Gurugram: బాలిక ప్రైవేట్ ఫొటోలతో బ్లాక్మెయిల్.. రూ.80 లక్షలు అపహరణ
- గురుగ్రామ్లో దారుణం
- బాలిక ప్రైవేట్ ఫొటోలతో బ్లాక్మెయిల్
- రూ.80 లక్షలు అపహరణ.. ముగ్గురు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ బాలిక ప్రైవేట్ ఫొటోలు కొందరి చేతుల్లోకి వెళ్లాయి. ఇంకేముంది వారికి అస్త్రంగా మారింది. అసభ్యకరమైన ఫొటోలను అడ్డంపెట్టుకుని బెదిరింపులకు గురి చేశారు. దీంతో కంగారు పడిపోయిన బాలిక.. డబ్బు డిమాండ్ చేసినప్పుడల్లా సమర్పించుకుంటూ వచ్చింది. ఇలా దఫదఫాలుగా రూ.80 లక్షలు సమర్పించుకుంది. కుటుంబ సభ్యుల అప్రమత్తత సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన గురుగ్రామ్లో చోటుచేసుకుంది.
గురుగ్రామ్ స్కూల్లో చదువుతున్న బాలిక ఫొటోలను మార్ఫింగ్ చేసి ట్యూషన్ క్లాస్లో విద్యార్థి బెదిరింపులకు దిగాడు. అతడితో మరో ఇద్దరు కలిసి బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టారు. దీంతో కంగారు పడిపోయిన బాలిక.. అమ్మమ్మ ఖాతా నుంచి రూ.80 లక్షలు బదిలీ చేసింది. ఫిబ్రవరి, 2024 నుంచి ఇలా దఫదఫాలుగా రూ.80లక్షల వరకు పంపించింది.
Also Read
అయితే ఇటీవల కుటుంబ సభ్యులు.. అకౌంట్లో రూ.80లక్షలు మాయం కావడంతో కంగారు పడ్డారు. భూమి అమ్మగా ఆ డబ్బు వచ్చింది. అయితే అమ్మమ్మ నిరక్షరాసులు. దీంతో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మనవరాలు.. డబ్బులు పంపించింది. డబ్బులు మాయం కావడంతో అమ్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు… దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల సమాచారం ప్రకారం.. ఢిల్లీలో తండ్రి పనిచేసే ఒక ప్రైవేట్ పాఠశాలలోనే బాలిక చదువుతోంది. బాలికను నిందితులు బ్లాక్ మెయిల్ చేశారని, ఆమె ప్రైవేట్ ఫోటోలను ఆన్లైన్లో లీక్ చేస్తామని బెదిరించారని తెలిసింది. డబ్బులు మాయం కావడం అమ్మమ్మ మనవరాలితో గొడవ పడడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
అమ్మమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు.. డిసెంబర్ 21న పోక్సో చట్టం, బీఎన్ఎస్లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఫోన్ రికార్డులు, బ్యాంకు లావాదేవీలను పరిశీలించి హయత్పూర్, మహేంద్రగఢ్కు చెందిన ప్రైవేట్ కార్మికుడు కుశాల్ (22), కాలేజీ విద్యార్థి సుమిత్ కటారియా (20), నిరుద్యోగ యువకుడు సుమిత్ తన్వర్ (20)లను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచిన అనంతరం విచారణ నిమిత్తం రిమాండ్కు తరలించారు. దోపిడీ చేసిన డబ్బును రికవరీ చేయడం మరియు నేరంతో సంబంధం ఉన్న అదనపు వ్యక్తులను గుర్తించడంపై పోలీసులు దృష్టి సారించారు.
తాజావార్తలు
-
The Odyssey: రిలీజ్కు ముందే సెన్సేషన్.. హాట్కేకుల్లా అమ్ముడవుతున్న ‘ది ఒడిస్సీ’ టికెట్లు! లక్షకు పైగా..
-
Local Governance : గ్రామ పంచాయతీలకు బంపర్ పవర్.. సొంత ఆదాయంపై పూర్తి హక్కు.!
-
HYDRAA : కోర్టు ఆదేశాలే పట్టవా?.. హైడ్రాపై హైకోర్టు ఫైర్.!
-
Anil Ravipudi: జగపతి బాబుతో కామెడీ సినిమా ప్రకటన.. అనిల్ రావిపూడి ధైర్యమిదే!
-
Kitchen Cleaning Hacks: కడాయిపై పేరుకుపోయిన మొండి మురికి, జిడ్డు తొలగించే సహజ పద్ధతి.. అమ్మమ్మ చెప్పిన సీక్రెట్ ఇదే
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!