రాష్ట్రపతి ఎన్నికలకు సమయం దగ్గర పడింది.. ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేయనుంది కేంద్ర ఎన్నికల సంఘం.. ఇవాళ్టి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది.. మరోసారి ఏకగ్రీవంగా రాష్ట్రపతిని ఎన్నుకోవాలని భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు సాగిస్తుండగా.. ఉమ్మడి అభ్యర్థిని నిలిపేందుకు విపక్షాలు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. అందులో భాగంగా టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇవాళ ఢిల్లీ వేదికగా కీలక సమావేవాన్ని ఏర్పాటు చేశారు.. బీజేపీయేతర పక్షాలకు చెందిన 20 మందికి పైగా నేతలకు…
రాష్ట్రపతి ఎన్నికల తరుణంలో దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. ఓవైపు థర్డ్ ఫ్రంట్, కొత్త పార్టీ ఏర్పాటు వైపు తెలంగాణ సీఎం కేసీఆర్ అడుగులు వేస్తుంటే.. మరోవైపు.. ఎన్డీయేతర పార్టీలను ఏకం చేసే పనిలో పడిపోయారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. దీనికోసం ఈ నెల 15న ఢిల్లీ వేదికగా కీలక సమావేశం నిర్వహించనున్నారు.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలపాలని విపక్షాలకు పిలుపునిచ్చిన దీదీ.. తాను ఏర్పాటు చేసే సమావేశానికి రావాల్సిందిగా 22…
దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు ప్రజనలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. త్వరలో కరోనా ఫోర్త్ వేవ్ రాబోతుందా అనే భయాలు వెంటాడుతున్నాయి. గతం కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత మూడు నెలల కాలం నుంచి దేశంలో రోజూ వారీ కేసుల సంఖ్య కేవలం 3 వేల లోపే ఉంటోంది. అయితే గత వారం నుంచి మాత్రం అనూహ్యంగా కేసులు 6 వేలు, 7 వేలకు చేరుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్రల్లో ఎక్కువ గా కేసులు…
ఇటీవల బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు గత వారం దేశవ్యాప్తంగా ముస్లింలు ఆందోళనలు చేస్తున్నారు. శుక్రవారం ప్రార్థనల అనంతరం పెద్ద ఎత్తున ఆందోళన, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఇదే సమయంలో కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు చెలరేగాయి. ముఖ్యంగా యూపీలోని ప్రయాగ్ రాజ్, కాన్పూర్, సహరాన్ పూర్ ప్రాంతాల్లో రాళ్ల దాడులు జరిగాయి. జార్ఖండ్ రాంచీలో హింసాత్మక ఘటనలు చెలరేగాయి. పోలీసులకు, ఆందోళనకారుల ఘర్షణల్లో ఇద్దరు మరణించారు. పశ్చిమ బెంగాల్ హౌరాలో…
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి చేరుకున్నారు.. ఏఐసీసీ కార్యాలయం నుంచి ర్యాలీ ఈడీ ఆఫీసుకు వెళ్లారు.. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి హాజరయ్యారు. ఆయన వెంట ఆయన సోదరి, పార్టీ అధినేత్రి ప్రియాంక గాంధీ వాద్రా ఉన్నారు. అయితే, ర్యాలీలో పాల్గొన్న నేతలను అడ్డుకుని అరెస్ట్ చేశారు పోలీసులు.. ఇక, ఈడీ కార్యాలయంలో రాహుల్ గాంధీ విచారణ…
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరయ్యేందుకు సిద్ధం అయ్యారు.. నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసులు జారీ చేయగా.. ఇవాళ ఈడీ ముందుకు వెళ్లనున్నారు రాహుల్ గాంధీ.. ఇదే సమయంలో సత్యమేవ జయతే అంటూ భారీ స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది కాంగ్రెస్ పార్టీ.. దేశవ్యాప్తంగా ఈడీ కార్యాలయాల ఎదుట ఆందోళనలకు పిలుపునిచ్చారు.. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తమ…
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు హాజరుకానున్నారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. నేషనల్ హెరాల్డ్ కేసులో.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీకి ఇటీవల సమన్లు జారీ చేసింది ఈడీ… విచారణకు హాజరుకావాలని కోరింది. జూన్ 13న ఈడీ ముందు రాహుల్ హాజరుకానుండగా.. 23వ తేదీన సోనియా గాంధీ ఈడీ ముందుకు వచ్చే అవకాశం ఉంది.. Read Also: Astrology: జూన్ 13 సోమవారం దినఫలాలు…
తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ లో అధికారం చేజిక్కించుకున్న తరువాత ఆ దేశం నుంచి ఇండియాకు విమాన సర్వీసులు నిలిచిపోయాయి. అయితే మరికొన్ని రోజుల్లో ఇండియాకు ఆఫ్ఘన్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభించాలని అరియానా ఆఫ్ఘన్ ఎయిర్ లైన్స్ భావిస్తోంది. భారత్ తో తాలిబన్లు దౌత్య సంబంధాలను పున: ప్రారంభించేందుకు ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఆఫ్ఘన్ తో దౌత్య సంబంధాలను మెరుగు పరుచుకోవడానికి భారత్ నుంచి అత్యున్నత ప్రతినిధి బృందం కాబూల్ వెళ్లింది. అక్కడ ప్రభుత్వ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్…
భారత్ తో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత రెండు మూడు రోజుల నుంచి కేసుల సంఖ్య పెరిగింది. తాజాగా బుధవారం ఒక్క రోజే ఇండియాలో 7 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి దాదాపుగా 3 నెలల తరువాత గరిష్ట స్థాయికి కేసుల సంఖ్య చేరుకుంది. ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళలు కరోనా హాట్ స్పాట్స్ గా మారాయి. ఈ మూడు ప్రాంతాల్లోనే ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా ఢిల్లీలో గురువారం కొత్తగగా 622…
కొన్ని రోజుల క్రితం ఒక టీవీ చర్చా కార్యక్రమంలో భాజపా జాతీయ అధికారి ప్రతినిధి నుపుర్ శర్మ మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఢిల్లీ మీడియా విభాగ బాధ్యుడు నవీన్ జిందాల్ అభ్యంతరకరమైన రీతిలో ట్విటర్లో స్పందించడం ఇటీవల తీవ్ర దుమారానికి తెరలేపిన విషయం తెలిసిందే. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగిన భాజపా.. నుపుర్ను సస్పెండ్ చేయడంతో పాటు జిందాల్ను పార్టీ నుంచి బహిష్కరించింది. ఆ తర్వాత నుపుర్ తన వ్యాఖ్యలకు క్షమాపణలు కూడా తెలిపారు.…