Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!
- పప్పు ముందుగా నానబెట్టాల్సిన అవసరం ఉండదు..
- తక్కువ సమయంలో స్వీట్ షాప్ స్టైల్ మెత్తటి బొబ్బట్లు తయారు
- ట్రై చేయండిలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nethi Bobbatlu Recipe: పండుగ వచ్చిందంటే చాలు.. ఇళ్లలో పిండివంటల సందడి మొదలవుతుంది. ముఖ్యంగా పండుగ సమయాలలో గుర్తొచ్చేది ‘నేతి బొబ్బట్లు’ ఒకటి. అయితే చాలామంది బొబ్బట్లు చేయాలంటే పప్పు నానబెట్టాలి, పిండి నానబెట్టాలి అని గంటల కొద్దీ సమయం కేటాయిస్తుంటారు. కానీ ఇప్పుడు చెప్పబోయే పద్ధతిలో చేస్తే అప్పటికప్పుడు చాలా తక్కువ సమయం, శ్రమతో అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో మెత్తటి బొబ్బట్లను తయారు చేసుకోవచ్చు.
కావలసిన పదార్థాలు:
పిండి కోసం:
* గోధుమపిండి (1 గ్లాసు),
* మైదా పిండి (1 గ్లాసు),
* ఉప్పు (రుచికి సరిపడా),
* పసుపు (పావు టీస్పూన్),
* నెయ్యి,
* నూనె.
Also Read
- Discount On Mobile: తొలి సేల్లో రూ.10,000 తక్కువ ధరకు లభిస్తున్న మోటో 'లగ్జరీ' ఫోన్.. రేపు అందుబాటులోకి..
- Worst Bowling: యువకుడు, ఎత్తుగా ఉన్నాడు, బౌలింగ్ బాగా వేస్తాడు అనుకున్నారు.. కట్ చేస్తే చుక్కలు చూపించారు..
- IND vs ENG 3rd ODI: ఇంగ్లాండ్ బ్యాటర్స్ ఊచకోత.. లార్డ్స్లో 51 ఏళ్ల రికార్డు బద్దలు..
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 1 నుంచి ప్రారంభం..
Subramaniya Bharathi: రోజూ కూలీ కుమారుడు.. తొలి ప్రయత్నంలోనే UPSC క్లియర్.. ఇన్స్పైర్ స్టోరీ..!
పూర్ణం కోసం:
* శనగపప్పు (1.5 గ్లాసు),
* బెల్లం తురుము (2 గ్లాసులు),
* సోంపు (అర టీస్పూన్),
* యాలకులు (4-5),
* ఎండు కొబ్బరి ముక్కలు (కొద్దిగా),
* నెయ్యి.
తయారీ విధానం:
* పిండిని కలుపుకోవడం:
ముందుగా ఒక గిన్నెలో గోధుమపిండి, మైదా పిండి తీసుకోండి. అందులో కొద్దిగా ఉప్పు, పసుపు, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా కలపాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తూ పిండిని మరీ గట్టిగా కాకుండా, కాస్త స్టిక్కీగా (జిగురుగా) కలుపుకోవాలి. చివరగా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి పిండిని బాగా మర్దన చేసి మూత పెట్టి పక్కన ఉంచండి.
* ఇన్స్టంట్ పూర్ణం తయారీ:
పప్పు నానబెట్టే పని లేకుండా శనగపప్పును శుభ్రంగా కడిగి ప్రెషర్ కుక్కర్లో వేయండి. ఒక గ్లాసు పప్పుకి రెండు గ్లాసుల చొప్పున (1.5 గ్లాసుల పప్పుకి 3 గ్లాసుల నీళ్లు) నీళ్లు పోయాలి. అందులో కొంచెం ఉప్పు, నెయ్యి వేసి మీడియం ఫ్లేమ్ మీద 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
* ఫ్లేవర్ కోసం స్పెషల్ పౌడర్:
పప్పు ఉడికేలోపు మిక్సీ జార్లో సోంపు, యాలకులు, ఎండు కొబ్బరి ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇది బొబ్బట్లకు మంచి రుచిని, సువాసనను ఇస్తుంది.
* పూర్ణం ఉడికించడం:
ఉడికిన పప్పులోని నీటిని పూర్తిగా వడకట్టేయాలి. చల్లారిన తర్వాత పప్పును మెత్తగా గ్రైండ్ చేసి ఒక కడాయిలోకి తీసుకోవాలి. అందులో రెండు గ్లాసుల బెల్లం తురుము వేసి చిన్న మంట మీద ఉడికించాలి. బెల్లం కరిగి మిశ్రమం దగ్గరపడుతున్నప్పుడు, ముందుగా సిద్ధం చేసుకున్న సోంపు పొడి, కొంచెం నెయ్యి వేసి కలపాలి. మిశ్రమం పాన్ నుండి వేరుపడుతున్నప్పుడు స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి.
Sugar Control : ఇలా వేయించిన శనగపప్పు తినడం వల్ల కొలెస్ట్రాల్, షుగర్ కు చెక్
* బొబ్బట్లు ఒత్తుకోవడం:
చల్లారిన పూర్ణాన్ని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న మైదా మిశ్రమంలోంచి కొద్దిగా పిండి తీసుకుని, అందులో పూర్ణం ఉండను పెట్టి క్లోజ్ చేయాలి. బట్టర్ పేపర్ లేదా కవర్ మీద నెయ్యి రాసి, చేత్తో గానీ లేదా చపాతీ కర్రతో గానీ పల్చగా ఒత్తుకోవాలి.
* నెయ్యితో కాల్చుకోవడం:
పెన్నం వేడి చేసి, మీడియం ఫ్లేమ్ మీద బొబ్బట్టును వేసి రెండు వైపులా నెయ్యి అప్లై చేస్తూ ఎర్రగా కాల్చుకోవాలి. అంతే.. ఎంతో రుచికరమైన, మెత్తటి నేతి బొబ్బట్లు సిద్ధం.
తాజావార్తలు
-
Discount On Mobile: తొలి సేల్లో రూ.10,000 తక్కువ ధరకు లభిస్తున్న మోటో ‘లగ్జరీ’ ఫోన్.. రేపు అందుబాటులోకి..
-
Prasanna Kumar: టాలీవుడ్లో ముగిసిన యూనియన్ వార్.. రంగంలోకి దిగిన బాలయ్య!
-
Geetanjali Angmo: సుప్రీంకోర్టు మెట్లెక్కిన సోనమ్ వాంగ్చుక్ భార్య.. హైకోర్టు తీర్పుపై సవాల్!
-
Worst Bowling: యువకుడు, ఎత్తుగా ఉన్నాడు, బౌలింగ్ బాగా వేస్తాడు అనుకున్నారు.. కట్ చేస్తే చుక్కలు చూపించారు..
-
Sandeep Reddy: ప్రభాస్ ఫ్యాన్స్కు గుడ్న్యూస్ చెప్పిన వంగా.. ‘స్పిరిట్’ షూటింగ్పై క్రేజీ అప్డేట్!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!