Supreme Court: టెర్రర్ ఫండింగ్ కేసులో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం.. కశ్మీర్ వేర్పాటువాదికి బెయిల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కశ్మీర్ వేర్పాటు వాది షబీర్ అహ్మద్ షాకు దేశ అత్యున్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. దాదాపు ఆరేళ్లు జైలు జీవితం గడిపి షాకు ఊరట లభించినట్లయింది. షబీర్ అహ్మద్ షాపై 2017 కేసు నమోదైంది. కానీ.. జాతీయ దర్యాప్తు సంస్థ 2019లో అరెస్టు చేసింది. కశ్మీర్ ప్రాంతంలో వేర్పాటు కార్యకలాపాలకు నిధులు సమకూర్చినట్లు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. బెయిల్ మంజూరుకు ముందు.. న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతా ఉన్న ద్విసభ్య ధర్మాసనం సుదీర్ఘ వాదనలు విన్నది. షా తరఫున వాదించిన న్యాయవాది ఆయనపై మొదట దర్యాప్తు సంస్థ దాఖలు చేసిన ప్రధాన అభియోగ పత్రంలో పేరు లేదని కోర్టుకు తెలిపారు. తరువాత అదనపు అభియోగ పత్రంలో మాత్రమే నిందితుడిగా చేర్చినట్లు వెల్లడించారు. ఇప్పటికే ఆరు సంవత్సరాలకుపైగా జైలులో ఉన్నారని, కేసులో నాలుగు వందలకుపైగా సాక్షులను విచారించాల్సి ఉన్నందున విచారణ త్వరగా పూర్తయ్యే అవకాశం లేదని కోర్టుకు తెలిపారు. మరోవైపు.. దర్యాప్తు సంస్థ తరఫు లాయర్ ఈ కేసులో షబీర్ అహ్మద్ షా కీలకమని వెల్లడించారు. వాదనలు విన్న కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
READ MORE: US aircraft crash: ఇరాన్తో ఉద్రిక్తతల మధ్య భారీ ప్రమాదం.. ఇరాక్లో కూలిన అమెరికా సైనిక విమానం.!
Also Read
- Khamenei Funeral: ఖమేనీ అంత్యక్రియల్లో "మాస్క్ మ్యాన్".. ఎవరనేది తెలిసింది
- Jagga Reddy : బీఆర్ఎస్ నేతలకు జగ్గారెడ్డి సవాల్.. కేసీఆర్, హరీష్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.!
- Karnataka: ‘‘చిల్లర లేకుపోతే దిగిపో..’’ మంత్రికే షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
- Monsoon: రైతులకు గుడ్ న్యూస్.. జోరందుకోనున్న రుతుపవనాలు.. జూలై 18-25 మధ్య భారీ వర్ష సూచన
ఇంతకు ముందు ఈ కేసు ఢిల్లీ హైకోర్టులో వాదనలకు వచ్చింది. నిందితుడికి బెయిల్ మంజూరు చేయాలని నిందితుడి తరఫు లాయర్ ఢిల్లీ హైకోర్టు ఆశ్రయించారు. అక్కడ బెయిల్ ఇవ్వడం కుదరదని కోర్టు తేల్చి చెప్పింది. నిందితుడిపై వచ్చిన ఆరోపణలు వాస్తవాలనే అనుమానం వస్తుందని కోర్టు తెలిపింది. అంతేకాదు.. ఇదే తరహా కేసుల్లో షబీర్ అహ్మద్ షాపై ఇరవై నాలుగు ఫిర్యాదులు వచ్చినట్లు కోర్టు వివరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది. దీంతో నిందితుడు ఈ సారి దేశ అత్యున్నత న్యాయస్థానానికి చేరుకున్నాడు. ఇరువురి తరఫున వాదనలు విన్న సుప్రీంకోర్టు చివరకు బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
తాజావార్తలు
-
Khamenei Funeral: ఖమేనీ అంత్యక్రియల్లో “మాస్క్ మ్యాన్”.. ఎవరనేది తెలిసింది
-
Jagadish Reddy: సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి కౌంటర్
-
Jagga Reddy : బీఆర్ఎస్ నేతలకు జగ్గారెడ్డి సవాల్.. కేసీఆర్, హరీష్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.!
-
Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే డ్రీమ్ రోల్ ఇదేనట.. రాజమౌళి పేరు చెప్పి షాకిచ్చిన హీరోయిన్!
-
Karnataka: ‘‘చిల్లర లేకుపోతే దిగిపో..’’ మంత్రికే షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..