Gurugram: బాలిక ప్రైవేట్ ఫొటోలతో బ్లాక్మెయిల్.. రూ.80 లక్షలు అపహరణ
- గురుగ్రామ్లో దారుణం
- బాలిక ప్రైవేట్ ఫొటోలతో బ్లాక్మెయిల్
- రూ.80 లక్షలు అపహరణ.. ముగ్గురు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ బాలిక ప్రైవేట్ ఫొటోలు కొందరి చేతుల్లోకి వెళ్లాయి. ఇంకేముంది వారికి అస్త్రంగా మారింది. అసభ్యకరమైన ఫొటోలను అడ్డంపెట్టుకుని బెదిరింపులకు గురి చేశారు. దీంతో కంగారు పడిపోయిన బాలిక.. డబ్బు డిమాండ్ చేసినప్పుడల్లా సమర్పించుకుంటూ వచ్చింది. ఇలా దఫదఫాలుగా రూ.80 లక్షలు సమర్పించుకుంది. కుటుంబ సభ్యుల అప్రమత్తత సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన గురుగ్రామ్లో చోటుచేసుకుంది.
గురుగ్రామ్ స్కూల్లో చదువుతున్న బాలిక ఫొటోలను మార్ఫింగ్ చేసి ట్యూషన్ క్లాస్లో విద్యార్థి బెదిరింపులకు దిగాడు. అతడితో మరో ఇద్దరు కలిసి బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టారు. దీంతో కంగారు పడిపోయిన బాలిక.. అమ్మమ్మ ఖాతా నుంచి రూ.80 లక్షలు బదిలీ చేసింది. ఫిబ్రవరి, 2024 నుంచి ఇలా దఫదఫాలుగా రూ.80లక్షల వరకు పంపించింది.
Also Read
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
- Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్లోనే యువతి హత్య
- Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
అయితే ఇటీవల కుటుంబ సభ్యులు.. అకౌంట్లో రూ.80లక్షలు మాయం కావడంతో కంగారు పడ్డారు. భూమి అమ్మగా ఆ డబ్బు వచ్చింది. అయితే అమ్మమ్మ నిరక్షరాసులు. దీంతో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మనవరాలు.. డబ్బులు పంపించింది. డబ్బులు మాయం కావడంతో అమ్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు… దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల సమాచారం ప్రకారం.. ఢిల్లీలో తండ్రి పనిచేసే ఒక ప్రైవేట్ పాఠశాలలోనే బాలిక చదువుతోంది. బాలికను నిందితులు బ్లాక్ మెయిల్ చేశారని, ఆమె ప్రైవేట్ ఫోటోలను ఆన్లైన్లో లీక్ చేస్తామని బెదిరించారని తెలిసింది. డబ్బులు మాయం కావడం అమ్మమ్మ మనవరాలితో గొడవ పడడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
అమ్మమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు.. డిసెంబర్ 21న పోక్సో చట్టం, బీఎన్ఎస్లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఫోన్ రికార్డులు, బ్యాంకు లావాదేవీలను పరిశీలించి హయత్పూర్, మహేంద్రగఢ్కు చెందిన ప్రైవేట్ కార్మికుడు కుశాల్ (22), కాలేజీ విద్యార్థి సుమిత్ కటారియా (20), నిరుద్యోగ యువకుడు సుమిత్ తన్వర్ (20)లను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచిన అనంతరం విచారణ నిమిత్తం రిమాండ్కు తరలించారు. దోపిడీ చేసిన డబ్బును రికవరీ చేయడం మరియు నేరంతో సంబంధం ఉన్న అదనపు వ్యక్తులను గుర్తించడంపై పోలీసులు దృష్టి సారించారు.
తాజావార్తలు
-
Prakash Raj: నాగబాబుకు ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్.. “మేము గొర్రెలం కాదు..!”
-
Devara 2 Update : ‘వర’కు ఏమైంది ?… జాన్వీ ప్రశ్నపై తారక్ సీరియస్
-
AFG vs IND: మనవ్ సుతార్ అరంగేట్రం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గిల్ సేన.!
-
Buchi Babu : జాన్వీ కపూర్ క్యారెక్టర్’పై బుచ్చిబాబు క్షమాపణలు..ఆ సీన్స్ కట్ చేస్తానని ప్రకటన!
-
E85 Fuel: భారత్ లో E85 ఇంధనం విడుదల.. పెట్రోల్ కంటే రూ.20 చౌక..! ప్రత్యేకతలు ఇవే
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!