితులు విధించింది. ఇప్పటి వరకు మొత్తం 30కి పైగా దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించినట్లు మంగళవారం వైట్ హౌస్ అధికారికంగా ప్రకటించింది.
Read Also: Egg Quality : ఆడవారిలో అండాల నాణ్యత పెంచే అద్భుతమైన ఆహారాలు!
Also Read
- Trump: భారత్ విద్యార్థులకు బిగ్ షాక్.. ట్రంప్ కొత్త స్టూడెంట్ వీసా నిబంధనలివే!
- UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
- Pakistan: పాక్లో 5వ రాష్ట్రంగా గిల్గిట్-బాల్టిస్తాన్.. భారత్ను కవ్వించే చర్య..
- US-Iran War: తగ్గేది లేదంటున్న ఇరాన్.. మధ్యవర్తులు ఖతార్, పాక్లను వదలడం లేదు..
దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని అమెరికా ప్రవేశ ప్రమాణాలను మరింత కఠినతరం చేస్తున్నట్లు వైట్ హౌస్ పేర్కొంది. కొన్ని దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై సరైన సమాచారం లేకపోవడం వల్ల భద్రతాపరమైన ముప్పు ఉందని అమెరికా అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే జూన్లో ట్రంప్ ప్రభుత్వం 12 దేశాల పౌరులకు యూఎస్ ప్రవేశంపై నిషేధం విధించింది. అదే సమయంలో మరో ఏడు దేశాలపై కఠినమైన వీసా, స్క్రీనింగ్ పరిమితులు అమలు చేసింది. ఆ జాబితాలో అఫ్గానిస్తాన్, మయన్మార్, చాద్, కాంగో రిపబ్లిక్, ఈక్వేటోరియల్ గినియా, ఎరిట్రియా, హైటి, ఇరాన్, లిబియా, సోమాలియా, సుడాన్, యెమెన్ ఉన్నాయి. అలాగే, బురుండి, క్యూబా, లావోస్, సియెర్రా లియోన్, టోగో, తుర్క్మెనిస్తాన్, వెనిజులా దేశాలపై పాక్షిక ఆంక్షలను విధించారు.
Read Also: Boyapati Srinu: నా భయం అంతా అభిమానుల గురించే!
కొత్తగా పూర్తిస్థాయి నిషేధంలోకి వచ్చిన దేశాలు
తాజాగా, బుర్కినా ఫాసో, మాలి, నైజర్, దక్షిణ సుడాన్, సిరియా దేశాల పౌరులపై పూర్తిస్థాయి ప్రయాణ నిషేధాన్ని విస్తరించింది. దీని వల్ల ఆయా దేశాల ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రత్యేక అనుమతులు ఇస్తామని యూఎస్ అధికారులు తెలిపారు. ఈ దేశాల్లో అవినీతి, నకిలీ పౌర పత్రాలు, సరైన క్రిమినల్ రికార్డుల వంటి అంశాలు అమెరికా భద్రతా తనిఖీలను బలహీనపరుస్తున్నాయని వైట్ హౌస్ వెల్లడించింది. అలాగే, వీసా గడువు ముగిసిన తరువాత కూడా అమెరికాలోనే ఉండిపోవడం, తమ పౌరులను తిరిగి తీసుకెళ్లకపోవడంలో ప్రభుత్వాలు సహకరించకపోవడం లాంటి కారణాలనూ ప్రస్తావించింది.
ఇక, ఈ నిర్ణయాలతో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రయాణ విధానం మరోసారి అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. భద్రత పేరుతో తీసుకున్న ఈ చర్యలు మానవ హక్కులు, వలస విధానాలపై ప్రభావం చూపనున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Pallaburusu: టూత్బ్రష్తో జిల్లా కోర్టులో లీగల్ ఫైట్?
-
Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి భారతే కారణం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు..
-
Trump: భారత్ విద్యార్థులకు బిగ్ షాక్.. ట్రంప్ కొత్త స్టూడెంట్ వీసా నిబంధనలివే!
-
6500mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే , 90W ఛార్జింగ్.. ఐఫోన్ 17 ప్రో మాక్స్ లా కనిపించే ఫోన్..
-
ENG Vs IND, 3rd ODI : టీమిండియాకు మరో బిగ్ షాక్.. మూడో వన్డేకు స్టార్ ప్లేయర్ దూరం..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?