LIC New Children Money Back Plan: రోజుకు రూ.150 పెట్టుబడి అంతే.. రూ.19 లక్షలు మీసొంతం.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LIC New Children Money Back Plan: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అఫ్ ఇండియా (LIC) సంస్థ వివిధ ఆదాయ వర్గాల ప్రజల కోసం అనేక పెట్టుబడి, బీమా పథకాలను అందిస్తోంది. ఈ పథకాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా భద్రతతో పాటు పొదుపు ప్రయోజనాలు లభిస్తాయి. అందుకే చాలా మంది ప్రజలు LICను విశ్వసనీయమైన పెట్టుబడిగా ఎన్నుకుంటారు. ఇకపోతే.. మీ పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటే, ఎల్ఐసీ న్యూ చిల్డ్రన్ మనీ బ్యాక్ ప్లాన్ (LIC New Children Money Back Plan) మంచి ఎంపిక అవుతుంది. ఈ పథకంలో క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే కాలక్రమేణా మంచి మొత్తాన్ని అందుకోవచ్చు.
Work From Home: వంట గ్యాస్ ఎఫెక్ట్.. ఉద్యోగస్థులకు వర్క్ ఫ్రం హోం ఆఫర్ చేసిన టాప్ టెక్ దిగ్గజం..
Also Read
- Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి 'మేడ్ ఇన్ ఇండియా' మిలిటరీ విమానం..
- Women's T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
- Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన 'హిందూ గ్రోత్ రేట్' అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
- Rohit Sharma: అఫ్గానిస్థాన్ సిరీస్తో రీఎంట్రీ.. అరుదైన రికార్డులపై ‘హిట్మ్యాన్’ గురి.!
ఈ పథకంలో ఓ వ్యక్తి రోజుకు రూ.150 లేదా నెలకు దాదాపు రూ.4,500 పెట్టుబడి పెడితే దీర్ఘకాలంలో మంచి మొత్తాన్ని అందుకుకోవచ్చు. అది ఎలాగంటే.. రోజుకు రూ.150 పెడితే సంవత్సరానికి సుమారు రూ.55,000 పెట్టుబడి అవుతుంది. ఈ పెట్టుబడిని 25 సంవత్సరాల పాటు కొనసాగిస్తే మొత్తం పెట్టుబడి సుమారు రూ.14 లక్షల వరకు చేరుతుంది.
ఈ పాలసీ మెచ్యూర్ సమయంలో లభించే బోనస్, ఇతర ప్రయోజనాలు కలిపి ఈ మొత్తం రూ.19 లక్షల వరకు పొందే అవకాశం ఉంది. ఈ మొత్తం పిల్లల ఉన్నత విద్య లేదా వివాహం వంటి ముఖ్యమైన అవసరాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ప్లాన్ ఓ నాన్-లింక్డ్, పార్టిసిపేటింగ్ పాలసీ. ఈ పథకంలో పిల్లల వయస్సు 0 నుంచి 12 సంవత్సరాల మధ్య ఉన్నప్పుడు ఎప్పుడైనా పెట్టుబడి ప్రారంభించవచ్చు. ఇందులో ప్రీమియం చెల్లించడానికి అనేక ఎంపికలు ఉన్నాయి. పెట్టుబడిదారులు నెలవారీ, త్రైమాసిక, అర్ధ వార్షిక లేదా వార్షిక ప్రీమియం చెల్లించవచ్చు. దీంతో వ్యక్తులు తమ ఆదాయం, బడ్జెట్ కు అనుగుణంగా చెల్లింపు విధానాన్ని ఎంచుకోవచ్చు.
Ugadi 2026: పరాభవ నామ సంవత్సరంలో మీ ఆదాయం ఎంత.? ఎవరికి లాభం.. ఎవరికి నష్టం.?
ఈ పథకంలో ప్రత్యేకత ఏమిటంటే.. పిల్లల వయస్సు పెరిగే కొద్దీ కొన్ని దశల్లో మనీబ్యాక్ ప్రయోజనాలు లభిస్తాయి. పిల్లవాడు 18, 20, 22 సంవత్సరాలు నిండినప్పుడు సమ్ అష్యూర్డ్ లో 20 శాతం చొప్పున తిరిగి చెల్లిస్తారు. అనంతరం 25 సంవత్సరాలు నిండినప్పుడు మిగిలిన 40 శాతం మొత్తాన్ని బోనస్తో కలిపి చెల్లిస్తారు. ఈ పథకంలో కనిష్ట సమ్ అష్యూర్డ్ రూ.1 లక్ష. అయితే గరిష్ట పెట్టుబడికి ఎలాంటి పరిమితి లేదు. పెట్టుబడిదారులు తమ ఆర్థిక సామర్థ్యాన్ని బట్టి ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పాలసీ మొత్తం కాలపరిమితి 25 సంవత్సరాలు ఉంటుంది.
తాజావార్తలు
-
Aluminium Foil: చైనాకు భారత్ గట్టి దెబ్బ! ఈ లోహంపై యాంటీ-డంపింగ్ సుంకం పొడిగింపు..’మేక్ ఇన్ ఇండియా’కు బలం
-
Jagapathi Babu : ‘పెద్ది’ని దించాలని కొందరు ఇడియట్స్ ప్రయత్నించారు.. ట్రోలర్స్ కి జగ్గూ భాయ్ స్ట్రాంగ్ కౌంటర్
-
Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి ‘మేడ్ ఇన్ ఇండియా’ మిలిటరీ విమానం..
-
EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా.. EPF అందించే ఈ ప్రయోజనం గురించి తెలుసా?
-
Women’s T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!