భార్యాభర్తల సంబంధం రోజురోజుకు దిగజారిపోతుంది. కలకాలం కలిసుండాల్సిన దంపతులు.. మధ్యలో పెడదారిన పడుతున్నారు. దీంతో కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతుంది. క్షణిక సుఖం కొందరు అడ్డదారులు తొక్కి.. మధ్యలోనే జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ అగ్ర నేత, వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ వినూత్న శైలితో నిరసన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం పాలస్తీనా అనే పేరును ముద్రించిన బ్యాగ్ను తగిలించుకుని హల్చల్ చేశారు.
Today Gold and Silver Rates: గత కొద్దీ కాలంగా పెరుగుతూ షాకిచ్చిన బంగారం ధరలు వరుసగా రెండు రోజులు భారీగా తగ్గి ఆ తర్వాత రెండు రోజులు స్థిరంగా కొనసాగింది. అయితే , నేడు (మంగళవారం) దేశ వ్యాప్తంగా స్వల్ప పెరుగుదల కనిపించింది. నేడు హైదరాబాద్ మార్కెట్లో సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,500గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.78,000గా ఉంది. తాజాగా బంగారం ధరలలో ఒక తులం పై…
దేశ రాజధాని ఢిల్లీలో ఓ కారు బీభత్సం సృష్టించింది. రోడ్డుపై నిల్చున్న వారిపైకి ఒక్కసారిగా దూసుకొచ్చింది. క్షణాల్లో దూసుకురావడంతో హడలెత్తిపోయారు. మనవడితో నడుచుకుంటూ వెళ్తు్న్న వ్యక్తిని ఢీకొట్టింది.
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహిళా ఓటర్లను ప్రలోభపెట్టే పనిలో పడ్డారు. 'ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన' అమలును ఇటీవలే ప్రకటించిన అరవింద్ కేజ్రీవాల్.. ఒక సర్వేను ఉటంకిస్తూ, ఢిల్లీలోని 60 శాతం మంది మహిళలు తనకు ఓటు వేయబోతున్నారని, 40 శాతం మంది తనకు అనుకూలంగా లేరని అన్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై రాజకీయ ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది. మహిళల భద్రత, రాజధానిలో పెరుగుతున్న నేరాల గ్రాఫ్ను ఎన్నికల ముందు పెద్ద సమస్యగా మార్చాలని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నిస్తోంది. గత నెల రోజుల నుంచి ఢిల్లీలో శాంతిభద్రతలు, మహిళా భద్రతపై కేజ్రీవాల్ కేంద్రాన్ని నిందిస్తున్నారు. వీటిని ఆయుధంగా మలచుకున్నట్లు కనిపిస్తోంది. ఈ అంశాల్లో కేంద్రం పూర్తిగా విఫలమైందని జనాలను నమ్మించి.. ఓట్లు దండుకునేందుకు యత్నిస్తున్నారని పలువురు ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.
దేశ మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. గత రెండు వారాలుగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఇంద్రప్రస్థ అపోలోలో చేర్పించారు. ఇంద్రప్రస్థ అపోలో శనివారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. ఎల్కె అద్వానీని వైద్య నిర్వహణ, పరీక్షల కోసం ఐసీయూలో చేర్చారు.
పంజాబ్-హర్యానా సరిహద్దులో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శంభు సరిహద్దు నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు రైతులు యత్నిస్తున్నారు. రైతులపై పోలీసులు వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. టియర్ గ్యాస్ షెల్స్ వల్ల 17 మంది రైతులు గాయపడ్డారు. ఆ తర్వాత తోటి రైతులు గాయపడిన వాళ్లను స్ట్రెచర్లపై ఆస్పత్రికి తరించారు. కాగా.. ప్రస్తుతం 101 మంది రైతుల బృందం ఢిల్లీ మార్చ్ను విరమించుకుంది. మరోవైపు అంబాలాలోని కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని హర్యానా…
భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.. దీంతో ఆయన్ను అపోలో హస్పటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. కాగా.. ఈరోజు మరోసారి అస్వస్థతకు గురవ్వడంతో ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Kejriwal: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో నేరాలు క్రమంగా పెరిగిపోతున్నాయని మాజీ సీఎం, ఆమ్ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు. ఢిల్లీలో నెలకొన్న పరిస్థితిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.