Trump-Modi: భారత్పై గురి.. భారీగా సుంకాలు పెంచే యోచనలో ట్రంప్!
- భారత్పై ట్రంప్ గురి
- శిక్షించే బిల్లుకు గ్రీన్సిగ్నల్
- భారీగా పెరగనున్న సుంకాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య పదే పదే ట్రంప్ మాట్లాడుతూ తాను సంతోషంగా లేనని ప్రధాని మోడీకి తెలుసు అని చెప్పుకుంటూ వస్తున్నారు. గత ఏడాదంతా వాణిజ్య యుద్ధంతో ప్రపంచ దేశాలపై ట్రంప్ యుద్ధం చేయగా.. ఈ ఏడాది అందుకు భిన్నంగా వెళ్తున్నారు. కొత్త సంవత్సరం ప్రారంభంలోనే వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను కిడ్నాప్ చేసి అమెరికాకు తీసుకెళ్లిపోయారు. అనంతరం గ్రీన్లాండ్, కొలంబియా, క్యూబా దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఇదే క్రమంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీపై కూడా ట్రంప్ గురి పెట్టినట్లు తెలుస్తోంది. ఖబడ్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: US: అమెరికాలో దారుణం.. మహిళను కాల్చి చంపిన ఇమ్మిగ్రేషన్ ఏజెంట్
Also Read
ఇదంతా ఒకెత్తు అయితే తాజాగా భారత్, చైనాపై కూడా ట్రంప్ ప్రత్యేక గురి పెట్టారు. రష్యా దగ్గర చమురు కొనుగోలు చేయొద్దని ఇప్పటికే ట్రంప్ హెచ్చరించారు. కానీ భారత్, చైనా మాత్రం రష్యా దగ్గర చమురు కొనుగోలు ఆపలేదు. ఈ క్రమంలో రెండు దేశాలను శిక్షించే బిల్లుకు ట్రంప్ గ్రీన్సిగ్నల్ ఇచ్చేశారు. బుధవారం జరిగిన ఉత్పాదక సమావేశం (Productive Meeting) తర్వాత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త ఆంక్షల బిల్లును ఆమోదించారని.. వచ్చే వారం ప్రారంభంలోనే దీనిపై ఓటింగ్ జరగవచ్చని రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Hyderabad: బర్త్డే పార్టీ మిగిల్చిన విషాదం.. ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మృతి..
రష్యా నుంచి ఉద్దేశ పూర్వకంగా చమురు కొనుగోలు చేసే దేశాలను శిక్షించేందుకే ద్వైపాక్షిక ఆంక్షల బిల్లుకు ట్రంప్ ఆమోదం తెలిపారు. వచ్చే వారం బిల్లు ఆమోదం పొందితే మాత్రం భారతదేశం, చైనా, బ్రెజిల్ దేశాలపై భారీ ఎత్తున సుంకాలు పడే అవకాశం ఉంది. అంటే భారతదేశంపై ఏకంగా 500 శాతం వరకు సుంకం పెరగవచ్చు. ఇప్పటికే 50 శాతం సుంకం విధించడంతో అమెరికాతో భారత్ సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఏకంగా 500 శాతం సుంకం విధిస్తే రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిననున్నాయి.
ఈ కొత్త బిల్లును రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం, డెమోక్రటిక్ సెనేటర్ రిచర్డ్ బ్లూమెంటల్ స్పాన్సర్ రూపొందించారు. ఈ చట్టానికి తాజాగా ట్రంప్ గ్రీన్సిగ్నల్ ఇచ్చేశారు. వచ్చే వారమే దీనిపై ఓటింగ్ జరగనుంది. ఒకవేళ బిల్లు పాస్ అయితే మాత్రం భారత్, చైనా, బ్రిజిల్పై భారీ స్థాయిలో సుంకాలు పడనున్నాయి.
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే పలుమార్లు చర్చలు జరిపినా ఫలితం ఇవ్వలేదు. ఇటీవల శాంతి చర్చలు ఫలించినట్టే.. ఫలించి మళ్లీ స్తబ్దత నెలకొంది. ఇక ఈ క్రమంలోనే రష్యా దగ్గర భారత్, చైనా చమురు కొనుగోలు చేయడం వల్లే పుతిన్ యుద్ధాన్ని ఆపడం లేదని ట్రంప్ పదే పదే చెప్పుకుంటూ వచ్చారు. తక్షణమే రష్యా దగ్గర చమురు కొనుగోలు నిలిపివేయాలని భారత్కు సూచించారు. కానీ ట్రంప్ హెచ్చరికలను భారత్ ఖాతర్ చేయలేదు. ఈ నేపథ్యంలో మాట వినని దేశాలను శిక్షించేందుకు బిల్లుకు తీసుకు వస్తున్నారు. దీనిపై భారత్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
After a very productive meeting today with President Trump on a variety of issues, he greenlit the bipartisan Russia sanctions bill that I have been working on for months with Senator Blumenthal and many others.
This will be well-timed, as Ukraine is making concessions for peace…
— Lindsey Graham (@LindseyGrahamSC) January 7, 2026
తాజావార్తలు
-
Telangana Auto, Cab Strike: అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్స్ బంద్..
-
IND vs SL 2nd Test: 33 ఏళ్ల సారాంశ్ జైన్ అరంగేట్రం.. కుల్దీప్ యాదవ్ ఆడకపోవడానికి కారణం ఫామ్ కాదు!
-
David Reddy: మంచు మనోజ్ సినిమాలో శింబు.. అన్నయ్యగా స్పెషల్ రోల్?
-
Neha Pachisia: నేహా పచిసియా ఎవరు? ఎయిర్ హోస్టెస్ నుంచి పోలీస్ అధికారిణిగా.. ఇప్పుడు సస్పెన్షన్ ఎందుకు?
-
Anil RaviPudi : ‘జనవరి 12 విడుదల’లో స్పెషల్ సాంగ్.. మాస్ ఫ్యాన్స్కు పూనకాలే
ట్రెండింగ్
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!