రాజధాని ఢిల్లీలోని ఢిల్లీ గేట్ ప్రాంతంలో పెను ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారు మొదట టాటా పంచ్ కారును ఢీకొట్టి డివైడర్ను ఢీకొట్టింది. అదృష్టవశాత్తూ.. ఈ ఘటనలో పెద్దగా ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. అయితే బీఎండబ్ల్యూ కారు మాత్రం తీవ్రంగా దెబ్బతింది. టాటా పంచ్ కారు స్వల్పంగా దెబ్బతింది.
Supreme Court: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యంతో ప్రజలు నిత్యం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాలుష్య నియంత్రణకు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-4 నిబంధనలు విధించడంతో.. ప్రస్తుతం సత్ఫలితాలు ఇచ్చింది. దీంతో జీఆర్ఏపీ-4 ఆంక్షల సడలింపుకు అత్యున్నత న్యాయస్థానం పర్మిషన్ ఇచ్చింది.
EV adoption: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల(EV) స్వీకరణ పెరుగుతోంది. రానున్న కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య దేశవ్యాప్తంగా మరింత పెరిగే అవకాశం ఉందని FICCI-యెస్ బ్యాంక్ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా ఈవీ స్వీకరణలో ఢిల్లీ టాప్ ప్లేస్లో ఉన్నట్లు చెప్పింది. ఢిల్లీలో ఈవీ పెనట్రేషన్ రేటు 11.5 శాతంగా ఉందని, వివిధ విభాగాల్లో ఈవీలను అడాప్ట్ చేసుకుంటున్నట్లు నివేదిక హైలెట్ చేసింది.
పార్లమెంట్ను ముట్టడించేందుకు వేలాది మంది రైతులు ఇవాళ ఢిల్లీకి పాదయాత్ర చేయనున్నారు. ప్రస్తుతం ఈ రైతులు నోయిడాలో ఏకమయ్యారు. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అక్కడ 5000 మంది సైనికులను మోహరించారు. రైతుల పాదయాత్రతో నోయిడాలో చాలా చోట్ల జామ్ ఏర్పడింది. మహామాయ ఫ్లైఓవర్ కింద రైతులు ఏకం అయ్యేందుకు ప్లాన్ చేశారు. మరోవైపు పోలీసులు ఎక్కడికక్కడ నిఘా కొనసాగిస్తున్నారు. పలు మార్గాలను దారి మళ్లించారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు సోమవారం సాయంత్రం 4 గంటలకు ‘ది సబర్మతి రిపోర్ట్’ చిత్రాన్ని వీక్షించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రధాని ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రంలో విక్రాంత్ మాస్సే ప్రధాన పాత్రలో నటించారు. గుజరాత్లోని గోద్రా ఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. న్యూఢిల్లీలోని బాలయోగి ఆడిటోరియంలో ప్రధానమంత్రి ఈ చిత్రాన్ని వీక్షిస్తారు.
Arvind Kejriwal: ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్పై ఓ వ్యక్తి దాడికి ప్రయత్నించాడు. లిక్విడ్ పోసేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకుంది. అయితే ముఖ్యమంత్రి పదవిపై మాత్రం పంచాయితీ వీడలేదు. ఏక్నాథ్ షిండేను తిరిగి ముఖ్యమంత్రిని చేయాలంటూ శివసేన డిమాండ్ చేస్తోంది.
Japanese Encephalitis: అత్యంత ప్రమాదకరమైన బ్రెయిన్ ఇన్ఫెక్షన్లలో ‘‘జననీస్ ఎన్సెఫాలిటిస్)(JE)’’ ఒకటి. సాధారణంగా ‘‘మెదడు వాపు’’ వ్యాధిగా పిలిచే ఈ ప్రాణాంతకమైన వ్యాధి 13 ఏళ్ల తర్వాత ఢిల్లీలో కనిపించింది. దశాబ్ధం తర్వాత మొదటి కేసు నమోదైనట్లు మున్సిపల్ ఆరోగ్య విభాగం గురువారం వెల్లడించింది.పశ్చిమ ఢిల్లీలోని బిందాపూర్కు చెందిన 72 ఏళ్ల వ్యక్తికి ఈ వ్యాధి సోకినట్లు సమాచారం. నవంబర్ 3న ఛాతీ నొప్పి రావడంతో ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చేరారు.
ఢిల్లీలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో పాల్గొన్న అనంతరం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణలో అభివృద్ధిని అడ్డుకోవడానికి బీఆర్ఎస్ నేతలకు సిగ్గు ఉండాలని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ఎంపీల అటెండెన్స్ కూడా రాజ్యసభలో కనిపించడం లేదని తెలిపారు.
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ రాజధానిలో శాంతిభద్రతల పరిస్థితిపై ప్రశ్నలు లేవనెత్తారు. కేంద్రంపై విరుచుకుపడ్డారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ఏడాదిన్నర కాలంలో ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితి దిగజారిందన్నారు. రాజధానిలో మహిళలపై జరుగుతున్న గ్యాంగ్ వార్, దోపిడీ, నేర ఘటనలు హృదయాన్ని కలచివేస్తున్నాయని ఆవేదన చెందారు.