ఆంధ్ర ప్రదేశ్ కు ఎంతో కీలమైన పోలవరం ప్రాజెక్ట్ పై ఢిల్లీలో ఈ రోజు కీలక సమావేశం జరిగింది. పోలవరం ప్రాజెక్ట్ డిజైన్లు, నిధులపై ఈ సమావేశం జరుగుతోంది. కేంద్ర జల్ శక్తి సలహాదారు వెదిరే శ్రీరాం అధ్యక్షతన పోలవరం డిజైన్ల పై సమావేశం ప్రారంభం అయింది. గోదావరి వరద ఉధృతికి పోలవరం ప్రధాన డ్యామ్ (ఈసీఆర్ఎఫ్) నిర్మాణ ప్రాంతంలో కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చటంతో పాటు కొంత భాగం దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ను పటిష్ఠం చేయడంపై…
ఢిల్లీలో ముండ్కా అగ్ని ప్రమాదం మరవక ముందే మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఢిల్లీలోని ముండ్కాలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 29 మంది మరణించగా…మరో కొంత మంది ఆచూకీ గల్లంతైంది. ఇదిలా ఉంటే ఢిల్లీలోని నరేలా లోని ఓ ప్లాస్టిక్ గ్యాన్యులేషన్ ఫ్యాక్టరీలో శనివారం అర్థరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరి పెద్ద ప్రమాదం ఏర్పడకుండా రక్షించారు.…
ఢిల్లీ ముండ్కా అగ్ని ప్రమాదంలో ఇప్పటికి 27 మంది మృతి చెందారు. మరోవైపు మిస్సైన వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటి వరకు 29 మంది కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది. వీరిలో 5 గురు పురుషులు కాగా… 24 మంది మహిళలు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు మరనించిన 27 మందిలో కేవలం ఇద్దరిని మాత్రమే గుర్తించారు అధికారులు. మిగతా వారిని గుర్తించేందుకు ఫోరెన్సిక్ టీం రంగంలోకి దిగింది. 25 మంది డీఎన్ఏ సాంపిళ్లను కలెక్ట్ చేశారు.…
దేశరాజధాని ఢిల్లీ ఉలిక్కిపడింది. శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 27 మంది సజీవ దహనమయ్యారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం వుందంటున్నారు. పశ్చిమ ఢిల్లీలోని ముంద్రా మెట్రో స్టేషన్ 544 పిల్లర్ వద్దనున్న నాలుగంతస్తుల వాణిజ్యం భవనంలో నిన్న సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. భవనంలోని మొదటి అంతస్తులో ఉన్న సీసీ టీవీ కెమెరా, రూటర్ తయారీ కంపెనీ…
ఢిల్లీలో శుక్రవారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఢిల్లీ ముండ్కా ఫైర్ ఆక్సిడెంట్ లో ఇప్పటి వరకు 27 మరణించగా… 30 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోెంది. పశ్చిమ ఢిల్లీ ముడ్కా మెట్రోస్టేషన్ సమీపంలోని ఓ భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో భారీగా ప్రాణ నష్టం సంభవించింది. నిన్న ఘటన జరిగిన వెంటనే 24 ఫైర్ ఇంజిన్ల ద్వరా మంటలు ఆర్పే ప్రయత్నం…
దేశ రాజధాని ఢిల్లీ వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్. బుల్డోజర్లలో ఆక్రమణలను కూల్చివేస్తున్నారు. ఈ బుల్డోజర్ కూల్చివేతల వివాదం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కొన్ని ఢిల్లీలోని కొన్ని ఏరియాల్లో కూల్చివేతలకు వ్యతిరేఖంగా స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు తీవ్ర ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. అధికార ఆప్, కాంగ్రెస్, వామపక్షాల నాయకులు ఎంతగా వ్యతిరేఖించినా ఢిల్లీ మున్సిపల్ అధికారులు తగ్గడం లేదు. పోలీసులు, సీఆర్ఫీఎఫ్ భద్రత నడుమ ఆక్రమణలను కూల్చివేస్తున్నారు. ఇటీవల ఢిల్లీలోని…
కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. ఈ మధ్య తెలంగాణలో కేఏ పాల్పై దాడి జరిగిన విషయం తెలిసిందే కాగా.. ఢిల్లీ వెళ్లిన ఆయన ఈ వ్యవహారంపై కూడా ఫిర్యాదు చేసినట్టుగా చెబుతున్నారు. అమిత్షాతో సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన పాల్.. తెలంగాణలో జరుగుతున్న అవినీతి అన్యాయం అక్రమాలు నా జీవితంలో ఎన్నడూ చూడలేదన్నారు.. అమిత్ షాతో అనేక విషయాలను చర్చించాను.. కేసీఆర్ అవినీతి, కేటీఆర్ అక్రమాలు, కేసీఆర్…
రోజుకో కొత్త తరహాలో డ్రగ్స్ను తరలిస్తున్నారు స్మగ్లర్లు.. ప్యాసింజర్ విమానాల్లో డ్రగ్స్ తరలిస్తూ వరుసగా దొరికిపోతున్న ఘటనలు చాలా ఉండగా.. ఉప్పుడు.. కార్గోను ఎంచుకున్నారు.. అది కూడా పసిగట్టిన డీఆర్ఐ అధికారులు.. ఢిల్లీ అంతర్జాతీయ కార్గోలో భారీగా డ్రగ్స్ పట్టివేశారు.. రూ.434 కోట్ల విలువ చేసే హెరాయిన్ సీజ్ చేశారు డీఆర్ఐ అధికారులు.. ఉగాండా నుండి ఢిల్లీ వచ్చిన ఓ భారీ పార్శిల్లో హెరాయిన్ను గుర్తించారు. తెల్లటి హెరాయిన్ను ట్రాలీ బ్యాగ్ల కింద దాచి తరలించే ప్రయత్నం…
దేశవ్యాప్తంగా సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవరిస్తున్న స్వచ్ఛంద సంస్థలపై రైడ్స్ నిర్వహిస్తోంది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం నిబంధనలను ఉల్లంఘించి పలు స్వచ్ఛంద సంస్థలకు అనుమతులు ఇచ్చినందుకు సీబీఐ ఈ దాడులు నిర్వహిస్తోంది. ఎన్జీఓ సంస్థలు, వాటికి సంబంధించిన వ్యక్తులపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వేస్టిగేషన్ టీమ్ దాడులు చేస్తోంది. దేశ వ్యాప్తంగా 40 ప్రాంతాల్లో.. హైదరాబాద్, ఢిల్లీ, కోయంబత్తూర్, మైసూర్, రాజస్థాన్ ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(ఎఫ్సీఆర్ఏ) నిబంధనలు…
అక్రమ రవాణాకు ఎయిర్ పోర్టులు , సీ పోర్టులు వేదికలు అవతున్నాయి. ఇటీవల కాలంలో దేశంలోని పలు విమానాశ్రాయాల్లో డ్రగ్స్, బంగారం పట్టుబడుతున్నాయి. విదేశాల నుంచి దేశానికి అక్రమంగా వీటిని రవాణా చేస్తున్న సమయంలో అధికారులు పట్టుకుంటున్నారు. దీనికి తోడు సముద్రమార్గాల ద్వారా అక్రమార్కులు డ్రగ్స్ ను దేశంలోకి తీసుకువస్తున్నారు. తాజా దేశంలో బంగారం, డ్రగ్స్ రవాణా చేస్తున్న వారిని పట్టుకున్నారు. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి బంగారం పట్టుబడగా… తమిళనాడు కోయంబత్తూర్ ఎయిర్ పోర్టులో భారీ…