Delhi: పారిశ్రామికవేత్తలతో నిర్మలమ్మ భేటీ.. 2025-26 బడ్జెట్పై చర్చ
- పారిశ్రామికవేత్తలతో నిర్మలమ్మ భేటీ
- 2025-26 బడ్జెట్పై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. కేంద్ర బడ్జెట్పై కసరత్తు ప్రారంభించారు. ఇటీవలే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. అన్ని రాష్ట్రాల ఆర్థికమంత్రుల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఇక తాజాగా గురువారం వాణిజ్య, పారిశ్రామికవేత్తలతో నిర్మలా సీతారామన్ సమావేశం అయ్యారు. 2025-26 బడ్జెట్పై ఇండస్ట్రీస్ ప్రముఖులతో చర్చించారు. ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, ఆర్థిక శాఖ కార్యదర్శి, డీఐపీఏఎం కార్యదర్శి తుహిన్ కాంత పాండే, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్, వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బర్త్వాల్, ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ హాజరయ్యారు.
ఇది కూడా చదవండి: CRIME: గర్భం దాల్చడం లేదని భర్త బెదిరింపులు.. గొడ్డలితో నరికి చంపిన భార్య..
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
ఫిబ్రవరి 1, 2025న పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. వరుసగా ఎనిమిదో సారి నిరలమ్మ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఎగుమతి, వాణిజ్యం, పరిశ్రమల రంగాలకు చెందిన వాటాదారులు మరియు నిపుణులతో సంప్రదింపులు జరిపారు.
ప్రధాని మోడీ ఇటీవల ఆర్థికవేత్తలుతో సమావేశం అయ్యారు. ఉద్యోగ కల్పన, దీర్ఘకాలిక వృద్ధి వ్యూహాలు, వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడం, ప్రపంచ భౌగోళిక రాజకీయ సవాళ్లను పరిష్కరించడంపై చర్చలు జరిపారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు ఆలోచనా విధానంలో ప్రాథమిక మార్పు అవసరమని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రముఖ ఆర్థికవేత్తలైన అశోక్ గులాటీ, డికె జోషి, సూర్జిత్ భల్లా, జనమేజయ సిన్హా, సౌమ్య కాంతి ఘోష్, అమిత బాత్రా వంటి ప్రముఖులు పాల్గొన్నారు.
Union Minister for Finance & Corporate Affairs Smt. @nsitharaman chairs the fourth Pre-Budget Consultation with the stakeholders and experts from export, trade and industry sectors in connection with the upcoming Union Budget 2025-26, in New Delhi, today.
The meeting was also… pic.twitter.com/5PcWlWodwg
— Ministry of Finance (@FinMinIndia) December 26, 2024
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!